అన్వేషించండి
Podharillu Serial Today March 13th: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
Podharillu Serial Today Episode March 13th: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?

పొదరిల్లు సీరియల్
Source : Jio Hotstar
Podharillu Serial Today Episode: పోలీసుస్టేషన్లో పురుషోత్తంకు ఎస్ఐ గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు.మరోసారి మాధవ్ వాళ్ల కుటుంబం జోలికి వెళ్తే సహించేదిలేదని చెబుతాడు. దీంతో ఇంటికి వచ్చిన పురుషోత్తం...కూతురుపై మండిపడతాడు. నువ్వు చేసినపనికి నేను స్టేషన్కు వెళ్లాల్సి వచ్చిందని అనవసరంగా మాటలు పడాల్సి వచ్చిందని అంటాడు. మరి తప్పులేకుండా బావ వాళ్లను స్టేషన్లో ఎందుకు పెట్టించారని గాయత్రని నిలదీస్తుంది. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా మళ్లీకేసులు ఎందుకు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతలో పెళ్లివాళ్లు వచ్చామని ఫోన్ చేయడంతో పురుషోత్తం బయటకు వెళ్తాడు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి పెళ్లిచూపుల్లో కూర్చోకపోయినా...అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టినా మీ మాధవ్ బావను మీనాన్న చంపి జైలుకు వెళ్తాడని తాయరు కూతురుని హెచ్చరిస్తుంది. మర్యాదగా రెడీ అయ్యి పెళ్లి చూపులకు రమ్మని చెప్పి వెళ్లిపోతుంది.
కొడుకులను పోలీసుస్టేషన్లో పెట్టించిన చెల్లిని చంపేందుకు నారాయణ కత్తి నూరుతుండగా...కొడుకులను తీసుకుని మహాలక్ష్మీ ఇంటికి వస్తుంది. ఎందుకు ఇదంతా అని మాధవ్ అడగ్గా...మీ అత్తను చంపి నేను జైలుకు వెళ్తానని అంటాడు. ఏం అవసరం లేదని మహా పోలీసులను తీసుకెళ్లి గాయత్రితో నిజం చెప్పించి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చిందని చెబుతాడు. ఆమాటలు విన్న ఆదినారాయణ ఎంతో సంతోషపడతాడు. మా కోడలుపిల్ల ఇంత మంచిపని చేసిందా అని ఆమెను పొగుడుతాడు. మహా లోపలికి వెళ్లి హారతి తీసుకుని వచ్చి దిస్టితీసి అందరినీ ఇంట్లోకి తీసుకెళ్తుంది.
మాధవ్ మహాకు థ్యాంక్సు చెబుతాడు. ఇవాళ నువ్వు లేకుంటే మా ఇల్లు ఆనందంగా ఉండేదికాదని చెబుతాడు. మా ఇంట్లో దీపం పెట్టడానికి అమ్మాయి వచ్చిందనుకున్నాం కానీ....మహాలక్ష్మీ వచ్చిందని ఇప్పుడే తెలిసిందంటాడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెబుతాడు. ఇందులో నా గొప్పతనం ఏం లేదని...సరైన సమయంలో గాయత్రి పోలీసులకు నిజం చెప్పి మీ అందరినీ కాపాడిందని అంటుంది. దానివల్లే అసలు మేం స్టేషన్కు వెళ్లాల్సి వచ్చిందని కేశవ్ మండిపడతాడు. బంగారంలాంటి మా అన్నయ్యను వాళ్ల నాన్న కొట్టడానికి కారణం కూడా అదేనని చక్రి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు దానివల్ల, దాని పిరికితనం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని అంటారు. ఆడపిల్ల అంతకన్నా ఏంచేస్తుందని మహాలక్ష్మీ సర్దిచెబుతుంది. మీరు మళ్లీ ఆ ఇంటివైపు వెళ్తే బాగుండదని మాధవ్ తమ్ముళ్లను హెచ్చరిస్తాడు.
గాయత్రి వాళ్లఇంట్లో ఆమెకు పెళ్లిచూపుల ఏర్పాట్లు జరుగుతుంటాయి. మగపెళ్లివారిని రిసీవ్ చేసుకుని పురుషోత్తం వాళ్లతు మాట్లాడుతుంటాడు.ఇంతలో బెడ్రూమ్లో రెడీ అవ్వకుండా కూర్చున్న గాయత్రి దగ్గరకు వచ్చిన తాయర్...ఏంటి ఇలా ఉన్నావని మండిపడుతుంది.నేను ఇలాగే వస్తానని చెప్పి మొండికేసి గాయత్రి ఎలాంటి అలంకారం,నగలు లేకుండానే పెళ్లి చూపులకు వస్తుంది. పెళ్లికూతురు మగపెళ్లివారికి బాగా నచ్చుతుంది. ఇంటిపని, వంటపని మొత్తం నా కూతురుకు వస్తుందని తాయర్ ఆమె గురించి చాలా గొప్పగా చెబుతుంది.వచ్చినప్పటి నుంచి పెళ్లికూతురు ఎందుకు అలా మౌనంగా బాధగా ఉందని మగపెళ్లివారు అడగటంతో పురుషోత్తం ఆందోళన చెందుతాడు. ఏంలేదు పెళ్లికాగానే దుబాయ్ వెళ్లిపోవాలని తెలియడంతో నన్ను వదిలి వెళ్లలేక చాలా బాధపడుతోందని తాయర్ చెబుతుంది. పెళ్లికొడుకు తనకు గాయత్రి బాగా నచ్చిందని చెప్పగా...గాయత్రితో తాయరు బలవతంగా పెళ్లికొడుకు నచ్చాడని చెప్పిస్తుంది.
పెళ్లిచూపులు అయిపోగానే గాయత్రి మళ్లీ మాధవ్ను కలిసి సారీ చెప్పేందుకు వెళ్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావని మహా ఆమెను ప్రశ్నిస్తుంది.నాకు మా బావ అంటే ప్రాణమని చెబుతుంది.నువ్వు ఏడ్చి ఉపయోగం లేదని...ధైర్యం ఉంటే మీ అమ్మను ఎదురించి రావాలని చెబుతుంది. లేదంటే నువ్వు ఒకమాట చెబితే చాలు నీ పెళ్లి మీబావతో చేయడానికి మీ మరుదులు ముగ్గురు ఉన్నారని అంటుంది. నాకు ఇష్టం లేని పెళ్లి చెడగొట్టినవాళ్లకు...నీకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లిచేసే సత్తా ఉందని చెబుతుంది.
అంతలో అక్కడికి వచ్చిన నారాయణ...ఇప్పటికైనా ధైర్యం చేసి ఎదురించి రావే అని మేనకోడలికి చెబుతాడు.కానీ ఏడుస్తూ గాయత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మహా వాళ్ల వదిన కబురు చేయడంతో మహా ఆమెను కలవడానికి రెస్టారెంట్కు వెళ్తుంది. ఆమె వెంటే వెనక చక్రి వెళ్తాడు. అక్కడ నిహారికను కలిసిన మహా అసలు జరిగిన విషయం మొత్తం ఆమెకు చెబుతుంది. తాను చక్రిని ప్రేమించి పెళ్లిచేసుకోలేదని...ఆ భూషణ్ బారీనుంచి తప్పించుకోవడానికి వస్తే ఈ పెళ్లి జరిగిందని చెబుతుంది.
మరిన్ని చదవండి
ఇంకా చదవండి
Advertisement



















