News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cinema Seized : ఏపీలో "బొమ్మ" బంద్ ! రూల్స్ పాటించని సినిమాహాళ్లు పదుల సంఖ్యలో సీజ్ !

ఏపీలో సినిమా హాళ్లలోసోదాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని వాటిని అధికారులు క్లోజ్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:


ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు సినిమా ధియేటర్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.  ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తెలితే అక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇలా  దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ పదుల సంఖ్యలో ధియేటర్లను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఒక్క రోజే ఏకంగా 52 ధియేటర్లు సీజ్ చేశారు. అనుమతుల రెన్యూవల్ నిబంధనలు పాటించలేదని  నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులు ఇచ్చిన వెంటనే వాటిని మూసివేయించారు. థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలు వసూలు, లైసెన్స్ పై దృష్టి కపెట్టామని.. అధికారులు తెలిపారు. ప్రజలు సైతం  థియేటర్లపై ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. 

Also Read: అమెరికాలో రికార్డులను తిరగరాస్తున్న ఆర్ఆర్ఆర్... జోరుగా ప్రీబుకింగ్స్

పెద్ద ఎత్తున ధియేటర్లను సీజ్ చేయడంతో  జాయింట్ కలెక్టర్ రాజబాబు ను కలిసిన ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కలిశారు. అన్ని నిబంధనలు పాటిస్తే రెండు రోజుల్లో ధియేటర్లను రెన్యూవల్ చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.  ఇతర జిల్లాల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు.  జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలు, తహసీల్దార్ల వరకు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు థియేటర్ల తనిఖీలు చేస్తున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్‌లో విక్రయించే తినుబండారాల ధరలను, థియేటర్ల నిర్వహణకు వివిధ శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. 

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ప్రభుత్వ ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంచినీటి సీసాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, నిబంధనలు పాటించలేదని కొన్ని థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మరికొన్నింటినీ సీజ్ చేస్తున్నారు. పలు చోట్ల జరిమానాలు విధిస్తున్నారు. అధికారుల తనిఖీలతో సినిమా హాళ్ల యజమానుల్లో ఆందోళన నెలకొంది.  దీంతో పలువురు ధియేటర్ల యజమానులు స్వచ్చందంగా మూసివేయాలని నిర్ణయించకున్నారు. ఈ కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో సినిమా హాళ్లు మూతపడ్డాయి. 

Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!

పలు చోట్ల ఎగ్జిబిటర్లు ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేమని.. టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావని చెబుతూ.. మూసేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పండగ సీజన్ కావడంతో సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తనిఖీల పేరుతో ధియేటర్లను సీజ్ చేస్తూండటంతో టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. మొత్తంగా చూస్తే ఏపీలోసినీ పరిశ్రమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ధియేటర్ యాజమాన్యాలు ప్రత్యేకంగా సమావేశమై.. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నాయి. 

Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

 
Published at : 23 Dec 2021 08:33 PM (IST) Tags: ANDHRA PRADESH cinema halls attack on cinema notices to theaters siege of cinema halls AP govt shock to Tollywood

ఇవి కూడా చూడండి

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

Animal: మిడ్ నైట్ to ఎర్లీ మార్నింగ్ - ఇకపై ‘యానిమల్’ 24 గంటల షోస్

Animal: మిడ్ నైట్ to ఎర్లీ మార్నింగ్ -  ఇకపై ‘యానిమల్’ 24 గంటల షోస్

Hi Nanna: 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ బిజినెస్ - నాని రేంజ్ తగ్గిందా? 'దసరా' కంటే ఇంత తక్కువా?

Hi Nanna: 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ బిజినెస్ - నాని రేంజ్ తగ్గిందా? 'దసరా' కంటే ఇంత తక్కువా?

Nani: శరీరాన్ని టార్చర్ చేయకూడదు - నాని ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట

Nani: శరీరాన్ని టార్చర్ చేయకూడదు - నాని ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

టాప్ స్టోరీస్

Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

Pavan Babu Meet :    చంద్రబాబుతో పవన్ భేటీ -  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

CM  Revanth  :  మాట నిలబెట్టుకున్న రేవంత్ -  దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌
×