News
News
వీడియోలు ఆటలు
X

Sai Pallavi: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్! 

సాయిపల్లవి 'విరాటపర్వం' సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. నక్సల్స్ గురించి మాట్లాడింది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి 'విరాటపర్వం' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్ల మారణహోమం గురించి మాట్లాడింది సాయిపల్లవి. ముందుగా ఆమె 'విరాటపర్వం' సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. నక్సల్స్ గురించి మాట్లాడింది. నక్సల్స్ కి ఒక ఐడియాలజీ ఉంటుందని.. కానీ వయిలెన్స్ అనేది తనకు తప్పుగా అనిపిస్తుందని చెప్పింది. 

వాళ్లకి(నక్సల్స్) ఆ సమయంలో ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలి..? తమ కష్టాలను ఎవరు వింటారు..? ఎవరి దగ్గరకి వెళ్లాలి..? ఇలా ఏం చేయాలో తెలియక.. అందరూ కలిసి గ్రూప్ గా మారారు. మంచి చేయాలనే అలా మారారు. అయితే వాళ్లు చేసింది తప్పా..? కరెక్టా..? అని చెప్పే కాలంలో మనం లేమని చెప్పింది సాయిపల్లవి. తనకు వయిలెన్స్ అనేది నచ్చదని.. అర్ధం కూడా కాదని.. అన్నీ న్యూట్రల్ గా చూసే ఫ్యామిలీలో పెరిగానని.. అందుకే ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని చెప్పలేనని తెలిపింది. 

అందరూ మంచి మనుషుల్లా ఉండాని.. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని.. మనం కూడా అలా చేయకూడదని.. బాధితుల గురించి ఆలోచించాలని చెప్పింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన 'కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం మత సంఘర్షణలా వాటిని చూస్తే.. ఈమధ్య ఓ ముస్లిం డ్రైవర్ తన బండిలో ఆవుని తీసుకెళ్తుండగా.. కొంతమంది అతడిని కొట్టి, చంపేసి జైశ్రీరామ్ అన్నారు.. అప్పుడు కశ్మీర్ లో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించింది సాయిపల్లవి.

మతాలు కాదు.. మంచి మనుషులుగా ఉండాలని సూచించిన సాయిపల్లవి. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చరిత్ర తెలియకుండా.. ఇలాంటి కామెంట్స్ చేయకంటూ ఆమెపై మండిపడుతున్నారు. మరి దీనిపై సాయిపల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!

Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట

Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?

Published at : 15 Jun 2022 02:46 PM (IST) Tags: Sai Pallavi VirataParvam Kashmir genocide cow smuggling

సంబంధిత కథనాలు

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

Kevvu Karthik Marriage : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

Kevvu Karthik Marriage : త్వరలో  పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

Telugu Indian Idol 2 Finale : 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?

Telugu Indian Idol 2 Finale : 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

టాప్ స్టోరీస్

Telangana Politics : తెలంగాణలో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ వ్యూహం - బీజేపీని ఎలిమినేట్ చేయగలదా ?

Telangana Politics :  తెలంగాణలో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ వ్యూహం -  బీజేపీని ఎలిమినేట్ చేయగలదా ?

Odisha Train Accident LIVE: రైలు ప్రమాదంలో 288 మంది మృతి, మరో 56 మంది పరిస్థితి విషమం

Odisha Train Accident LIVE: రైలు ప్రమాదంలో 288 మంది మృతి, మరో 56 మంది పరిస్థితి విషమం

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా