అన్వేషించండి

IRMS 2023: యూపీఎస్సీ ద్వారానే ఐఆర్‌ఎంఎస్‌ పరీక్ష నిర్వహణ, ఎగ్జామ్స్ ఇలా!

ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్(ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ డిసెంబరు 2న ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్(ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ డిసెంబరు 2న ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్-30 పోస్టులు, మెకానికల్-30 పోస్టులు, ఎలక్ట్రికల్-60 పోస్టులు, కామర్స్ అండ్ అకౌంటెన్సీ-30 పోస్టుల చొప్పున మొత్తం 150 పోస్టులకు ఐఆర్ ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే యూపీఎస్సీని కోరినట్లు పేర్కొంది. ఈ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో రెండు దశల్లో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష 4 పేపర్లుగా(డిస్క్రిప్టివ్ విధానంలో) రాయాలి.

పరీక్షల్లో పేపర్-ఎ భారతీయ భాషలు, పేపర్-బి ఇంగ్లిష్‌ క్వాలిఫైయింగ్ పేపర్స్ కింద ఉంటాయి. ఇవి 300 మార్కుల చొప్పున ఉంటాయి. మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకొనే అప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1, పేపర్-2 ఒక్కోటి 250 మార్కులకు ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీల్లో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షల తరహాలోనే వీటికి సిలబస్, ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి.

ఉద్యోగార్థుల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సరికొత్త మార్గాల్లో పయనిస్తుంది. ఇటీవలే అభ్యర్థుల సౌకార్యర్థం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా వినియోగంలోకి తెచ్చింది. పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు ఒక్క క్లిక్‌తో సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందని తెలిపింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్‌ ద్వారా అప్లికేషన్‌ ఫారాలను నింపడానికి ఈ యాప్‌ ఉపయోగపడదు.. కానీ, ఆండ్రాయిడ్‌ యాప్‌ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.
ఇప్పటికే ఓటీఆర్ అందుబాటులోకి...

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే, అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్‌ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్‌ నంబర్‌ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుంది. దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదు ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్‌ నంబర్‌ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్‌ ఉపయోగపడుతుంది.  https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Also Read: 

Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

Navy Jobs: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget