Jagadhatri Serial Today Feb 11th: విచారణ కమిటీ ఛైర్మన్ రమాకాంత్ను హత్యచేసిన మీనన్...రమాకాంత్ను చంపడం చూసిన కౌషికి వెంటపడిన మీనన్ మనుషులు
Jagadhatri Serial Today Episode February 11th: విచారణ కమిటీ ఛైర్మన్ రమాకాంత్ను హత్యచేసిన మీనన్...రమాకాంత్ను చంపడం చూసిన కౌషికి వెంటపడిన మీనన్ మనుషులు

Jagadhatri Serial Today Episode : తన భర్త సురేశ్ను కలిసేందుకు కౌషికి ఎవరికి చెప్పకుండా పార్కుకు వెళ్తుంది.అక్కడ సురేశ్తో మాట్లాడుతుంది. ఇంతలో సాధూసార్ ఫోన్ చేయగానే అప్రమత్తమైన జేడీ,కేడీ ఆయన్ను కాపాడేందుకు గెస్ట్హౌస్కు బయలుదేరి వెళ్తారు. మార్గమధ్యలో ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఆఫీసర్లకు ఫోన్చేసినా ఫోన్ కలవదు. వాళ్లు కంగారుపడుతూనే రమాకాంత్ ఉండే గెస్ట్హౌస్ వద్దకు చేరుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రమాకాంత్ను మానం కాపాడుకోలేకపోతే మంత్రి హత్య కేసులో నిజం నిరూపించలేమని జేడీ అంటుంది. అంతలోఅక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ను పిలిచి సార్ను అర్జెంట్గా కలవాలని అంటారు.సార్పై ఎటాక్ జరిగే అవకాశం ఉందని సమాచారం వచ్చిందని చెబుతారు. సార్ ఇక్కడ లేరని పక్కనే ఉన్న పార్క్లో వాకింగ్కు వెళ్లారని చెప్పగాని వాళ్లిద్దరూ అతనిపై మండిపడతారు. సార్ను ఒక్కరినే ఎలా పంపించారని నిలదీయగా....సార్ ప్రతిరోజూ ఇదే సమయానికి వాకింగ్కు వెళ్తారని తోడుగా ఇద్దరు సెక్యూరిటీ గన్మెన్లు కూడా వెళ్లారని చెబుతాడు. అయితే ఖచ్చితంగా మీనన్కు ఈ విషయం తెలిసే ఉంటుుందని...వాడు పార్క్లోనే ఎటాక్ చేసే అవకాశం ఉందని మనం వెంటనే అక్కడికి వెళ్లాలని జేడీ అంటుంది.దీంతో వాళ్లిద్దరూ అక్కడికి బయలుదేరి వెళ్తారు.
జేడీ ఊహించినట్లే మీనన్ తన మనుషులతో వీళ్లకన్నా ముందే పార్కు వద్దకు చేరుకుంటాడు. సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్మెన్లు చంపి రమాకాంత్ ముందుకు వెళ్తాడు. మీనన్ను గుర్తుపట్టిన రమాకాంత్....నువ్వు ఎంత బెదిరించినా,డబ్బులిచ్చినా నేను లొంగనని అంటాడు. మర్యాదగా నాపై వేసిన ఎంక్వైయిరీకి సంబంధించిన ఫైల్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకోమని మీనన్ హెచ్చరిస్తాడు.నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేశావని....ఇప్పుడు మరో తప్పు చేయవద్దని రమాకాంత్ హెచ్చరిస్తాడు.ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అప్పుడే అదే పార్కులో ఉన్న కౌషికి తన భర్త,బిడ్డను ఫోన్తో ఫొటోలు,వీడియోలు తీస్తుంటుంది. అక్కడ మీనన్ చూసి గుర్తుపడుతుంది.వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తుంది. అంతలోనే మీనన్ రమాకాంత్ను చంపడం చూసి ఫొటోలు తీస్తుంది. మీనన్ రమాకాంత్ను చంపి అక్కడి నుంచి తిరిగి వెళ్లబోతూ కౌషికిని చూస్తాడు.ఆమె చేతిలో ఉన్న ఫోన్చూసి తన మనుషులను పురమాయిస్తాడు. వెంటనే కౌషికిని పట్టుకుని ఆ ఫోన్ లాక్కోమని చెబుతాడు. మీనన్ మనుషులను చూసి కౌషికి తన బిడ్డను తీసుకుని భర్తతో కలిసి అక్కడ నుంచి పారిపోతుంది. మీనన్ మనుషులు వారివెంటపడతారు.
అప్పుడే జేడీ,కేడీ అక్కడికి వస్తారు. రమాకాంత్ చనిపోవడం చూసి చాలా బాధపడతారు. పార్క్ ఎంట్రన్స్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా....మీనన్ మనుషులుు కౌషికి కుటుంబం వెంట పడటం చూసి ఆశ్చర్యపోతారు.అయితే ఖచ్చితంగా కౌషికి దగ్గర ఈ హత్యకు సంబంధించిన ఏదో ఆదారం ఉండి ఉంటుందని...అందుకే మీనన్ ఆమె వెంటపడ్డాడని జేడీ అంటుంది. ఇంతలో సాధు అక్కడికి వస్తాడు.రమాకాంత్ చనిపోవడం చూసి చాలా బాధపడతాడు. మనం మీనన్ను అరెస్ట్ చేసేందుకు ఏం చేసినా...వాడు మనకన్నా ముందే ఉంటున్నాడని,అన్నీతెలిసి ఏం చేతకాని వాళ్లలా ఉండిపోవాల్సి వస్తోందని అంటాడు. మనం అన్ని కేసుల్లో మీనన్ను అరెస్ట్ చేయలేకపోవచ్చు గానీ....రమాకాంత్ను చంపిన కేసులో అరెస్ట్ చేద్దామని జేడీ అంటుంది.అందుకు ఆధారాలు ఏం ఉన్నాయని అనగా....కౌషికి దగ్గర ఉండిఉండొచ్చని మేం వెళ్లి తీసుకొస్తామని వెళ్తారు. మీనన్ మనుషులు నుంచి తప్పించుకుని పారిపోయి భర్తతో కలిసి కౌషికి ఇంటికి రావడం చూసి వైజయంతి, నిషిక ఆశ్చర్యపోతారు. మళ్లీ మీరు కలిసిపోయారా ఏంటని అడుగుతారు. అసలు ఎందుకు ఇంత కంగారుపడుతున్నారని నిలదీస్తారు.























