అన్వేషించండి

Acharya Balkrishna Record: ఆచార్య బాలకృష్ణ అరుదైన ఘనత, ప్రపంచంలోని టాప్ సైంటిస్టులలో చోటు- చారిత్రాత్మకమని బాబా రాందేవ్ కితాబు

Acharya Balkrishna joins world top scientists | ఆచార్య బాలకృష్ణను స్టాన్‌ఫోర్డ్, ఎల్సెవియర్ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చేర్చారని పతంజలి సంస్థ తెలిపింది. చారిత్రాత్మకం అన్నారు బాబా రాందేవ్.

పతంజలి ఆయుర్వేదం సీఈఓ ఆచార్య బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం, ప్రపంచ ప్రసిద్ధ ప్రచురణకర్త ఎల్సెవియర్ విడుదల చేసిన ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ ఘనత ఆచార్య బాలకృష్ణకు వ్యక్తిగతంగానే కాకుండా, పతంజలి, ఆయుర్వేదంతో పాటు భారతదేశానికి గర్వకారణమని సంస్థ పేర్కొంది. 

పతంజలి సంస్థ ఇలా స్పందించింది. "భారతదేశ సనాతన జ్ఞానాన్ని ఆధారిత శాస్త్రీయ విధానాలతో నిరూపించడం ద్వారా, బలమైన సంకల్పం ఉంటే ఏ పనైనా అసాధ్యం కాదని బాలకృష్ణ నిరూపించారు. ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమవుతున్నాయి. ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు సహజ మూలికలకు సంబంధించి చేస్తున్న పరిశోధనలకు మార్గం సుగమం చేస్తాయి" అని పతంజలి పేర్కొంది.

అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్లలో 300 కంటే ఎక్కువ పరిశోధనలు - పతంజలి

ఆచార్య బాలకృష్ణ చేసిన పరిశోధన, ఆయుర్వేద పనులలో లోతైన నైపుణ్యం అతని మార్గదర్శకత్వం నుండి ప్రేరణ పొంది ప్రపంచ వ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ పరిశోధన పత్రికలలో ప్రచురితం అయ్యాయని పతంజలి పేర్కొంది. ఆచార్యు బాలకృష్ణ నిరంతర మార్గదర్శకత్వంలో, పతంజలి 100 కంటే ఎక్కువ ఆయుర్వేద ఔషధాలను అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇది ప్రజలకు ఆయుర్వేద ఔషధాలను మరింత సులభంగా, ఎలోపతి మందుల దుష్ప్రభావాలు లేకుండా చేయడంలో తోడ్పడిందని సంస్థ పేర్కొంది. 

ఆయుర్వేదంపై నమ్మకం, అంకితభావానికి ఫలితం - పతంజలి

యోగా, ఆయుర్వేదంపై 120 కంటే ఎక్కువ పుస్తకాలు, 25 కంటే ఎక్కువ అప్రచురిత పురాతన ఆయుర్వేద తాళపత్రాల రచన ద్వారా ఆయుర్వేదంపై ఆయనకున్న విశ్వాసం, అంకితభావానికి ఫలితమని పతంజలి తెలిపింది. సహజ మూలికలను హెర్బల్ ఎన్‌సైక్లోపీడియా ద్వారా జత చేయడం ద్వారా భవిష్యత్ శాస్త్రీయ తరానికి సమగ్ర నిధిని అందించాలన్న ఆయన దూరదృష్టిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల బృందాలు ప్రశంసించాయి.

ప్రపంచంలోని అనేక దేశాలలో వాడుకలో ఉన్న సాంప్రదాయ వైద్య విధానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఉత్తరాఖండ్‌లోని మాలాగావ్ లోని హెర్బల్ వరల్డ్ ద్వారా ప్రజలకు ఒక జ్ఞానపూర్వక రూపంగా ఆచార్య బాలకృష్ణ అందించారు. ఇది సందర్శకులలో అవగాహన పెంచుతుందని పతంజలి సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రపంచ నాయకత్వం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు - బాబా రామ్‌దేవ్

ఈ సందర్భంగా యోగా గురువు స్వామి రామ్‌దేవ్ స్పందించారు. "ఆచార్య బాలకృష్ణ ఆయుర్వేదాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు ఆయుర్వేదంలో పరిశోధనలకు కొత్త మార్గాలు తెరిచారు" అని అన్నారు. "ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆయన పేరు చేర్చడం సహజ మూలికలు, సనాతన ఆయుర్వేద జ్ఞానంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది భారతదేశ పరిశోధనా సామర్థ్యం, ఇందులోనూ ప్రపంచ నాయకత్వం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు" అని బాబా రాందేవ్ అన్నారు.

పతంజలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ వార్ష్ణేయ్ మాట్లాడుతూ.. "ఆచార్య బాలకృష్ణతో కలిసి పనిచేసే అవకాశం లభించడం మా అదృష్టం. ఆయుర్వేదాన్ని ఆధునిక నిర్ధారణ పద్ధతుల ద్వారా ప్రపంచ వేదికపై స్థాపించడానికి ఆయన చేసిన పరిశోధనలు, అంకితభావాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం ఆచార్య బాలకృష్ణ చేసిన ఈ కృషి మన సనాతన జ్ఞానం, ఆధునిక విజ్ఞానాన్ని సమన్వయం చేస్తుంది. ఆరోగ్యకరమైన, ఆత్మనిర్భర్ భారతదేశానికి బలమైన పునాది వేయడానికి దేశ ప్రజలను మరింత ప్రేరేపిస్తుంది" అని అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Painkiller-Infused Ice Cream: నొప్పి నివారిణి ఐస్ క్రీమ్ ట్రెండింగ్! ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?
నొప్పి నివారిణి ఐస్ క్రీమ్ ట్రెండింగ్! ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?
Black Patches on Neck : మెడపై నల్ల మచ్చలు కనిపిస్తే జాగ్రత్త, మురికి అని లైట్ తీసుకోకండి.. డయాబెటిస్ కావొచ్చు
మెడపై నల్ల మచ్చలు కనిపిస్తే జాగ్రత్త, మురికి అని లైట్ తీసుకోకండి.. డయాబెటిస్ కావొచ్చు
Kidney Warning Sign : ఉదయం కళ్లు, ముఖం ఉబ్బిపోతున్నాయా? కిడ్నీ సమస్యకు సంకేతం కావొచ్చు.. లైట్ తీసుకోకండి
ఉదయం కళ్లు, ముఖం ఉబ్బిపోతున్నాయా? కిడ్నీ సమస్యకు సంకేతం కావొచ్చు.. లైట్ తీసుకోకండి
Navratri Fasting : నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget