By: ABP Desam | Updated at : 18 Oct 2022 10:21 AM (IST)
ఏపీపీఎస్సీ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 29లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి నవంబరు 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
* కంప్యూటర్ డ్రాట్స్మ్యాన్
పోస్టుల సంఖ్య: 08
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు: గుంటూరు-01, నెల్లూరు-01, కడప-01, చిత్తూరు-03, అనంతపురం-01, కర్నూలు-01.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ సంస్థ నుంచి డ్రాట్స్మ్యాన్( సివిల్) విభాగంలో రెండేళ్ల కోర్సుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అందులో సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: 01/07/2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్మెన్, తెల్ల రేషన్ కార్డు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
జీతం: రూ.34,580 -1,07,210.
రాతపరీక్ష విధానం:
* మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.
* పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
* పేపర్-2లో ఐటీఐ(సివిల్) విభాగం నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
* ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.
* ఇక 50 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 30 నిమిషాల సమయం కేటాయించారు.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2022.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022.
* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.11.2022.
Also Read
'గ్రూప్-1' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పరిధిలో మొత్తం 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో నాన్-గెజిటెడ్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 11 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1 లోపు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, అర్హతలివే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
AIIMS Bibinagar: బీబీనగర్ ఎయిమ్స్లో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
SBI Clerks Recruitment: ఎస్బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
SSC Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>