అన్వేషించండి

Perusu Movie OTT Release Date: ఓటీటీలోకి సరికొత్త కామెడీ డ్రామా 'పెరుసు' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?.. తెలుగులోనూ చూసేయండి!

Perusu Movie OTT Platform: బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన తమిళ మూవీ 'పెరుసు'. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.

Vaibhav's Perusu Movie OTT Release On Netflix: కామెడీ, హారర్, థ్రిల్లర్, క్రైమ్ జానర్లలో మూవీస్, సిరీస్‌లను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న క్రమంలో ప్రముఖ ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌నే ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా తమిళంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయం సాధించిన సరికొత్త కామెడీ డ్రామా మూవీ 'పెరుసు' (Perusu) ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. 

కోలీవుడ్‌లో తెరకెక్కిన 'పెరుసు' మూవీ మార్చి 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సినిమాలో నటుడు వైభవ్ (Vaibhav), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక (Niharika) ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 'టాంటిగో' అనే శ్రీలంక చిత్రం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ఇళంగో రామ్ తెరకెక్కించారు. సినిమా కథ, కథనం, మేకింగ్ చాలా బాగున్నాయంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు. సినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించగా.. కార్తికేయన్ సంతానం, హర్మన్ బేవజా, హిరణ్య పెరెరా నిర్మాతలుగా వ్యవహరించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read: మూడేళ్ల తర్వాత ఆడియన్స్ మధ్యకు ఎన్టీఆర్ - సెక్యూరిటీ ఎంత పెంచాలో తెలుసు కదా!

ఈ సినిమాలో వైభవ్, నిహారికతో పాటు బాలా శరవణన్, మునిష్ కాంత్, చాందిని తమిళరసన్, రెడిన్ కింగ్స్‌లీ, వీటి గణేష్, దీపాశంకర్, స్వామినాథన్ కీలక పాత్రలు పోషించారు. హీరో వైభవ్, సునీల్ రెడ్డి రియల్ లైఫ్ బ్రదర్స్ కాగా సినిమాలోనూ వారు అలాగే నటించారు. థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల్లోనే 'పెరుసు' ఓటీటీలోకి రానుంది.

స్టోరీ ఏంటంటే?

ఇక స్టోరీ విషయానికొస్తే.. ఊరి గ్రామ పెద్ద హలసాయం. స్థానిక ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తోటివారితో కలిసి వాటిని చక్కగా పరిష్కరిస్తుంటాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఓసారి హలసాయం అనుకోని విధంగా ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాడు. హలసాయం మరణంతో పాటే వారి కుటుంబ సభ్యులకు కొత్త సమస్య వచ్చి పడుతుంది. అసలు హలసాయం ఎలా చనిపోయాడు?, ఆ కుటుంబానికి వచ్చిన సమస్య ఏంటి?, ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు?, ఆ కుటుంబ గౌరవాన్ని ఆ కుమారులు ఎలా కాపాడారు?,  తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అతని కుమారులు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తమిళంలో మంచి హిట్ సాధించిన ఈ మూవీ ఓటీటీలోనూ అంతే సక్సెస్ సాధిస్తుందని టీం భావిస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget