అన్వేషించండి

TS DSC: 'డీఎస్సీ' నియామక పరీక్షలు ఇప్పట్లో లేనట్లే! ఫిబ్రవరిలోనే పరీక్షల నిర్వహణ?

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఫిబ్రవరి దాకా పరీక్షల నిర్వహణ అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్‌టీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్‌ అయాన్‌ చేపట్టింది.

తెలంగాణలో ఎన్నికల కారణంగా నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. త్వరలోనే వాయిదా పడిన పరీక్షల తేదీలను వెల్లడించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన అక్టోబరు 13న ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఫిబ్రవరి దాకా పరీక్షల నిర్వహణ అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్‌టీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్‌ అయాన్‌ చేపట్టింది. టీసీఎస్‌ సంస్థ జాతీయ స్థాయి ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. డిసెంబరు, జనవరిలో పలు జాతీయస్థాయి పరీక్షలు ఉన్నాయని ముందుగానే ఆ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖకు స్పష్టం చేశారు. మళ్లీ ఫిబ్రవరిలోనే స్లాట్లు దొరుకుతాయని సెప్టెంబరులోనే ఆ సంస్థ స్పష్టం చేసినట్లు తెలిసింది. 

ఇక జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అందువల్ల ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ జేఈఈ మెయిన్‌ కంటే ముందుగా స్లాట్లు దొరికితే జనవరి రెండో వారం నుంచి జనవరి 24వ తేదీ లోపు జరపాలన్న యోచనలో కూడా విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. విద్యాశాఖ మాత్రం పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం..
ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు అక్టోబర్‌ 21తో ముగియనుంది. ఇప్పటివరకు సుమారు 80 వేల దరఖాస్తులు అందాయి. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ గడువును కూడా పొడిగించే అవకాశం ఉంది. ఈసారి 2 - 2.5 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ-2023 పరీక్షల కోసం పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలకు నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే నవంబరు 30న పోలింగ్‌ ఉండటంతో ఆన్‌లైన్‌ పరీక్షలైనందున సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పరీక్షల్లో రెండు రోజులపాటు లేదా నవంబరు 25 నుంచి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షల వరకు వాయిదా వేస్తారని విద్యాశాఖ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. తాజాగా కొందరు అభ్యర్థులు టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేయాలని, టీఎస్‌పీఎస్‌సీ సైతం గ్రూపు-2ను వాయిదా వేసిందని విన్నవించినా ఇవి ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందున పూర్తిగా వాయిదా వేసేది లేదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వారికి తేల్చిచెప్పారు. తాజాగా టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

ALSO READ:

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Year Ender 2025 : మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Embed widget