అన్వేషించండి

Saaree OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన ఆర్జీవీ 'శారీ' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Saaree OTT Platform: ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీతో పాటే మరో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Aaradhya devi's Saaree Movie OTT Streaming On Aha: సంచలన దర్శకుడు ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన రొమాంటిక్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'శారీ' మూవీ ఏప్రిల్‌లో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో 'శారీ' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ రామ్ గోపాల్ వర్మ భాగమయ్యారు. ఆయన శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించగా... ఆరాధ్య దేవి, సత్య యాదు, సాహిల్ సంభ్యాల్, కల్పలత కీలక పాత్రలు పోషించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ మూవీని నిర్మించారు. యూపీలోని అమాయక మహిళలను దారుణంగా హతమార్చిన ఓ శారీ కిల్లర్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది - 'జబర్దస్త్'లోకి నాగబాబు రీ ఎంట్రీ?... ఈసారి మోత మోగిపోద్ది అంతే...

స్టోరీ ఏంటంటే?

ఆరాధ్య దేవికి చీరలంటే మహా ఇష్టం. చీరలోనే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. ఓసారి ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లగా... ఆమెను చూసి ఇష్టపడిన ఫోటో గ్రాఫర్ కిట్టు (సత్య యాదు) దొంగచాటుగా ఫోటోలు తీస్తుంటాడు. ఆరాధ్యతో పరిచయం పెంచుకోవాలని భావించి ఇన్ స్టాలో ఆమెతో చాట్ చేస్తుంటాడు. అలా ఆమెను ఫోటో షూట్‌కు ఒప్పిస్తాడు. ఆరాధ్యను కిట్టు ప్రేమిస్తున్నా... అతన్ని మాత్రం ఆమె ఓ ఫ్రెండ్‌లానే భావిస్తుంది.

ఫోటో షూట్ టైంలోనే కిట్టుతో ఆరాధ్య అన్నయ్య రాజు (సాహిల్ సంభ్యాల్) గొడవకు దిగుతాడు. ఫోటో షూట్ తర్వాత కిట్టును ఆరాధ్య దూరం పెడుతుంది. ఇది సహించలేని కిట్టు ఆమె వెంటపడుతూ వేధిస్తుంటాడు. దీంతో అతనిపై కేసు పెట్టగా... సైకోలా మారతాడు. చివరకు ఈ సైకో బారి నుంచి ఆరాధ్య ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

మరో మూవీ కూడా...

ఇక ఇదే ఓటీటీలోకి మరో లేటెస్ట్ మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కలియుగం 2064' కూడా సడెన్‌గా 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో ప్రమోద్ సుందర్ ఈ మూవీని తెరకెక్కించగా మే 9న రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 2064లో ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేదే బ్యాక్ డ్రాప్‌గా మూవీని రూపొందించారు.

స్టోరీ ఏంటంటే?

ప్రపంచం అంతమైన తర్వాత ఏం జరుగుతుంది? అనేదే సినిమాలో చూపించారు. ధనవంతులు 2064లో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. మానవాళి పూర్తిగా అంతమైన తర్వాత అందులోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అయితే, ఆహారం, నీళ్లు దొరకని పరిస్థితుల్లో ఆ కొత్త ప్రపంచానికి వెళ్లేందుకు సామాన్యులు కూడా చూస్తారు. అలా వెళ్లిన శక్తి, భూమి అనే ఇద్దరికీ ఎలాంటి పరిస్థితి ఎదురైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget