అన్వేషించండి

Anurag Kashyap: ‘కాంతార’, ‘పుష్ప’ సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్

గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం పట్ల అనురాగ్ తన ధోరణిని వినిపిస్తూ వస్తున్నారు. దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

బాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో అనురాగ్ కశ్యప్ ఒకరు. ఆయన అనుకున్న మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలాగే ఒక్కోసారి తన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకుంటారాయన. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం పట్ల అనురాగ్ తన ధోరణిని వినిపిస్తూ వస్తున్నారు. దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆయన మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాటలు బాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. 

ఇటీవల ఓ సందర్భంలో ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోందన్నారు. బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ పై మేకర్స్ దృష్టి పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే బాలీవుడ్ ను నాశనం చేస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల ప్రస్తావన ఉండేది కాదని, అయితే ఇప్పుడిప్పుడే హిందీలో కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తాను నాశనం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. 

‘పుష్ప’, ‘కాంతార’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించవచ్చు, కానీ అలాంటి సినిమాలను బాలీవుడ్ లో కాపీ కొట్టి దాన్ని పాన్ ఇండియాగా తీయాలని ప్రయత్నిస్తే అది భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పుడు బాలీవుడ్ కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదని, ఇండస్ట్రీ కి ధైర్యాన్నిచ్చే సినిమాలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలని హితవు పలికారు.

అలాగే కశ్యప్ మరాఠీలో వచ్చిన ‘సైరత్’ సినిమా గురించి మాట్లాడుతూ.. మరాఠీలో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన సినిమా ‘సైరత్’ అని అన్నారు. కానీ వాస్తవానికి ఆ సినిమా మరాఠీ ఇండస్ట్రీని నాశనం చేస్తుందన్నారు. ఇదే విషయంపై ఆ సినిమా దర్శకుడితో తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ ఆ సినిమాను అనుసరిస్తున్నారని.. కొత్త కథలను తీసుకురావడవం లేదని అన్నారు. దీని ప్రభావం మొత్తం ఇండస్ట్రీ పై పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాక్స్ ఆఫీస్ వసూళ్లను దృష్టిలో పెట్టుకొని తమ పంథాను మార్చుకొని సినిమాలు చేస్తే అది ఏ ఇండస్ట్రీకైనా నష్టమే అని అన్నారు. 

అయితే వాస్తవానికి ‘కాంతార’ లాంటి సినిమాలు పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని తీయలేదు. కన్నడలో ఆ సినిమాకు విశేష స్పందన రావడంతో తర్వాత పాన్ ఇండియా లెవల్ లో ఆ చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే బాలీవుడ్ లో ఈ యేడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ’ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయగా ఆ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా జాబితాలోకెక్కింది. దీనిబట్టి చూస్తే సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు తప్ప.. లోకల్, పాన్ ఇండియా అని ఉండదని కొంతమంది సినీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అనురాగ్ కశ్యప్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘దొబాారా’ సినిమా ఈ యేడాది విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వ్యాపార వేత్త విజయ్ మాల్యా జీవితం ఆధారంగా ‘ఫైల్ నెం 323’ సినిమాను వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నారు అనురాగ్.

 Read Also: ఆ షర్ట్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ - వైసీపీకి కౌంటర్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget