అన్వేషించండి

Anchor Shyamala: యాంకర్ శ్యామలాను తిట్టిపోస్తున్న జనం - ఏమైపోయావ్ అంటూ ఘోరమైన కామెంట్లు

Anchor Shyamala: ఏపీలో వైసీపీకి సపోర్ట్ చేయడానికి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు ముందుకు రాగా అందులో యాంకర్ శ్యామల ఒకరు. ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే ఇప్పుడు తనపై ట్రోల్స్ మొదలయ్యాయి.

Trolls On Anchor Shyamala: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల ప్రచారంలో చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా పాల్గొన్నారు. అందులో చాలామంది జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయగా.. చాలా తక్కువమంది వైఎస్ జగన్‌కు సపోర్ట్‌గా మాట్లాడారు. వాళ్లలో యాంకర్ శ్యామలా ఒకరు. ప్రచారాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న సమయంలో శ్యామలా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోల్స్ మొదలయ్యాయి. ‘‘పిఠాపురంలో వంగా గీత గెలుపు ఆల్రెడీ ఖాయమయిపోయింది. నేను ఆమెను వచ్చి కలవడం, ప్రచారంలో పాల్గొనడం కేవలం భారీ మెజారిటీ కోసం మాత్రమే’’ అని శ్యామలా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తోడేలు, నక్క కథ..

వైసీపీకి సపోర్ట్ చేస్తూ వైఎస్ జగన్ గురించి గొప్పగా మాట్లాడుతూ యాంకర్ శ్యామలా.. ప్రచారాల్లో ఇతర పార్టీలపై, వ్యక్తులపై తీవ్రంగా విమర్శలు చేసింది. అందులో భాగంగానే ఒక ముసలి తోడేలు, నక్క కథ కూడా చెప్పింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ముసలి తోడేలు, నక్కలతో పోల్చింది. ప్రజలను కుందేళ్లని.. తోడేలు, నక్కలను నమ్మొద్దని సలహా ఇచ్చింది. అప్పట్లో శ్యామలా చెప్పిన కథ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీకి సపోర్ట్ చేయడం మొదలయినప్పటి నుండే శ్యామలాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత తను సపోర్ట్ చేసిన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో మరోసారి తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

పోస్టులు డిలీట్..

ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది శ్యామలా. వైసీపీకి, జగన్‌కు సపోర్ట్‌గా ఎన్నో వీడియోలు పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని వీడియోలు కనిపించడం లేదు. చాలావరకు డిలీట్ చేసింది. అంతే కాకుండా ఉన్న వీడియోలకు, ఫోటోలకు కూడా కామెంట్స్ ఆప్షన్‌ను తీసేసింది. దీంతో శ్యామలా ఏమైపోయింది, ఎందుకు సైలెంట్ అయ్యింది అంటూ ఇతర పార్టీ సపోర్టర్స్ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. పిఠాపురంలో వంగా గీతనే గెలుస్తుందని అంత నమ్మకంగా చెప్పిందని, మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వైసీపీకి అంతలా సపోర్ట్ చేసినందుకు శ్యామలా కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌పై వ్యాఖ్యలు..

వైసీపీ కేవలం జనాల కోసమే పనిచేస్తుందని, అనుక్షణం జనాల గురించే ఆలోచిస్తుందని చాలా గొప్పగా చెప్పుకొచ్చింది శ్యామలా. అంతే కాకుండా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పై నేరుగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు పవన్ కళ్యాణ్ సాయం చేయడమే తను ఇప్పటివరకు చూడలేదని చెప్పింది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా తనపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యల వల్ల వైసీపీపై మరింత నెగిటివిటీ పెరగడం ఖాయమని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మొత్తానికి టీడీపీ, జనసేన ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా శ్యామలాపై వ్యతిరేకత మొదలయ్యింది. దీంతో తను కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Are Syamala (@syamalaofficial)

Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget