అన్వేషించండి

Trinayani June 29th: కసి హత్యకేసులో తిలోత్తమా ఫ్యామిలీపై అనుమానం-పిండి పరీక్షతో నిజం బయటపడనుందా?

ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కసి హత్య కేసు విషయంలో అందరిపై అనుమానం ఉండటంతో పిండి పరీక్ష చేయించడం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani June 29th: హాసిని తిలోత్తమాతో గబగబా తినేయకండి మునక్కాయ గొంతుకు గుచ్చుకుంటుంది అంటూ వెటకారం చేయటంతో తిలోత్తమా తనపై చిరాకు పడి అక్కడ నుంచి పంపిస్తుంది. విశాల్ విక్రాంత్ తో గురువుగారిని డ్రాప్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ తిలోత్తమా, వల్లభ, సుమన మాత్రమే ఉంటారు.

ఇక సుమన తిలోత్తమా దగ్గరికి వచ్చి.. మా అక్క ఇలా జరుగుతుందని ముందే చెబితే బాగుండేది.. ఇలా జరగకపోయేది అని అంటుంది. దాంతో తిలోత్తమా వదిలేసేయ్.. నీకు పుట్టబోయే బిడ్డను చూడటానికి బతికానేమో అని అంటుంది. ఆ మాటలు విని వల్లభ అమ్మ సుమనకు బిస్కెట్ వేసింది అని అనుకుంటాడు.

మరోవైపు నయని గాయత్రి పాపతో ఎందుకలా చేశావు అని అడుగుతుంది. ఇక అక్కడే ఉన్న హాసిని, పావనమూర్తి తనేం చేసింది అని అడగటంతో.. తిలోత్తమా అత్తయ్యకు అలా జరగడానికి కారణం గాయత్రి పాప అని.. తను అక్కడున్న బట్టను లాగటం వల్ల గాయత్రి అమ్మ గారి ఫోటో కింద పడి గాజు ముక్క తిలోత్తమా అత్తయ్యకు తగిలింది అని అంటుంది.

దాంతో హాసిని నయనికి గాయత్రి పాప మీద అనుమానం వస్తుందేమో అని వెంటనే పాపని తీసుకొని అలా ఏమి జరగదు తనకేమి తెలుసు అంటూ అవాయిడ్ చేసి మాట్లాడుతుంది. అంతేకాకుండా తిలోత్తమా గురించి ఒక విషయం చెబుతుంటే వెంటనే పావన మూర్తి ఇంట్రెస్టింగ్ గా వింటాడు. ఇక నయని అవన్నీ చెప్పకు బాబాయ్ భయపడతాడు అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

ఇక పావన తనకేమీ భయం లేదు అని ఏం జరిగిందో చెప్పమని హాసినిని అడుగుతాడు. వెంటనే హాసిని మీకు దయ్యం అంటే భయమా అని లైట్ ఆఫ్ చేస్తుంది. ఆ తర్వాత తను పావనను భయపడించడంతో దెబ్బకు భయపడి కింద పడిపోతాడు. ఆ తర్వాత గాయత్రి పాపను ఆడిపిస్తూ ఉండగా.. ఆ సమయంలో అందరూ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు.

ఇక నయని పేలాలు పిండి తీసుకొని రావటంతో.. సుమన తన అక్క ఏమో చేస్తుంది అని అంటుంది. ఇది పేలాల పిండి అంటూ దాని గురించి చెబుతుంది నయని. ప్రతి తొలి ఏకాదశికి నయని ఇవి చేస్తూనే ఉంటుంది కదా అని అంటాడు విశాల్. వెంటనే విక్రాంత్ తొలి ఏకాదశి గురించి అడగటంతో విశాల్ దాని గురించి వివరిస్తూ ఉంటాడు.

ఆ సమయంలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రావటంతో సమయానికి వచ్చారు ప్రసాదం తీసుకోండి అని అనటంతో.. ప్రసాదం కోసం రాలేదని ఒకరిని అరెస్టు చేయడానికి వచ్చాను అని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏం జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. ఇక చంద్రశేఖర్ కసిని హత్య చేసి చంపారు అని అనటంతో అందరూ మరోసారి షాక్ అవుతారు.

ఇక మీ ఫ్యామిలీలోనే ఎవరో చంపారు అని అనుమానంతో వచ్చాను అని అంటాడు. ఎవరా అన్నట్లుగా చర్చ చేస్తూ ఉంటారు. అందర్నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి అని అనడంతో.. లైవ్ డిటెక్టర్ చేయండి అని విశాల్ అంటాడు. దానికోసమైన స్టేషన్ కి వెళ్ళాలి అలా వెళ్తే పరువు పోతుంది అని తిలోత్తమా అంటుంది.

వెంటనే నయని అలాకాకుండా పూర్వీకుల లాగా పిండి తోని పరీక్షిస్తే దోషి ఎవరు బయటపడతారు అని అనటంతో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అందరి నోట్లో ఎద్దులయ్యతో పిండి కొట్టిస్తాడు. ఇక లాలాజలం ఊరినట్లయితే వాళ్ళు తప్పు చేయనట్లు అని అంటాడు. దాంతో మొదట విక్రాంత్ ను పరీక్షించగా అతడు దోషి కాదని తెలుస్తుంది. ఇక వల్లభ దగ్గరకు రాగానే అనుమానంతో కనిపిస్తాడు.

Also Read: Rangula Ratnam June 28th: ‘రంగులరాట్నం’ సీరియల్: రేఖపై చేతులెత్తిన పనివాళ్ళు, పనిమనిషిగా మారిన స్వప్న?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget