అన్వేషించండి

AP Tickets Issue : ఆర్జీవీతో 4 గంటలు.. కమిటీ మాత్రం 2 గంటలే చర్చ ! ఇక నివేదిక రెడీ చేస్తారా ?

ఏపీ ప్రభుత్వం నియమించిన సినిమా టిక్కెట్ రేట్ల నిర్దారణ కమిటీ రెండు గంటల పాటు భేటీ అయింది. త్వరలో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల అంశంపై హైకోర్టు సూచనలతో నియమించిన కమిటీ రెండో సమావేశం అమరావతిలో దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా దీనికి హాజరయ్యారు. టిక్కెట్ల అంశంపై ఆర్జీవీతో నాలుగు గంటల పాటు మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. కానీ కమిటీ మాత్రం రెండు గంటల పాటే సమావేశం అయింది.  సమావేశంలో సినీ పరిశ్రమ తరపున ఎగ్జిబిటర్లు తమ వాదన వినిపించారు. ధియేటర్ల నిర్వహణ పరిస్థితులను వివరించి  ప్రస్తుతం ఖరారు చేసిన టిక్కెట్ రేట్లు ఏ మాత్రం గిట్టుబాటు కావని.. పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

Also Read: టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?

సినిమా టిక్కెట్ రేట్లు ఎంత ఉండాలనేదానిపై ఓ నివేదికను ఎగ్జిబిటర్లు అందించారు. ఈ సమావేశంలో టిక్కెట్ల ధరలతో పాటు ధియేటర్లలో వసతుల కల్పన.. ధియేటర్ల గ్రేడింగ్ కు ఏ పద్దతి పాటించాలన్న అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రత్యేకంగా ఎలాంటి భేటీలు ఉండకపోవచ్చని ప్రభుత్వానికి అధికారుల కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టుకు కూడా నివేదిక సమర్పించాల్సి ఉంది. 

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?

సినిమా టిక్కెట్ల అంశం టాలీవుడ్‌, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదంలా మారింది. దేశంలో అన్ని రాష్ట్రాలు సినిమా టిక్కెట్ల అంశాన్ని ఇంతలా వివాదాస్పదం చేయలేదని.. కానీ ప్రభుత్వం మాత్రమే అతి తక్కువ రేట్లు నిర్ణయించారని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కవడంతో ఎగ్జిబిటర్లు కోర్టుకెళ్లారు. కోర్టు ప్రభుత్వం జారీ చేసిన టిక్కెట్ల జీవోను రద్దు చేసి.. కమిటీని నియమించి ఖరారు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

ఈ కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం టిక్కెట్ల ధరలపై నిర్ణయం తీసుకోనుంది. ఎప్పుడు నివేదిక సమర్పిస్తుంది..? ఎంత మేర టిక్కెట్ రేట్ల పెంపునకు సిఫార్సు చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ పెద్దల ప్రకటనల ప్రకారం చూస్తే టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదేమోనని కొంత మంది భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. 

Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget