అన్వేషించండి

Diwali 2024 Date : ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే

Deepavali 2024 : తెలుగు రాష్ట్రాల్లో దీపావళిని ఎప్పుడు చేసుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇంతకీ 2024లో దీపావళి తేది ఎప్పుడు? పండితుల ఏమి చెప్తున్నారంటే..

Deepawali 2024 Date : పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే పండుగలలో దీపావళి ఒకటి. దసరా పండుగ(Dusshera 2024) తర్వాత వచ్చే ఈ దీపాల పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా నిర్విహించుకుంటారు. అజ్ఞానంపై జ్ఞానం.. చీకటిపై వెలుగు గెలిచిందనే గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. అయితే ఈసారి 2024లో దీపావళి(Diwali 2024) ఏరోజు వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

దీపావళి ఎప్పుడంటే..(Deepavali 2024 Date)

ప్రతి సంవత్సరం దీపావళిని కార్తీక మాసంలోని అమావాస్య రోజు జరుపుకుంటారు. అయితే 2024లో దీపావళి ఏ రోజు అనే దానిపై కాస్త గందరగోళం మొదలైంది. ఎందుకంటే దృక్ పంచాంగం ప్రకారం.. అమవాస్య అక్టోబర్ 31, 2024న వచ్చింది. అలాగే నవంబర్ 1వ తేదీన కూడా అమావాస్య ఉంది. దీంతో ఏ రోజు దీపావళి చేసుకోవాలనేదానిపై కాస్త గందరగోళం ఏర్పడింది. అక్టోబర్​ 31న చేసుకోవాలని కొందరంటుంటే.. నవంబర్ 1వ తేదీనే పండుగ అని మరికొందరు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో పండితులు దీపావళి వేడుకలకు నవంబర్ 1 అనువైన తేదీగా చెప్తున్నారు. ఆరోజు లక్ష్మీ పూజ చేసుకుని పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చంటున్నారు. కార్తీక మాసంలోని 15వ రోజు కూడా నవంబర్ ఒకటే అంటున్నారు. దీపావళిని దేశవ్యాప్తంగా గెజిటెడ్ హాలిడేగా పాటిస్తారు. అలా చూసుకున్నా నవంబర్ 1వ తేదీనే దీపావళి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా నవంబర్ 1వ తేదీనే దీపావళిగా తెలుస్తోంది. 

చరిత్ర ఇదే..(Diwali History)

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని చేసుకుంటారు. అయితే పురాణాల ప్రకారం దీనిని సెలబ్రేట్ చేసుకునేందుకు వివిధ కారణాలు ఉన్నాయి. సత్యభామ, శ్రీకృష్ణుడు కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించి.. ప్రజలకు రక్షణ కల్పించినందుకు గుర్తుగా దీనిని కొందరు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వనవాసానికి వెళ్లిన రాముడు.. రావణుడిని ఓడించి.. తిరిగి అయోధ్యకు సీతతో, లక్ష్మణుడుతో, హనుమంతుడుతో కలిసి వచ్చినందుకు ఈ దీపావళిని పాటిస్తారని చెప్తారు. ఇదే రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారని కొందరు నమ్ముతారు. 

దీపావళి ప్రాముఖ్యత..(Diwali Significance)

హిందువులు ప్రధానంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన నరక చతుర్దశి చేసుకుంటారు. నవంబర్ 1వ తేదీన లక్ష్మీ దేవికి పూజలు చేసి.. దీపావళిని చేసుకుంటారు. ఆరోజు ప్రజలు ఆనందంగా.. దీపాలు వెలిగిస్తూ.. సమయాన్ని బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దీపావళికి కొత్త దుస్తులు వేసుకుని లక్ష్మీ పూజను చేసి.. స్వీట్లు పంచుతూ.. క్రాకర్స్ కాలుస్తారు. గిఫ్ట్​లు ఇచ్చి పుచ్చుకుంటారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Diwali Precautions)

దీపావళి సమయంలో చాలామంది క్రాకర్స్ కాలుస్తారు. ఈ సమయంలో వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. పైగా పొగవల్ల దగ్గు వంటి శ్వాస సమస్యలు తలెత్తుతాయి. పర్యావరణానికి కూడా ఇవి హాని కలిగిస్తాయి. పటాకులు కాల్చే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఈ నేపథ్యంలోనే పర్యావరణహిత క్రాకర్స్ కాల్చాలంటూ కొందరు ఔత్సాహికులు అవగాహన కలిపిస్తున్నారు. దీపాల పండుక్కి.. దీపాలను వెలిగించి.. ప్రశాంతంగా చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. 

Also Read : టేస్టీ సగ్గుబియ్యం పాయసం.. నిమిషాల్లో చేసుకోగలిగే రెసిపీ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget