అన్వేషించండి

TS DSC: 'డీఎస్సీ' నియామక పరీక్షలు ఇప్పట్లో లేనట్లే! ఫిబ్రవరిలోనే పరీక్షల నిర్వహణ?

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఫిబ్రవరి దాకా పరీక్షల నిర్వహణ అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్‌టీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్‌ అయాన్‌ చేపట్టింది.

తెలంగాణలో ఎన్నికల కారణంగా నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. త్వరలోనే వాయిదా పడిన పరీక్షల తేదీలను వెల్లడించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన అక్టోబరు 13న ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఫిబ్రవరి దాకా పరీక్షల నిర్వహణ అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్‌టీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్‌ అయాన్‌ చేపట్టింది. టీసీఎస్‌ సంస్థ జాతీయ స్థాయి ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. డిసెంబరు, జనవరిలో పలు జాతీయస్థాయి పరీక్షలు ఉన్నాయని ముందుగానే ఆ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖకు స్పష్టం చేశారు. మళ్లీ ఫిబ్రవరిలోనే స్లాట్లు దొరుకుతాయని సెప్టెంబరులోనే ఆ సంస్థ స్పష్టం చేసినట్లు తెలిసింది. 

ఇక జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అందువల్ల ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ జేఈఈ మెయిన్‌ కంటే ముందుగా స్లాట్లు దొరికితే జనవరి రెండో వారం నుంచి జనవరి 24వ తేదీ లోపు జరపాలన్న యోచనలో కూడా విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. విద్యాశాఖ మాత్రం పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం..
ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు అక్టోబర్‌ 21తో ముగియనుంది. ఇప్పటివరకు సుమారు 80 వేల దరఖాస్తులు అందాయి. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ గడువును కూడా పొడిగించే అవకాశం ఉంది. ఈసారి 2 - 2.5 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ-2023 పరీక్షల కోసం పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలకు నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే నవంబరు 30న పోలింగ్‌ ఉండటంతో ఆన్‌లైన్‌ పరీక్షలైనందున సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పరీక్షల్లో రెండు రోజులపాటు లేదా నవంబరు 25 నుంచి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షల వరకు వాయిదా వేస్తారని విద్యాశాఖ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. తాజాగా కొందరు అభ్యర్థులు టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేయాలని, టీఎస్‌పీఎస్‌సీ సైతం గ్రూపు-2ను వాయిదా వేసిందని విన్నవించినా ఇవి ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందున పూర్తిగా వాయిదా వేసేది లేదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వారికి తేల్చిచెప్పారు. తాజాగా టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

ALSO READ:

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget