By: ABP Desam | Updated at : 07 May 2023 09:30 AM (IST)
Edited By: anjibabuchittimalla
పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి (Photo Credit: Krish Jagarlamudi/Instagram)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. సుమారు 75 శాతం షూటింగ్ పూర్తి కాగా, 25 శాతం పెండింగ్ లో ఉంది. ఈ సినిమా కంప్లీట్ కావాలంటే కనీసం నెల రోజుల సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే, పవన్ కల్యాణ్ పలు సినిమాతో బిజీ అయ్యారు. సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ‘, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్, సాయి ధరమ్ తేజ్తో ఒక చిత్రం చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ‘ సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫుణెలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పలు పాటలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే, ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ సినిమా సెకెండ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ‘హరిహర వీరమల్లు‘కు ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో మొదటి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి మిగతా షూటింగ్ కంప్లీట్ అయ్యాక రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారట. ఈ నిర్ణయానికి పవన్ ఓకే చెప్పాల్సి ఉందట. ఆయన నిర్ణయం మీద ఆధారపడి సినిమా రెండు భాగాలుగా విడుదల కావాలా? వద్దా? అని క్రిష్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇక 'హరి హర వీరమల్లు' సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, బాబీ డియోల్కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. అలాగే, ఓ వెబ్ సిరీస్ కూడా! ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
'హరి హర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
Read Also: ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 35 కోట్లు ఖర్చు - సల్మాన్, షారుఖ్ కాంబో అంటే ఆ మాత్రం ఉండదా మరి!
Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!
Ennenno Janmalabandham May 30th: రోడ్డు పక్కన చెత్తలో మాళవిక, ఏడిపించేసిన ఆదిత్య- యష్, వేద రొమాంటిక్ మూమెంట్
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Andhra Politics : వైఎస్ఆర్సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్లో జీటీపై చెన్నై విక్టరీ!
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి