అన్వేషించండి
Podharillu Serial Today March 12th: భర్తతో పాటు వాళ్ల అన్నదమ్ములను మహా ఎలా కాపాడింది...? పెద్దిని పోలీసుస్టేషన్ నుంచి బయటకు ఎలా తీసుకొచ్చింది...?
Podharillu Serial Today Episode March 12th: భర్తతో పాటు వాళ్ల అన్నదమ్ములను మహా ఎలా కాపాడింది...? పెద్దిని పోలీసుస్టేషన్ నుంచి బయటకు ఎలా తీసుకొచ్చింది...?

పొదరిల్లు సీరియల్
Source : Social Media
Podharillu Serial Today Episode: మాధవ్తోపాటు చక్రి, కేశవ్, కన్నాను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకురావడంతో మహా పరుగెత్తుకుంటూ పోలీసుస్టేషన్కు వస్తుంది.వీళ్లు ఏ తప్పుచేయలేదని..అందుకు నేనే సాక్ష్యమని చెబుతుంది. ఇంతకు నువ్వు ఎవరమ్మా అని ఎస్ఐ అడగ్గా...నేను చక్రి భార్యనని చెబుతుంది. అయితీ నీమాటలు ఎలా నమ్మగలమని ఎస్ఐ అంటాడు. ఒక అమ్మాయిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ అమ్మాయి తండ్రే వచ్చి కేసుపెట్టాడని చెబుతాడు. వీళ్లను చూస్తుంటే కూడా రౌడీలు మాదిరిగానే ఉన్నారని అంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్లుకూడా వీళ్ల గురించి ఆ ఇంటిగురించి అంత మంచిగా ఏం చెప్పడం లేదని చెబుతాడు.
మాధవ్ కలుగజేసుకుని నువ్వు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు వెళ్లిపో అని అంటాడు. మీరందరూ ఇక్కడ ఉంటే నేను ఇంట్లో ఎలా ఉండగలను పెద్దిఅని చెప్పి మహా బయటకు వెళ్లి గాయత్రికి ఫోన్ చేస్తుంది. మీఇంట్లో వాళ్ల వల్ల ఇప్పుడు మీ భావతోపాటు నలుగురు అన్నదమ్ములు స్టేషన్లో ఉన్నారని చెబుతుంది. ఆ మాటలకు గాయత్రి చాలా ఏడుస్తుంది. నావల్లే ఇదంతా జరిగిందని బాధపడుతుంది. జరిగిపోయిన దాని గురించి బాధలేదని.... ఇప్పుడు నువ్వు స్టేషన్కు వచ్చి మీ బావ త్పు ఏంలేదని చెబితే వాళ్లను విడిచిపెడతారని చెబుతుంది. నన్ను ఇంట్లో పెట్టి గడియ పెట్టారని...బయటకు రాలేనని చెబుతుంది. అయితే నేను ఎస్ఐగారి దగ్గరకు వెళ్లి వీడియోకాల్ చేస్తానని నువ్వు నిజం చెప్పమని చెబుతుంది. దీనికి గాయత్రి సరేనంటుంది.
మహాలక్ష్మీ ఎస్ఐ దగ్గరకు వెళ్లి గాయత్రి వీడియోకాల్లో మాట్లాడుతానందని...మీకు నిజం చెబుతుందని అంటుంది. దీనికి ఎస్ఐ ఓకే అంటాడు. వెంటనే గాయత్రికి వీడియోకాల్ చేయగా...అప్పుడే ఆమె వద్దకు తాయరు వచ్చి ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావని అడుగుతుంది. దీంతో గాయత్రి వీడియోకాల్ ఎంతకీ లిప్ట్ చేయదు. తాయర్ ఫోన్లాక్కుని తన దగ్గర పెట్టుకుంటుంది. పెళ్లిచూపులు అయ్యేవరకు పిచ్చిపిచ్చి పనులు చేశావంటే చంపేస్తానంటూ ఫోన్ తీసుకుని వెళ్లిపోతుంది.
ఏంటమ్మా ఇది ఫోన్ కూడా లిప్ట్ చేయడంలేదని ఎస్ఐ అడగ్గా...వాళ్ల ఇంట్లో వాళ్లతో ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని అంటుంది.మనం ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేద్దామని...గాయత్రి నిజంగా మాధవ్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబితే...మీరు ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదని అనడంతో ఎస్ఐ సరేనని అంటాడు.
మాహా పోలీసులను తీసుకుని తాయారు వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ తాయారు గొడవ చేయడంతో ఎస్ఐ ఆమెను హెచ్చరిస్తాడు. మర్యాదగా మీ కూతురిని పిలిస్తే విచారించి వెళ్లిపోతామని లేకపోతే మీ అందరినీ స్టేషన్కు తీసుకెళ్తామనడంతో చేసేదిలేక తాయర్ గాయత్రిని తీసుకొస్తానని ఇంట్లోకి వెళ్తుంది.ఇప్పుడు పోలీసుల దగ్గర నిజం చెప్పావంటే నేను, మీనాన్న ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి గాయత్రిని బయటకు తీసుకొస్తుంది. పోలీసులు ఎంత ప్రశ్నించినా గాయత్రి నోరుమెదకపోవడంతో మహాలక్ష్మీ ఆమెను ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మౌనంగా ఉన్నావంటే మీ బావకు జీవితాంతం దూరమవ్వడమేగాక.. అతని దృష్టిలో ఎప్పటికీ చెడ్డదానిలా మిగిలిపోతావని చెబుతుంది.
అప్పటికీ ఆమె మాట్లాడకపోవడంతో పోలీసులు వెనుదిరుగుతారు. దీంతో గాయత్రి పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీసులకు నిజం చెబుతుంది. మా అమ్మ నన్నుబెదిరించి నోరు విప్పకుండా చేసిందని చెబుతుంది. దీంతో ఎస్ఐ పురుషోత్తంను స్టేషన్కు తీసుకెళ్తాడు. అమాయకులపై తప్పుడు కేసులు పెట్టినందుకు నీపైనే కేసు పెడతానని హెచ్చరిస్తాడు. మర్యాదగా కేసు వాపస్ తీసుకోమని చెప్పి మాధవ్తోపాటు అందరినీ వదిలేస్తాడు. బయటకు వచ్చిన మాధవ్...ఈరోజు నువ్వు రాకుంటే మేమందరం జైలుకు వెళ్లాల్సి వచ్చేదని మహాకు కృతజ్ఞతలు చెబుతాడు. అందరూ కలిసి ఆనందంగా ఇంటికి వెళ్లిపోతారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















