అన్వేషించండి

Janaki Kalaganaledhu August 11th: 'జానకి కలగనలేదు' సీరియల్: ఉగ్రవాదిని ఇంటి అల్లుడుగా చేసుకుంటున్న జ్ఞానంబ కుటుంబం.. స్కూల్ పిల్లలను టార్గెట్ చేసిన కిషోర్?

కిషోర్ 2000 మంది పిల్లలతో ఉన్న స్కూల్ పై బాంబు దాడి చేయటానికి ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki Kalaganaledhu August 11th: జానకి ఒంటరిగా కూర్చొని సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సంబంధం విషయంలో వెన్నెల ఏమాత్రం వెనక్కి తగ్గదని.. అలా అని సమయం తీసుకుందామనుకుంటే.. అత్తయ్య వాళ్ళు వెన్నెల విషయంలో మరింత తొందర పడుతున్నారని అనుకుంటుంది. ఇక రామకు ఈ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటుంది.

అదే సమయంలో అక్కడికి రామ రావడంతో మీతో మాట్లాడాలంటూ.. ఇది రెండు జీవితాలకు సంబంధించిన సమస్య అని.. ఆవేశ పడకుండా ప్రశాంతంగా వినమని అంటుంది. దాంతో రామ ఆశ్చర్యంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారని అడగటంతో వెన్నెల సంబంధం గురించని అంటుంది జానకి. దాంతో రామ ఆ సంబంధం గురించి మీరు మర్చిపోండని అంటాడు.

కానీ జానకి పెళ్లిచూపులు జరిగిపోయాయి ఒకరికొకరు నచ్చుకున్నారని కూడా అంటుంది. దాంతో అబ్బాయి నచ్చకపోయినా కూడా పెళ్లి చేసేయాలా అని రామా అనడంతో.. నచ్చకపోవటానికి అతని మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉన్నాయా.. అతడు ఏమైనా రౌడీయా, ఉగ్రవాదియా అని అంటుంది జానకి. కేవలం చిన్న యాక్సిడెంట్ మాత్రమే చేశాడని అంటుంది జానకి.

దాంతో రామ యాక్సిడెంట్ గురించి కాదు యాక్సిడెంట్ జరిగాక ఆ పెద్దాయనని పట్టించుకోకుండా పోవడమని అంటాడు. దాంతో జానకి ఆ అబ్బాయి ఇందాకే ఫోన్ చేసి.. తన నాన్నకు గుండె నొప్పిని కంగారులో అలా జరిగిందని అంటాడు. మరి ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు తీరిగ్గా ఇంటికి వెళ్లి కథలు అల్లుతున్నాడా అని రామ అంటాడు. ఆ సంబంధం ఒప్పుకోకగాక ఒప్పుకోనని అంటాడు.

ఎందుకు ఆ సంబంధం గురించి అంత ఆరాటపడుతున్నారని రామ అడగటంతో ఎందుకంటే వెన్నెల అతడిని ప్రేమించింది కాబట్టి అని అంటుంది జానకి. వెంటనే రామ ఆవేశంగా వెన్నెల దగ్గరికి బయలుదేరుతుండగా జానకి ఆపుతుంది. రామ మాత్రం వెన్నెలపై కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. జానకి కూడా.. వెన్నెలను ఆ విషయంలో సమర్ధించటం లేదు అని అనటంతో మరెందుకు ఆ సంబంధాన్ని ఒప్పుకున్నారని రామ అడుగుతాడు.

వెన్నెల అతడిని మర్చిపోలేక పోతుందని.. ఒకవేళ ఇతడిని కాదంటే జీవితాంతం పెళ్లి చేసుకోనని అన్నదని అంటుంది. ఆయన మీ తమ్ముడు విషయంలో ఒక న్యాయం వెన్నెల విషయంలో ఒక న్యాయమా అని అడుగుతుంది. అంతేకాకుండా సమస్యను పెద్దదిగా చేయకుండా మీరే అర్థం చేసుకొని ఈ పెళ్లి జరిగేటట్టు చేయమని అంటుంది. దాంతో రామ వెన్నెల కోసం ఒప్పుకుంటాడు.

కానీ వాళ్లను అనరాని మాటలు అన్నానని బాధపడటంతో వెంటనే జానకి కిషోర్ కి ఫోన్ చేసి రామతో మాట్లాడిస్తుంది. ఇక రామ తప్పు తెలుసుకున్నాను అని క్షమాపణలు చెప్తాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత కిషోర్ క్రూరంగా నవ్వుకుంటాడు. ఇక వెన్నెల విషయాన్ని మీరే వెళ్లి అత్త మామయ్యలతో చెప్పండని అంటుంది జానకి. మరోవైపు జ్ఞానంబ గోవిందరాజులపై.. ఆయన తీసుకొచ్చిన సంబంధం గురించి కోపంగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది.

అప్పుడే రామ అక్కడికి వెళ్లి తను పొరపాటు పడ్డానని.. కిషోర్ తన తండ్రికి బాలేదని కంగారులో అలా వెళ్ళాడని.. నిజానికి అతనిది ఏమీ తప్పులేదని.. ఈ సంబంధం ఒప్పుకుంటున్నాను అని అనటంతో గోవిందరాజులు దంపతులు సంతోషపడతారు. అంతేకాకుండా రేపు ఉదయానే నిశ్చితార్థం పెట్టుకుందామని కూడా అనుకుంటారు. ఇక వీరి మాటలు విని జానకి, వెన్నెల కూడా సంతోషపడుతారు.

ఆ తర్వాత వెన్నెల తన అన్నయ్యకు థాంక్స్ చెబుతుంది. దాంతో రామ నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానని అంటాడు. అప్పుడే గోవిందరాజులు పంతులు గారితో మాట్లాడేసానని సంతోషంగా చెబుతాడు. ఇక జానకి వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడమని రామతో అనడంతో గోవిందరాజులు నేను మాట్లాడుతానని అంటాడు. ఆ తర్వాత గోవిందరాజులు వాళ్లతో ఫోన్ చేసి సంబంధం గురించి మాట్లాడటంతో కిషోర్ తండ్రి మొదట ఒప్పుకోనట్లు మాట్లాడుతూ ఉంటాడు.

ఇక కిషోర్ ఒప్పుకోమని బెదిరించడంతో సరే మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా ఒప్పుకున్నాంలే అని అంటాడు. రేపు ఉదయాన్నే నిశ్చితార్థం అని కూడా అంటాడు. ఇక వెన్నెల తండ్రి దగ్గరికి వచ్చి థాంక్స్ అని చెబుతుంది.  మరోవైపు మల్లిక తల పీక్కుంటుంది. పోలేరమ్మ చూసిన సంబంధాన్ని అందరూ ఎందుకు వద్దన్నారని.. ఇప్పుడొచ్చిన సంబంధాన్ని కాదని మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారు అని తెగ ఆలోచనలో పడుతుంది.

ఈ సంబంధం విషయంలో వెన్నెల ఎందుకు అంత సంతోషంగా ఉందని అనుకుంటుంది. వీటి అన్నింటి వెనుక ఏదో జరుగుతుందని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు పెళ్లి ఫిక్స్ అయిందని ఇక ప్లాన్ సక్సెస్ అయినట్లే అని తన తల్లిదండ్రులతో అంటాడు ఈశ్వర్. అంతేకాకుండా కట్నం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయొద్దు అని వాళ్లకు గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పుడే మస్తాన్ ఫోన్ చేయగా స్కూల్లో బాంబ్ పెట్టమని.. 2000 మంది పిల్లల గురి తప్పకూడదు అని అంటాడు.

ఆ తర్వాత రామ దగ్గరికి జానకి సంతోషంగా వచ్చి వెనకాల నుండి హగ్ చేసుకుని.. థాంక్స్ చెబుతుంది. మీ వల్లే ఇంట్లో వాళ్లంతా ఈరోజు సంతోషంగా ఉన్నారని అంటుంది. నిజం తెలుసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అంటుంది. దాంతో రామ ఒకవేళ నా మనసు మార్చుకోలేక పోతే జరిగే అనర్ధాలు ఏంటో అర్థం అవుతుందని అందుకే రెండు అడుగులు వెనక్కి వేశానని అంటాడు. ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే వెన్నెల ఎంత బాధ పడుతుందో ఊహించుకుంటే చాలా బాధగా ఉంటుందని అంటాడు.

ఇక రామ ఏదేమైనా అన్నల కంటే వదినమ్మనే వెన్నెల మనసు తెలుసుకుందని అంటాడు రామ. దాంతో జానకి పెద్దవాళ్ళు తెలియకుండా వెన్నెలకు సంబంధం కుదర్చటం తప్పే అని కానీ సమస్య వాళ్ల వరకు వెళ్తే పరిష్కారం మరోలా ఉంటుందని అంటుంది. ఇక వెన్నెల నా వైపు బాధగా చూస్తుంటే.. మార్గం లేక బాధ్యతలు నా నెత్తి మీద వేసుకున్నాను అని అంటుంది. దాంతో రామ వదిన తల్లితో సమానం అనడంతో.. వెంటనే జానకి పోనీలెండి ఇలాగైన తల్లిని అయ్యాను అని బాధపడుతుంది. ఇక రామ తన చేతులు ఈ పుణ్యమైనా మనకి వచ్చే జన్మలో అమ్మానాన్నలను చేస్తుందేమో అని అంటాడు. ఆ తర్వాత నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

also read it : Madhuranagarilo August 10th: 'మధురానగరిలో' సీరియల్: రాధను రౌడీలతో కిడ్నాప్ చేయించిన సంయుక్త, అనుమానంలో శ్యామ్?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget