SSMB29: కోరాపుట్లో మహేష్ - రాజమౌళి మూవీ షూటింగ్ పూర్తి... ప్రియాంక, జక్కన్న సిగ్నేచర్లు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా?
SSMB 29 : ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న మహేష్ - రాజమౌళి మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే జక్కన్న కోరాపుట్ హాస్పిటాలిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్ నోట్ ను రిలీజ్ చేయగా, వైరల్ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ SSMB 29. గత కొన్ని రోజుల నుంచి ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన పలువురు అధికారులు చిత్ర బృందాన్ని కలవడానికి రాగా, మహేష్ బాబు వారితో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళి థాంక్యూ నోట్ ను రిలీజ్ చేశారు.
ఒడిశాలో షూటింగ్ పూర్తి
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ మూవీ షూటింగ్ ను హైదరాబాద్లో మొదలు పెట్టారు. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా చూసుకుంటున్నారు జక్కన్న. హైదరాబాద్లో ఇప్పటికే ఓ షెడ్యూలు పూర్తి చేసిన టీం, గత కొన్ని రోజుల నుంచి ఒడిశాలోని కోరాపూర్ కొండలపై షూటింగ్ జరుపుతున్నారు. ఈ కీలక షెడ్యూల్లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమార్,ప్రియాంక చోప్రా వంటి ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన షూటింగ్ సంబంధించి ఓ వీడియో లీకైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒడిశా డిప్యూటీ సీఎం మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు సంబంధించిన షూటింగ్ కోరా ఫుట్ లో జరుగుతుందని చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అయింది. అందులో ఆమె ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. ఈ మేరకు కోరాపుట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెబుతూ రాజమౌళి స్పెషల్ థాంక్స్ నోట్ ని రిలీజ్ చేశారు. అందులో మరిన్ని అడ్వెంచర్స్ చేయడానికి మళ్లీ కోరాపుట్ కు తిరిగి వస్తానని రాశారు జక్కన్న. ఆ నోట్ లో రాజమౌళి, ప్రియాంక చోప్రా సంతకాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రియాంక చోప్రా, రాజమౌళి సైన్స్ చూడని అభిమానులు ఈ థాంక్స్ నోట్ లో చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. అంతేకాకుండా సెట్లో మహేష్, ప్రియాంక, రాజమౌళితో పలువురు ఫోటోలు దిగగా, అవి వైరల్ అవుతున్నాయి.
Even SS Rajamouli himself referred to the upcoming film as #SSMB29, not #SSRMB!#SSMB29 💥🔥 #MaheshBabu 👑 pic.twitter.com/i0fp0B9vOb
— Movies4u (@Movies4uOfficl) March 18, 2025
And that’s a wrap for ~ Action Sequence Done ✅ #SSMB29 🎬✨@urstrulyMahesh 🦁🔥
— Odisha MAHESH FC™🌍 (@OdishaMaheshFC) March 18, 2025
Truly a privilege to witness the magic unfold. Grateful for the journey and beyond excited for what’s next @ssrajamouli !
~ 💃🕺🧨 The shoot is going on a full swing✨@priyankachopra @ssk1122 pic.twitter.com/MrzRT47QRL
కోరాపుట్ లో జక్కన్న వాలీబాల్ మ్యాచ్
ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైమ్ లోనే కోరాపుట్ జిల్లాలో డియోమాలి అనే పర్వత ప్రాంతాన్ని సందర్శించారు రాజమౌళి. అక్కడి గిరిజన యువకులతో టైం స్పెండ్ చేయడమే కాకుండా వాలీబాల్ మ్యాచ్ కూడా ఆడారు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ మరోసారి మూవీ షూటింగ్ జరుగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే జన్నక్క టీం మార్చి 28 వరకు కోరాపుట్ దగ్గరలో ఉన్న తలమలి అనే ఏరియా, దాని పరిసర ప్రాంతాలలో చిత్రీకరణకు అనుమతి అనుమతులు తీసుకున్నారు. కానీ అనుకున్న టైమ్ కంటే ముందే షెడ్యూల్ ను పూర్తి చేశారు.





















