అన్వేషించండి

 Reason For Theatres Bandh: థియేటర్స్ బంద్ వివాదానికి  అసలు కారణం ఇదే..! వారి సమస్యలు పరిష్కారించేది ఎవరు ?

సింగిల్ స్క్రీన్ ధియేటర్లు ఇప్పుడు చెల్లిస్తున్న అద్దె విధానం లాభదాయకంగా లేదని దీన్ని మార్చి ఆదాయంలో భాగస్వామ్యం ఇవ్వాలన్నది ధియేటర్ యాజమాన్యాల డిమాండ్. కాని ఇది రాజకీయ రంగు పులుముకుంది.

Theatres Bandh Issue Facts | రెండు తెలుగు రాష్ట్రాల్లో  జూన్ 1 నుండి  సినిమా ధియెటర్లు బంద్ చేస్తామని ప్రకటించడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసంతృప్తి వ్యక్తం చేయడం,  ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్  ఈ అంశంపై హోంశాఖ అధికారులను విచారణ జరపమని ఆదేశించడం, ఆ తర్వాత సినిమా పెద్దల ప్రెస్ మీట్లు  సినిమా రంగంలో  వాడి వేడి చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా  హరిహర వీరమళ్లు జూన్ 12వ తేదీన విడుదల కానుండటంతో, ఆ సినిమాను అడ్డుకునేందుకు కొందరు సినిమా రంగంలోని వ్యక్తులు రాజకీయ ప్రేరేపణతో ఈ చర్యకు దిగారన్న చర్చ సాగుతోంది. అయితే అసలు ఇది ఎలా పుట్టింది.  సినిమా ధియెటర్ల యజమానులు ఏం డిమాండ్ చేస్తున్నారన్న అంశాలను చూద్దాం.

 సినిమా రంగంలో ఆర్థిక నమూనా తీరు ఇదే..

సినిమా పరిశ్రమలో కీలకమైన వ్యక్తులు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,  ఎగ్జిబిటర్ లేదా ధియేటర్ల యజమానులు. వీరి మధ్య  ఆదాయ పంపిణీ ఎలా ఉంటుందో చూద్దాం.


1. నిర్మాతలు (Producers) -  సినిమా రంగంలో  అత్యంత కీలకమైన వ్యక్తులు నిర్మాతలు. వీరు కథ, నటులు, టెక్నీషియన్స్ ఎంపిక , షూటింగ్, సినిమా మార్కెటింగ్ వంటి వాటికి అయ్యే అన్ని ఖర్చులను వీరే భరించి సినిమాలను నిర్మిస్తారు. ఇలా నిర్మించిన సినిమాకు సంబంధించిన పంపిణీ  హక్కులను రెండో దశలో ఉండే  డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు. కొన్ని సార్లు నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్స్ గా  తమ సినిమాకు పంపిణీ దారులుగా వ్యవహరిస్తారు. తద్వారా వారు ఆదాయన్ని పొందుతారు. దీంతో పాటు ఆడియో, శాటిలైట్, డిజిటల్ హక్కులను విక్రయించడం ద్వారా  వారు ఆదాయాన్ని పొందుతారు. 


2. డిస్ట్రిబ్యూటర్లు (Distributors) -  సినిమా రంగంలో నిర్మాతల తర్వాత కీలమైన వ్యవస్థ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ.  సినిమా నిర్మాత కూడా  కొన్ని సార్లు డిస్ట్రిబ్యూటర్ల సూచనలు, సలహాలు పాటించి సినిమాను తీయాల్సిన పరిస్థితి ఉంటుందంటే చిత్ర సీమలో డిస్ట్రిబ్యూటర్స్ పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. వీరు నిర్మాతల నుండి సినిమా హక్కులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ హక్కులు నైజాం,సీడెడ్, ఆంధ్రా ప్రాంతాల వారీగా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ధియేటర్లలో వచ్చే టికెట్ల అమ్మకాల ద్వారా ఆదాయన్ని పొందుతారు. ఇందు కోసం డిస్ట్రిబ్యూటర్స్  సినిమా హాలు అద్దె ప్రాతిపదికన ఎగ్జిబిటర్స్ తో  ఒప్పందాలు చేసుకుంటారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్  ఆదాయపరంగా నిర్మాతలతో మూడు రకాలుగా  అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అందులో ఒకటి మినిమమ్ గ్యారంటీ పద్దతి. ఈ పద్ధతిలో  సినిమా కు ముందుగానే  ఒక మొత్తం అమౌంట్ ను నిర్మాతకు  డిస్ట్రిబ్యూటర్ చెల్లిస్తారు. సినిమా ఆడినా, ఆడకపోయినా ఆ మినిమ్ గ్యారంటీ మొత్తం  నిర్మాతకు దక్కుతుంది.  సినిమా బాగా ఆడితే అంటే మినిమమ్ గ్యారంటీ చెల్లించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తే అందులో మిగిలిన లాభాన్ని డిస్ట్రిబ్యూటర్,  నిర్మాత  ముందుగా అనుకున్న ప్రకారం శాతాల్లో ఇరువురు పంచుకుంటారు.  ఇది మినిమమ్ గ్యారంటీ పద్ధతి.

ఇక రెండో పద్దతి కమీషన్ బెస్డ్ పద్ధతి. ఇందులో డిస్ట్రిబ్యూటర్  సినిమా సాధించిన మొత్తం వసూళ్లలో  కొంత శాతం కమిషన్ గా  ఆదాయం పొందుతారు. అది 20 లేదా 30 శాతం కావచ్చు.  ఈ పద్ధతిలో లాభ నష్టాలు వస్తే భరించాల్సి వచ్చేది నిర్మాతనే.  మరో పద్ధతి అవుట్ రైట్ సేల్ పద్ధతి. దీంట్లో  ఒక మొత్తానికి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కు తన సినిమా హక్కులు  పూర్తిగా అమ్మెస్తారు.ఆ తర్వాత సినిమా బాగా ఆడితే వచ్చే లాభాలు, సినిమా ఆడకపోతే నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించాల్సి ఉంటుంది. ఈ పద్ధతుల్లో డిస్ట్రిబ్యూటర్స్ , నిర్మాతలు ఆదాయన్ని పొందుతారు.

3. ఎగ్జిబిటర్లు/థియేటర్ల యజమానులు (Exhibitors/Theatre Owners) -  సినిమా పూర్తయ్యాక ప్రజల వద్దకు ఆ సినిమాను తీసుకెళ్లేది సినిమా ధియేటర్ల యజమానులే. సినిమా రంగంలో వీరి పాత్ర చాలా కీలకం. ఇందులో సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్స్ లు  అనే రెండు రకాల సినిమా ప్రదర్శన రీతులు ఉన్నాయి.  సింగిల్ స్క్రీన్ ధియేటర్లను ఎగ్జిబిటర్ తాను కోరుకున్న సినిమా ను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్ కు అద్దె చెల్లించి  సినిమాను ప్రదర్శిస్తారు. టికెట్ల అమ్మకాలు, పార్కింగ్ ఫీజు తినుబండారాలు అమ్మకాల ద్వారా, ప్రకటనల ప్రదర్శనల ద్వారా వీరు ఆదాయం పొందుతారు. డిస్ట్రిబ్యూటర్స్ కు చెల్లించే అద్దె రోజు వారీ, లేదా వారానికి ఓసారి అని ఎగ్జిబిటర్ తో ఒప్పందం చేసుకుని చెల్లిస్తారు.

సినిమా ఆడినా, ఆడకపోయినా డిస్ట్రిబ్యూటర్ కు ఆదాయం వస్తుంది. కాని సినిమా ఆడకపోతే మాత్రం ఎగ్జిబిటర్ చాలా నష్టపోతారు.  విద్యుత్ ఖర్చులు,  సినిమా హాలులో పని చేసే వారికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్ ధియేటర్ల యజమానుల పరిస్థితి. ఇక మల్టీప్లెక్స్ లు  ఆదాయ పంపిణీ   వేరేగా ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్ లలో టికెట్ల నుండి వచ్చిన ఆదాయాన్ని డిస్ట్రిబ్యూటర్, ధియేటర్ యజమాని పంచుకుంటారు. ఇందు కోసం ఎంత శాతం అనేది ముందుగానే ఒప్పందం  చేసుకుంటారు. వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారు.


ధియేటర్ల బంద్ కు ప్రధాన కారణం ఇదే..

సింగిల్ స్క్రీన్ ధియేటర్లు ఇప్పుడు చెల్లిస్తున్న అద్దె విధానం లాభదాయకంగా లేదని దీన్ని మార్చి ఆదాయంలో భాగస్వామ్యం ఇవ్వాలన్నది వీరి డిమాండ్.  ధియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రేక్షుకల సంఖ్య తగ్గడం, సినిమా విడుదలయిన వారం పది రోజుల్లోనే ఓటీటీ ల్లో ప్రదర్శించడం వల్ల తమకు నష్టం జరుగుతోందన్నది సింగిల్ ధియేటర్ ఓనర్ల వాదన.  అద్దె చెల్లింపు విధానం కాకుండా, టికెట్ల ఆదాయంలో పర్సంటేజి పద్ధతిలో  ఆదాయ భాగస్వామ్యం ఉండాలన్నది వీరి డిమాండ్. ఈ డిమాండ్ తోనే  సింగిల్ స్క్రీన్ ధియేటర్ యజమానులు  జూన్ 1వ తేదీన  ధియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారు. 

ఈ డిమాండ్ పక్కకు పోయి రాజకీయ రంగును పులుముకుంది. వీరి సమస్యలు చర్చించకుండా  తెలుగు సినిమా పెద్దలు  ఒకరిపై ఒకరు బురద చల్లుకునే పరిస్థితి నెలకొంది.  ఇప్పటికే వందలాది సినిమా హాళ్లు మూతపడిన పరిస్థితి ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. మల్టిప్లెక్స్ ల హడావుడితోను, ఓటీటీ ప్లాట్ ఫాంలతో ఇక  మిగిలిన సింగిల్ స్క్రీన్ ధియేటర్లు కూడా మూతపడతాయేమో మరి.

 

 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget