SSC JE Final Result: ఎస్ఎస్సీ జేఈ తుది ఫలితాలు విడుదల, 1701 మందికి ఉద్యోగాలు
SSC JE Result: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది.

SSC JE Final Results: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) తాజాగా విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 1701 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్-563, ఓబీసీ-480, ఎస్సీ-322, ఎస్టీ-165, ఈడబ్ల్యూఎస్-171 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది.
జూనియర్ ఇంజినీర్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కటాఫ్ మార్కులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 1,765 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజా పరీక్షకు సంబంధించిన అడ్మిట్కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. జూన్ 5 నంచి 7 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఇస్తారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పేపర్-2 రాతపరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
భారీగా పెరిగిన పోస్టులు..
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారీగా పెంచిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ సమయంలో 968 పోస్టులను ప్రకటించగా.. ఆ సమయంలో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ పోస్టులను ప్రకటించలేదు. ఆ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించగా... ఈ విభాగంలో 839 పోస్టులను కేటాయించింది. ఇందులో సివిల్ విభాగంలో 489 పోస్టులు, ఎలక్ట్రికల్ & మెకానికల్ విభాగాల్లో 350 పోస్టులను జతచేసింది. అయితే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ విభాగంలో గతంలో 121 పోస్టులను 92కి, సివిల్ విభాగంలో 217 పోస్టులను 206కు తగ్గించింది. అంటే 40 పోస్టులు తగ్గాయి. దీంతో నోటిఫికేషన్లో పేర్కొన్న 966 పోస్టులకు అదనంగా 799 పోస్టులు కలిపినట్టయింది. ఈ కారణంగా మొత్తం ఖాళీల సంఖ్య 1765కి చేరింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

