News
News
X

Pattabhi Father Death: మహేష్ బాబు మేకప్ మ్యాన్ తండ్రి కన్నుమూత, ఇంటికెళ్లి పరామర్శించిన నమ్రత

మహేష్ బాబు పర్సనల్ మేకప్ మెన్ పట్టాభి తండ్రి చనిపోయారు. విషయం తెలుసుకున్న మహేష్ సతీమణి నమ్రత వెంటనే పట్టాభి ఇంటికెళ్లి, ఆయన తండ్రి భౌతికకాయానికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

FOLLOW US: 
Share:

పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన నమ్రత

మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభి ఇంట్లో తీవ్ర విషాదం  చోటుచేసుకుంది. ఆయన తండ్రి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసి వెంటనే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పట్టాభి ఇంటికి వెళ్లారు. పట్టాభి తండ్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.   

  

ఫోన్ లో పరామర్శించిన మహేష్ బాబు

ప్రస్తుతం మహేష్ బాబు స్పెయిన్ వెళ్లారు. SSMB28కి సంబంధించి షూటింగ్ లో పాల్గొంటున్నారు. మహేష్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో పట్టాభిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  మహేష్ లేకపోవడంతో మహేష్ భార్య నమ్రత  పట్టాభి ఇంటికి వెళ్లి పట్టాభి తండ్రికి నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యులని ఓదార్చారు. నమ్రత పట్టాభి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేష్ కుటుంబంతో పట్టాభికి ప్రత్యేక అనుబంధం

మహేష్ బాబు దగ్గర పట్టాభి ఎప్పటి నుంచో పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. దాదాపు మహేష్ సినిమాలన్నింటికీ పట్టాభి పర్సనల్ మేకప్ మెన్ గా చేశారు. ఆయనకు మహేష్ బాబు ఫ్యామిలితో ప్రత్యేక అనుబంధం ఉంది.  మహేష్ బాబు పట్టాభిని సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తాడు. చాలాసార్లు పట్టాభి గురించి మీడియాతో చెప్పారు. సోషల్ మీడియాలోనూ ఆయన గురించి పోస్టులు పెట్టేవారు. పట్టాభి పిల్లల చదువులకు కూడా సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టాభి తండ్రి చనిపోవడంతో మహేష్ ఇంట్లోనూ విషాదం నెలకొంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

తమ దగ్గర పని చేసే వారిని సొంత మనుషుల్లా చూసుకుంటున్న మహేష్ దంపతులు

మహేష్ దంపతులు తమ దగ్గర పని చేసే వారిని కూడా సొంత మనుషుల్లాగే చూసుకుంటారు. వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాలుగా అండగా ఉంటున్నారు. తమ మంచి మనసును చాటుకుంటున్నారు. అటు ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు ఈ జంట గుండె ఆపరేషన్‌ చేయించి ప్రాణదానం చేశారు. అంతేకాదు, పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికసాయం కూడా చేస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవలోనూ మహేష్ కు నమ్రత వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

Read Also: ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Published at : 12 Feb 2023 01:22 PM (IST) Tags: Mahesh Babu Mahesh Babu Makeup Man Pattabhi Pattabhi Father Passed Away Namrata Shirodkar condoled

సంబంధిత కథనాలు

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా

టాప్ స్టోరీస్

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి