అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కళ్లు తిరిగి పడిపోయిన యమున.. ఆగిపోయిన నిశ్చితార్థం.. పద్మాక్షి ఫైర్!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode యమున లేకపోతే నిశ్చితార్థం చేసుకోనని విహారి చెప్పడం మరోవైపు యమున కళ్లు తిరిగి పడిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారితో తనకు పెళ్లి అయిందన్న నిజం ఎవరికీ చెప్పొద్దని లక్ష్మీ పండుని రిక్వెస్ట్ చేస్తుంది. తన భవిష్యత్ గురించి ఆలోచిస్తే విహారి గారి జీవితం నాశనం అయిపోతుందని తన తండ్రి ప్రాణాలు కాపాడటానికి విహారి తన జీవితం నాశనం చేసుకున్నారని చెప్తుంది. రెండు చేతులెత్తి లక్ష్మీ అడగటంతో పండు ఎవరికీ చెప్పనని అంటాడు. పండు కూడా ఏడుస్తాడు. ఎవరికీ చెప్పనని అంటాడు. 

ఇక నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. మరోవైపు యమునకు మత్తు మందు వల్ల కళ్లు తిరుగుతూ ఉంటాయి. చెమటలు పట్టేస్తుంది. మెల్లగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. ఇక విహారి తన పక్కన కనకాన్ని ఊహించుకొని నువ్వా అని అడుగుతాడు. దానికి సహస్ర నేనే కదా బావా అంటుంది. యమున తిప్పలు చూసి అంబిక, పద్మాక్షి నవ్వుకుంటారు. ఇక విహారి కనకమహాలక్ష్మీ తనని మోసం చేశారు కదా అని అడిగినట్లు విహారి ఊహించుకొని తడబడతాడు. విహారి, సహస్రతలో రింగులకు పూజ చేయిస్తారు. మరోవైపు యమున తూలుతూ వెళ్లి ఓ గదిలో పడిపోతుంది. పంతులు విహారి, సహస్రలకు రింగులు ఇస్తారు. విహారి రింగు పట్టుకొని కనకం మెడలో తాళి కట్టడం గుర్తు చేసుకుంటారు. ఇద్దరూ రింగు లు మార్చుకోవడానికి సద్ధపడతారు. ఇంతలో విహారి తన తల్లి గురించి అడుగుతాడు. అందరూ ఉంటుందిలే అంటాడు. 

పద్మాక్షి: వస్తుందిలే విహారి ముందు రింగ్ పెట్టు టైం అయిపోతుంది. 
విహారి: అదేంటి అత్తయ్య నేను నా జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా అమ్మతోనే పంచుకున్నా అలాంటిది ఇంత పెద్ద విషయం అమ్మ కళ్లు ముందు జరగకుండా ఎలా చేసుకుంటాను.
పద్మాక్షి: ఈ తల్లీకొడుకుల బంధం నేను ఊహించిన వాటికంటే ఎక్కువే ఉంది పెళ్లి అవ్వగానే ముందు వీళ్ల బంధం ముక్కలు ముక్కలు చేయాలి. 
విహారి: మా అమ్మ కనిపించే వరకు ఈ నిశ్చితార్థం జరగదు.
అంబిక: వీడేంటి వాళ్ల అమ్మ కనిపించే వరకు ఉంగరం తొడిగేలా లేడే అలా అయితే ఇప్పటి వరకు చేసింది వృథా అయ్యేలా అంది.

వసుధ యమున కనిపించడం లేదని వెతకమని లక్ష్మీ, పండులకు చెప్తుంది. ఇద్దరూ వెతుకుతూ ఉంటారు. ఇక కాదాంబరి విహారి తల్లిని తిడుతుంది. అవసరం అయినప్పుడు ఇలానే చేస్తుందని అంటుంది. ఇంతలో పండు వచ్చి ఇళ్లంతా వెతికినా కనిపించడం లేదని అంటాడు. దాంతో విహారి నేను వెళ్తా అని పరుగులు తీస్తాడు. సహస్ర రింగ్ పట్టుకొని కూలబడిపోతుంది. ఓ వైపు విహారి, లక్ష్మీ వెతుకుతుంటారు. విహారి అటుగా  రావడంతో కనకం కనిపించకుండా దాక్కుంటుంది. అమ్మ ఎక్కడా కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదని విహారి వచ్చి చెప్తాడు. తన తల్లి కనిపించే వరకు ఈ నిశ్చితార్థం జరగదని అంటాడు.

అమ్మ సమక్షంలో జరగకపోతే ఇది శుభకార్యమే కాదని అంటాడు. పద్మాక్షి మాత్రం మీరు కలిసిపోతాం అని చెప్పి సమయానికి ఇలా చేశారని అంటుంది. మీ అమ్మ నిశ్చితార్థం ఆపడానికే ఇలా చేసిందని అంటుంది. దానికి విహారి అమ్మని అనవసరంగా అపార్థం చేసుకోవద్దని అంటాడు. పద్మాక్షి కూడా ఫైర్ అవుతుంది. ఇదంతా ఏంటి అమ్మ అని అడుగుతుంది. ఏడుస్తుంది. మీతో కలిసిపోవాలి అనుకున్న నాకు బాగా సన్మానం చేశారని అంటుంది. ఈ ముహూర్తానికే నిశ్చితార్థం అయితే ఒకే లేదంటే మా అమ్మ రావాలి అమ్మ సమక్షంలోనే జరగాలి అనుకుంటే నిశ్చితార్థం జరగదని అంటుంది. నా కూతురికి ఉంగరం తొడుగుతావా ఉన్నపళంగా మేం వెళ్లిపోవాలా అని ప్రశ్నించడంతో విహారి ఆలోచనలో పడతాడు.

అందరూ విహారికి నచ్చచెప్తారు. దాంతో విహారి తల్లికి ఇచ్చిన మాట కోసం సహస్రకి ఉంగరం తొడగడానికి వెళ్తాడు. మరోవైపు లక్ష్మీ ఓ మూల యమున పడి ఉండటం చూస్తుంది. దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతుంది. పండు కూడా చూసి కంగారుగా యమునను లేపుతాడు. ఇక రింగ్ తొడిగే టైంకి వెళ్లి యమున గురించి చెప్తాడు. విహారి ఒక్కసారిగా పరుగు వెళ్తాడు. విహారి రావడం చూసి లక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. విహారి తల్లి దగ్గరకు వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: వరసగా అదే అపశకునం.. నయనికి కనిపించని భవిష్యత్.. అసలేం జరుగుతోంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget