అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా, మిత్రలకు ఫస్ట్‌నైట్.. ఏడ్చి గోల చేసిన మనీషా.. ఇంట్లో నిజం తెలిస్తే!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర మనీషాని తాగి పాడు చేశాడని మనీషా ఫ్రెండ్స్ మిత్రని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా మిత్రకు జ్యూస్‌లో డ్రగ్స్ కలిపి ఇచేస్తుంది. మిత్ర కళ్లు తిరుగుతున్నాయి అని అంటే మన ఫ్రెండ్స్ జ్యూస్‌లో ఆల్కాహాల్ కలిపారేమో అంటుంది. మిత్ర లక్ష్మీని పిలవమని తనని గదిలోకి తీసుకెళ్తుందని చెప్తే లక్ష్మీ ఎందుకులే మిత్ర నేను తీసుకెళ్తానని మనీషా మిత్రని తీసుకెళ్తుంది. 

అంజలి లక్ష్మీని తీసుకెళ్లి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడిస్తుంది. మరోవైపు జాను, పిల్లలు పూజలు చేస్తుంటారు. మిత్రకి ఫుల్ మత్తు ఎక్కిపోతుంది. మనీషా ఓ చోట కూర్చొపెట్టి వాటర్ తీసుకొస్తా అని చెప్పి వాటర్‌లో కూడా మాల్ కలిపి మిత్రకు ఇస్తుంది. మిత్ర మత్తుతో పడుకుండిపోతాడు. దాంతో మనీషా మిత్రని తీసుకొని గదిలోకి వెళ్లి నా కంట్రోల్ లోకి వచ్చేశావ్ మిత్ర అని అంటుంది. ఇక పిల్లలు లక్ష్మీకి కాల్ చేసి మీరు ఎప్పుడు వస్తారమ్మా మీరు వచ్చే వరకు తినమని పూజ చేస్తున్న విషయం చెప్తారు. దాంతో లక్ష్మీ వెంటనే బయల్దేరుతామని అంటుంది. లక్ష్మీ వెళ్లి మిత్ర కోసం చూస్తుంది. పార్టీలో మిత్ర ఉండకపోవడంతో అంజలిని మిత్ర గురించి అడుగుతుంది. మిత్ర అర్జెంట్ పని ఉందని హడావుడిగా వెళ్లిపోయాడని చెప్తుంది. మనీషా గురించి అడిగితే ఇక్కడే ఎక్కడో ఉందని చెప్తుంది. 

లక్ష్మీ మిత్ర ఫోన్‌కి కాల్ చేస్తుంది. మనీషా మిత్ర ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తుంది. దాంతో లక్ష్మీ ఇంటికి వెళ్తానని అంటుంది. లక్ష్మీ వెళ్తుంటే మిత్ర ఫ్రెండ్ ఒకాయన మిత్రని ఒక్కడే చూశానని మనీషా రూమ్స్ కూడా బుక్ చేసిందని చెప్తాడు.  లక్ష్మీకి అనుమానం వచ్చి గది వైపు వెళ్తుంది. అంజలి మనీషాకి కాల్ చేసి చెప్తుంది. దాంతో మనీషా నేను చూసుకుంటా అంటుంది. ఇక లక్ష్మీ వచ్చి ఆ గది తలపు కొట్టగా మనీషా గొంతు మార్చి మాట్లాడుతుంది. దాంతో లక్ష్మీ సారీ చెప్పి వెళ్లిపోతుంది. లక్ష్మీ ఇంటికి వెళ్లిపోతుంది. అందరూ మిత్ర గురించి అడుగుతారు. దాంతో లక్ష్మీ ఆయన ఇంటికి వచ్చారని నేను వచ్చేశా అంటుంది. అందరూ కంగారు పడతారు. మనీషా గురించి అడిగితే మనీషా మిత్ర ఇద్దరూ ఒకే సారి కనిపించకుండా పోయారని అంటుంది. దాంతో వివేక్ మనీషాకి కాల్ చేస్తాడు. మనీషా కాల్ కట్ చేస్తుంది. వివేక్, జయదేవ్‌లు ఆఫీస్‌లో చూడటానికి వెళ్తారు. రాజేశ్వరి దేవి మనీషానే ఏమైనా చేసుంటుందని అంటుంది. 

ఉదయం మిత్రకు మత్తు వదిలి లేస్తాడు. ఎక్కడున్నానా అని మొత్తం చూస్తాడు. పక్కనే మనీషా బెడ్ షీట్‌ కప్పుకొని ఏడుస్తూ ఉంటే మిత్ర షాక్ అయిపోతాడు. నువ్వు ఉన్నావ్ ఏంటి మనీషా లక్ష్మీ ఎక్కడ ఉందని అడుగుతాడు. దాంతో మనీషా పెద్దగా ఏడుస్తూ రాత్రి నువ్వు ఏం చేశావో తెలీదా మిత్ర.. మన ఫ్రెండ్స్ డ్రింక్‌లో మందు కలిపారు. నిన్ను ఫ్రాంక్ చేయడానికి ప్లాన్ చేశారని అంటుంది. నేను ఏమైనా తప్పు చేశానా అని మిత్ర అడిగితే నేను ప్రేమించిన నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటే నీకు బెడ్ పార్టనర్ అయ్యానని నా లైఫ్ స్పాయిల్ చేసేశావ్ మిత్ర అని ఏడుస్తుంది. నాకు ఏం గుర్తు లేదు అని మిత్ర మనీషాకి సారీ చెప్తాడు. ఎందుకు ఇలా చేశావ్ మిత్ర అని ఏడుస్తుంది. మిత్ర తల పట్టుకుంటాడు. 

ఇక లక్ష్మీ ఉదయం వరకు హాల్‌లోని మెట్ల మీదనే కూర్చొంటుంది. జాను కాఫీ ఇస్తుంది. పెళ్లి రోజు కదా అక్క లేచి రెడీ అయి పూజ చేయు అక్క అంటుంది. ఇంతలో వివేక్, జయదేవ్‌లు వచ్చి మిత్ర ఎక్కడా లేడని అంటారు. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. మిత్ర డ్రింక్ కూడా చేయలేదని చెప్తుంది. ఇంతలో వివేక్‌కి కాల్ వస్తుంది. మిత్ర సేఫ్ అని వివేక్ అందరితో చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మిత్రని రాత్రి ఫ్రెండ్స్ డ్రింక్ చేయించేశారని అందుకే అక్కడే పడుకున్నాడని చెప్తాడు. ఇక రాజేశ్వరి దేవి లక్ష్మీని రెడీ అవ్వమని పంపుతుంది. తమ్ముడితో జరిగింది అది కాదని ఏదో తేడాగా ఉందని అంటుంది. ఇక మనీషా బయటకు వచ్చి లగేజ్ కారులో పెట్టించేశారా అని నేను వెళ్లిపోతా అని చెప్పి బయల్దేరుతుంది. మనీషా సైగ చేయడంతో ఫ్రెండ్స్ అందరూ మిత్రతో మనీషా లైఫ్ నాశనం చేశావని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్‌ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
Stock market: స్టాక్ మార్కెట్‌లో మహాపతనం  - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
స్టాక్ మార్కెట్‌లో మహాపతనం - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
Stock market: స్టాక్ మార్కెట్‌లో మహాపతనం  - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
స్టాక్ మార్కెట్‌లో మహాపతనం - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
Stock market memes: బ్లాక్ మండేతో కోట్లు నష్టపోయినా ఈ మీమ్స్ చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు - స్టాక్ మార్కెట్ క్రాష్ సోషల్ మీడియా కామెడీ
బ్లాక్ మండేతో కోట్లు నష్టపోయినా ఈ మీమ్స్ చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు - స్టాక్ మార్కెట్ క్రాష్ సోషల్ మీడియా కామెడీ
Samantha: 'ఎక్స్' సమంత రీ ఎంట్రీ - ఫస్ట్ పోస్ట్ ఏం చేశారో తెలుసా?
'ఎక్స్' సమంత రీ ఎంట్రీ - ఫస్ట్ పోస్ట్ ఏం చేశారో తెలుసా?
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
Embed widget