Trivikram Srinivas : ఒకటే గాడ్ స్టోరీ - టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పోటీ!... ఎవరిది ఫస్ట్ ట్రాక్ ఎక్కుతుందో?
Lord Kumaraswamy : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఒకే దేవునిపై మూవీ తీసేందుకు రెడీ అవుతుండడం హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ముందు ఎవరి ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కుతుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Tollywood Directors Competing For Lord Kumara Swamy Movie : భారతీయ పురాణాల్లో అత్యంత పవర్ ఫుల్ గాడ్ కుమార స్వామి. తమిళనాడులో మురుగన్గా పూజలు అందుకుంటారు. ఆయన చరిత్రను సిల్వర్ స్క్రీన్పై ఓ విజువల్ వండర్గా తెరకెక్కించేందుకు ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆయన కథలో అంత పెద్ద మూవీస్ అయితే రాలేదు. కానీ, ఇప్పుడు ఆయన కథను తీసేందుకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. మరి వారెవరంటే...
తివ్రిక్రమ్... గాడ్ ఆఫ్ వార్...
ఇప్పటివరకూ మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ టచ్ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం మైథలాజికల్ సబ్జెక్ట్తో భారీ స్థాయిలో మూవీ ప్లాన్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కుమార స్వామి చరిత్ర బ్యాక్ డ్రాప్గా ఆయన... 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ భారీ ప్రాజెక్టును తీసేందుకు సిద్ధం కాగా... అనుకోని కారణాలతో అనౌన్స్మెంట్ రాలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకీతో AK47 (ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47) మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల తర్వాతే మైథలాజికల్ మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్లో మూవీ తీస్తారో?
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా...
అనూహ్యంగా హనుమాన్తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా... కుమార స్వామి నేపథ్యంలో ఓ మైథలాజికల్ మూవీని తీసేందుకు రెడీ అవుతున్నారట. ఈ ప్రాజెక్టుకు ఆయన స్టోరీ అందించి, నిర్మాణ పర్యవేక్షణ చేయనుండగా... నటుడు, డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు ఫైనల్ కాగా... త్వరలోనే మూవీని అఫీషియల్ అనౌన్స్ చేసి... షూటింగ్ ప్రారంభించనున్నారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా జై హనుమాన్ మూవీని తెరకెక్కించే బిజీలో ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే మహంకాళి మూవీకి ఆయన షో రన్నర్గా వ్యవహరిస్తుండగా... తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని మైథలాజికల్ ప్రాజెక్టులు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ పూర్తైన తర్వాత కుమార స్వామి ప్రాజెక్టును తెరకెక్కిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
కిషోర్ తిరుమల కూడా...
ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా కుమార స్వామి కథతో మూవీ తీసేందుకు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తెరకెక్కించే కిషోర్ తిరుమల ఇప్పుడు జానర్ మార్చి మైథలాజికల్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గతంలోనే అనౌన్స్ చేశారు.
ఒకే దేవునికి సంబంధించి స్టోరీని ముగ్గురు టాప్ డైరెక్టర్స్ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించేందుకు రెడీ అవుతుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. వేర్వేరు కోణాల్లో ఎలా చూపిస్తారో? అనేది ఆసక్తిగా మారింది. మరి ముందు ఎవరి ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.
























