అన్వేషించండి

Kathiresan Passes Away: ధనుష్ తన కొడుకే అంటూ కోర్టుకెక్కిన కదిరేశన్ మృతి, ఆ బాధతోనే చనిపోయారా?

నటుడు ధనుష్ తమ కొడుకేనంటూ పదేండ్ల పాటు కోర్టులో పోరాడి ఓడిన కదిరేశన్ కన్నుమూశారు. మార్చి 14న ధనుష్ వారి కొడుకు కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయారు.

Kathiresan Passes Away:  హీరో ధనుష్‌ నా కొడుకే అంటూ కోర్టు మెట్లు ఎక్కిన కదిరేశన్‌ తాజాగా కన్నుమూశారు.  10 ఏళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్ తమ కొడుకేనంటూ కదిరేశన్, మీనాక్షి అనే దంపతులు కోర్టులో కేసు వేసి దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. సుమారు 10 ఏళ్ల పాటు న్యాయస్థానంలో పోరాటం చేశారు. అయితే, చివరకు కోర్టు ధనుష్ వారి కొడుకు అనేందుకు సరైన ఆధారాలు లేవంటూ గత నెల(మార్చి) 14న తుది తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుతో తీవ్ర ఆవేదనకు గురైన కదిరేశన్ మంచాన పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన భార్య మీనాక్షి, కదిరేశన్ ను  మధురై రాజాజీ హాస్పిటల్ లో చేర్పించారు. తాజాగా ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.

ఇంతకీ కదిరేశన్ కేసు ఏంటంటే?

మేలూర్‌ కు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు, నటుడు ధనుష్‌ తమ కొడుకు అంటూ 2015లో మేలూర్‌ కోర్టులో కేసు వేశారు. స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే ధనుష్‌ ఇంట్లో నుంచి పారిపోయాడని కోర్టుకు తెలిపారు. అతడు తమ కొడుకే అని చెప్పేందుకు ఆధారాలుగా బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీ, 2002లో జాబ్ కోసం ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్ లో ధనుష్ ఎంట్రీ చేయించుకున్న సర్టిఫికేట్ ను కోర్టుకు అందించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. కదిరేశన్ దంపతులు సమర్పించిన ఆధారాలతో ధనుష్ వారి కొడుకే అని చెప్పలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

డబ్బు కోసమే కేసు వేశారన్న ధనుష్ న్యాయవాదులు

కేసు విచారణ సందర్భంగా కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకేనని చేస్తున్న వాదనలో నిజం లేదని ధనుష్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదించారు. కదిరేశన్‌ కోర్టుకు ఇచ్చిన టీసీలో ఉన్న పుట్టుచ్చలు, ధనుష్ కు లేవని చెప్పారు. కోర్టు వారు పరిశీలించి తను నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ధనుష్‌ తమ కొడుకే అని చెప్పడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు రూ. 65 వేలు ఇప్పించాల్సిందిగా కోర్టును కదిరేశన్‌ దంపతులు కోరారని, కేవలం డబ్బు కోసమే వాళ్లు ఈ కేసును వేశారని ధనుష్ తరఫు న్యాయవాదులు వాదించారు.  

కేసు కొట్టివేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన కదిరేశన్

కదిరేశన్ దంపతులు సమర్పించిన టీసీలో ఉన్న పుట్టుమచ్చలపైన కోర్టులో కీలక విచారణ జరిగింది. కోర్టు రిజిస్టార్‌ ఆధ్వర్యంలోనే మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టు మచ్చలను పరిశీలించారు. కదిరేశన్ దంపతులు చెప్పినట్టుగా ధనుష్‌ కు పుట్టుమచ్చలు లేవని తేల్చారు. దీంతో న్యాయస్థానం కదిరేశన్ పిటిషన్‌ను కొట్టివేసింది. సుమారు 10 ఏండ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు ధనుష్.. కదిరేశన్, మీనాక్షి దంపతుల కొడుకు కాదని తేల్చింది. కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకే ధనుష్‌ జన్మించినట్లు కీలక తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు తర్వాత కదిరేశన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అదే బాధలో మంచానికి పరిమితమై చివరకు చనిపోయారు.

Read Also: రాఘవ లారెన్స్ తో లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget