Meghasandesham Serial Today September 20th: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వను బ్లాక్ మెయిల్ చేసిన భూమి - ఇందును తిట్టిన చెర్రి
Meghasandesham Today Episode: తన పెళ్లి పనులు తండ్రి కృష్ణప్రసాద్ చేతుల మీదుగా జరగకూడదని లేదంటే నేను ఈ పెళ్లే చేసుకోనని ఇందు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: ఇందు తన పెళ్ళి కృష్ణ ప్రసాద్ చేతుల మీదగా జరగొద్దని ఏడుస్తుంది. దీంతో కృష్ణ ప్రసాద్ నీకు ఏం తక్కు వ చేశానని అలా మాట్లాడుతున్నావు ఇందు అని అడగ్గానే నువ్వేం ఎక్కువ చేశావని ప్రశ్నిస్తుంది. దీంతో చెర్రి మీరు తనని బతిమాలడమేంటి. తను అలాగే మాట్లాడుతుంది కానీ మీరు వెళ్లి ఏర్పాట్లు చేయండి. అని చెప్పగానే మీరు నా ఇష్టానికి భిన్నంగా నా పెళ్లి చేయాలని చూస్తే చావనైనా చస్తాను కానీ ఆయన చేతుల మీదుగా పెళ్లి జరగకూడదు అని కరాకండిగా చెప్తుంది.
మీరా: అందిరలో ఆయన పరువు తీయకు ఇందు. నువ్వు ఇలా మాట్లాడితే మీ నాన్న ఎంత బాధపడతారో తెలుసు కదా?
ఇందు: ఆయన్ని ఎవరు బాధపెడతారు. నన్ను బాధపెట్టొద్దు అంటున్నాను. అత్తయ్యా నా పెళ్లి మీరు చేయండి. లేదంటే ఈ పెళ్లే నాకు వద్దు.
అపూర్వ: సరే మరి ఏం చేస్తాం. అది అంత మొండిగా పట్టు పట్టుకుని కూర్చుంది. మీరు త్వరగా రండి. నేను వెళ్లి బావను తీసుకొస్తాను.
చెర్రి: నువ్వు తప్పు చేస్తున్నావే.. ఈ తప్పు నీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం అయ్యే సరికి సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోతుంది.
అని అందరూ వెళ్లిపోతారు. మరోవైపు లోపలికి వెళ్తున్న అపూర్వను అడ్డగిస్తుంది భూమి. నాగు ఫోన్ చూపించి అపూర్వను బెదిరిస్తుంది భూమి. నువ్వు నా మీదకు ఎత్తిన చేయి దించు లేదంటే అంకుల్ నీ మీద చెయ్యి ఎత్తే పరిస్థితి వస్తుంది. అనడంతో అపూర్వ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ కష్టపడకు అంటూ శోభ కింద పడిపోయాక హాస్పిటల్ కు వెళ్లకుండా ఎందుకు ఫ్యాక్టరీకి వెళ్లింది అంటూ నిలదీస్తుంది. అమ్మ చనిపోయిందా? చంపారా? అంటూ అడగడంతో అపూర్వ షాక్ అవుతుంది. ఇవి తెలుసుకుందామనే నేను వచ్చాను. అమ్మ చావుకు కారణం ఎవరైనా వదిలిపెట్టను అమ్మ దగ్గరకే పంపించి క్షమాపణ చెప్పిస్తాను అంటుంది భూమి.
శాంతమ్మ: కన్నవాళ్లను కాదని పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలి అంది కద ఇక మొదలు పెట్టండి బాబు.
శరత్: అపూర్వ రా.. మొదలుపెడదాం.
భూమి ఫోన్ చూపిస్తూ అపూర్వను బెదిరిస్తుంది.
అపూర్వ: కన్నవాళ్లు వాళ్లుండగా మనం గుంజ నాటడం ఇందుకు బాగున్నా.. చూసే వాళ్లకు బాగుండదు బావ. వాళ్లు చేయాల్సిన పని మనం చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి.
శరత్: మరి ఇందు మనమే చేయాలంటుంది కదా?
అపూర్వ: చిన్నపిల్ల దానికేం తెలుసు? తనకంటే తెలియదు. మీకు తెలియదా? అని వచ్చిన వాళ్లు అడిగితే సమాధానం చెప్పాల్సింది మనమే కదా? బావ. మీరా మీరే వచ్చి గుంజ నాటండి.
ఇందు: నేను ఒప్పుకోను. నేను అంటే ఇష్టం లేని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగితే నేను అసలు ఈ పెళ్లే చేసుకోను.
అని గట్టిగా అరవడంతో అపూర్వ వెళ్లి ఇందు చెంప పగులగొడుతుంది.
అపూర్వ: పెద్ద చిన్నా లేకుండా ఏంటా మాటలు. ఏం నాన్నా అనలేవా? మేము ఇవన్నీ చేస్తుంటే మీ అమ్మ చూడు ఎంత బాధపడుతుందో.. నీకోసం నా ఆడపడుచును బాధపెట్టమంటావా?
శరత్: మీ అత్తయ్య ఆలోచించినట్లు నా చెల్లెలు గురించి నేను కూడా ఆలోచించలేదు. అపూర్వ చెప్పినట్లు అన్నీ వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. మీరా రండమ్మా..
అని పిలిచి కృష్ణప్రసాద్, మీరా చేతుల మీదుగా గుంజ నాటించే కార్యక్రమం చేయిస్తాడు శరత్. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు





















