Mardaani 3 OTT : మెచ్యూర్ కానీ అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3
Mardaani 3 OTT Platform : బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3. జనవరిలో ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Rani Mukherjee's Mardaani 3 OTT Streaming : నగరంలో భయంకర బెగ్గర్ మాఫియా, చిన్నారుల కిడ్నాప్, మెడికల్ ఎక్స్పెరిమెంట్స్... ఇవన్నీ ప్రధానాంశాలుగా తెరకెక్కిన రీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మర్దానీ 3. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన 'మర్దానీ 3' ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం (మార్చి 27) మధ్యాహ్నం నుంచి కేవలం హిందీలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మర్దానీ 3 నిలిచింది. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా... రాణీ ముఖర్జీతో పాటు జానకి బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషు సేన్ గుప్తా, ఇంద్రనీల్ భట్టాచార్య, నవేద్ అస్లామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Also Read : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
అంతకు ముందు వచ్చిన మర్దానీ (2014), మర్దానీ 2 (2019) వంటి విజయాల తర్వాత ఆడియన్స్కు ఫుల్ థ్రిల్ పంచింది మర్దానీ 3. ఫస్ట్ రెండు పార్టులను మించి బిగ్ సక్సెస్ అందుకుంది. శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ అదరగొట్టారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతంగా నటించారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించిన ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్యా చోప్రా నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
ఫస్ట్ పార్ట్ మహిళల అక్రమ రవాణాపై పోలీస్ ఆఫీసర్ ఉక్కుపాదంను చూపిస్తే... రెండో పార్టులో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే సైకో కిల్లర్ను పట్టుకోవడం గురించి చూపించారు. ఇక 'మర్దానీ 3' స్టోరీ విషయానికొస్తే... చిన్నారుల కిడ్నాప్, బెగ్గర్ మాఫియా వంటి వాటిని చూపించారు. ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ గుట్టును సైతం పోలీస్ ఆఫీసర్ ఎలా బయటపెట్టారనేదే కథ.
ఇక మర్దానీ 3 స్టోరీ విషయానికొస్తే... ఢిల్లీలో ఓ రాయబారి కుమార్తె మిస్ అవుతుంది. హై ప్రొఫైల్ కేస్ కావడంతో శివానీ శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)కి అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన ఆమెకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. కిడ్నాప్ అయ్యింది ఒక్క రాయబారి కుమార్తె మాత్రమే కాదని... ఢిల్లీలో సామాన్యుల కుమార్తెలు కూడా చాలా మంది మిస్ అయ్యారని తెలుస్తుంది. ఈ కిడ్నాప్స్ వెనుక అమ్మ (మల్లికా ప్రసాద్) ఉందని తెలుసుకుంటుంది.
అసలు మెచ్యూర్ కాని అమ్మాయిలనే ఈ ముఠా ఎందుకు టార్గెట్ చేసింది? బెగ్గర్ మాఫియాకు చెందిన ఓ లేడీ డాన్ ఈ కిడ్నాప్స్ చేయించడం వెనుక ఉన్నది ఎవరు? అసలు వరుస కిడ్నాప్స్ వెనుక బలమైన క్రైమ్ ఏంటి? ఈ కేసును శివానీ శివాజీ రాయ్ ఎలా ఛేదించారు? కిడ్నాపర్ల చెర నుంచి బాలికలను కాపాడగలిగిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. కేవలం కిడ్నాప్, బెగ్గర్ మాఫియా మాత్రమే కాకుండా అంతకు మించి కొత్త అంశాలను కథలో జోడించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















