అన్వేషించండి

Shah Rukh Khan's House: షారుఖ్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులు, పోలీసులు విచారణలో ఏం చెప్పారో తెలుసా?

ఇవాళ తెల్లవారు జామున ఇద్దరు ఆగంతకులు షారుఖ్ ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితులు చెప్పిన విషయం విని ఖాకీలు ఆశ్చర్యపోయారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. ముంబైలోని ఆయన నివాసం మన్నత్ లోకి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో వారిద్దరు  ప్రవేశించారు. వెంటనే పసిగట్టిన షారుఖ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు గుజరాత్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

నిందితులను విచారిస్తున్న బాంద్రా పోలీసులు

“షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్ సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకున్నారు. వారిని పట్టుకున కొద్ది సేపు ప్రశ్నించారు. కానీ, వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే మేం ఓ పోలీసు బృందాన్ని షారుఖ్ ఇంటికి పంపించాం. వారిని అదుపులోకి తీసుకున్నాం” అని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడానికి ముందు చాలా సేపు ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.

“షారుఖ్ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆయన అభిమానులుగా చెప్తున్నారు. ఖాన్‌ను దగ్గరగా చూడాలని భావించి ఆయన ఇంట్లోకి చొరబడినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వారిలో ఇతర ప్రమాదకరమైన ఆలోచనలు ఏవీ కనిపించలేదు. మేం వారి కుటుంబ సభ్యుల వివరాలను తీసుకున్నాం. వారికి కాల్ చేస్తున్నాం. వారిద్దరిది గుజరాత్ కావడంతో, అక్కడి పోలీసులను సంప్రదిస్తున్నాం.  వారికి ఏదైనా నేర చరిత్ర ఉందా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక వేళ నేర చరిత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి వీరిద్దరిపై అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించిన నేరం కింద కేసు నమోదు చేశాం. వారిపై తదుపరి విచారణ కొనసాగుతోంది” అని బాంద్రా పోలీసులు తెలిపారు.

షారుఖ్ భార్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

ఇక తాజా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ చిక్కుల్లో పడింది. లక్నోలో ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆస్తి కొనుగోలు విషయంలో గౌరీతో పాటు పలువురు తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. గౌరీ తులసియని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.  తాజాగా ఆమె ప్రకటను చూసి ముంబైకి చెందిన జశ్వంత్ షా అనే వ్యక్తి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ కోసం ఆయన రూ. 86 లక్షలు చెల్లించారు. అయితే, డబ్బులు చెల్లించినా ఫ్లాట్ అప్పగించడంలో సదరు కంపెనీ ప్రతినిధులు జాప్యం చేశారు. ఎందుకు తనకు ఫ్లాట్ ఇవ్వడం లేదని ఆయన ఆరా తీశారు.  అసలు విషయం తెలిసింది. అప్పటికే ఆ ఫ్లాట్ ను వేరొకరికి అమ్మినట్లు వెల్లడైంది. వెంటనే జశ్వంత్ సదరు కంపెనీపై కేసు పెట్టారు.  ఈ నేపథ్యంలో గౌరీ ఖాన్ తో పాటు తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సీఎండీ అనిల్ కుమార్ తులసియానీ, డైరెక్టర్ మహేశ్ తులసియానీలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది.  

పఠాన్’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న షారుఖ్

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 'పఠాన్' భారీ విజయం తర్వాత ప్రస్తుతం షారుఖ్ 'జవాన్' షూటింగ్ లో బిజీ అయ్యారు.  

Read Also: సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన మల్లు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

టాప్ హెడ్ లైన్స్

Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget