అన్వేషించండి

TSPSC News: టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఛైర్మన్‌, సభ్యులు నియామకానికి నోటిఫికేషన్‌

Telangana Public Service Commission: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. ఈ మేరకు కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC Latest News: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)ను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఛైర్మన్‌, సభ్యులు నియామకానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఇప్పటి వరకు ఛైర్మన్ గా కొనసాగిన బి జనార్ధన్‌రెడ్డి, సభ్యులు ఆర్‌సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేయడం, వాటిని గవర్నర్‌ తమిళ సై ఆమోదించడంతో చకాచకా జరిగిపోయాయి. వీరి రాజీనామాలు ఆమోదం పొందడంతో కొత్త ఛైర్మన్, సభ్యులు నియామకాన్ని వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృస్టి సారించి ఆ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆశావహులు నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

పేపర్‌ లీకేజీ వ్యవహారంతో రచ్చ.. 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) చేపట్టిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలతోపాటు కమిషన్‌ నిర్వహించిన పలు పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడంతో టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట మంటగలిసిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టి సారించిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంపై విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు పేపర్‌ లీకేజీ వ్యవహారానికి కారణమైన సుమారు 105 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. మిగిలిన వారి పాత్రపైనా విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో పాత్రదారులు, సూత్రదారులపైనా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఛైర్మన్ సహా సభ్యులు రాజీనామా చేయగా, గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

యూపీఎస్సీ తరహాలో అమలుకు..

గతంలో టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజీతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. యూపీఎస్సీ తరహాలో ఖాళీలు భర్తీ చేసేందుకు అనుగుణంగా యోచించింది. అదే సమయంలో కేరళలో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కార్యదర్శితోపాటు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులతో కూడిన కమిటీ వెళ్లింది. వీరు అందించే నివేదిక ఆధారంగా మార్పులను ప్రభుత్వం చేయనుంది. 

నిరుద్యోగుల ఆగ్రహంతో బీఆర్ఎస్ ఓటమి..

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంతో గత బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్ట మంటగలిసింది. నిరుద్యోగులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగుల ఆగ్రహమే కారణంగా చెబుతారు. ఇది గమనించిన రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా హామీలను ప్రకటించారు. ప్రభుత్వ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో విద్యార్థుల ఆవేదనకు కారణమైన టీఎస్‌పీఎస్సీ(TSPSC)ని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రక్షాళన చేస్తామని హామీ  ఇచ్చారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త ఛైర్మన్ , సభ్యులు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల..
టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Embed widget