Salaar 2: 'రాజా సాబ్' ఫ్లాప్ తర్వాత 'సలార్ 2' పక్కన పెట్టేశారా? ప్రభాస్ నిర్మాతల రియాక్షన్ ఏమిటంటే?
Salaar 2 Update: భారీ అంచనాల నడుమ విడుదలైన 'ది రాజా సాబ్' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. దాంతో 'సలార్ 2' పక్కన పెట్టేశారని పుకార్లు షికార్లు చేశాయి. వాటిపై ప్రభాస్ నిర్మాతలు రియాక్ట్ అయ్యారు.

సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ 'ది రాజా సాబ్' రిలీజ్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల్లో కొందరిని, ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. దాంతో 'సలార్ 2' పక్కన పెట్టేశారని పుకార్లు షికార్లు చేశాయి. 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ రిజల్ట్ తర్వాత సోషల్ మీడియాలో 'సలార్ 2' గురించి ఒక్కసారిగా ఊహాగానాలు మొదలు అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని కామెంట్స్ చేశారు. వాటిపై ప్రభాస్ నిర్మాతలు రియాక్ట్ అయ్యారు.
'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ కెరీర్పై ప్రశ్నలు
నిజానికి... 'ది రాజా సాబ్' సరిగ్గా ఆడకపోవడంతో ప్రభాస్ కెరీర్ గురించి రకరకాల చర్చలు మొదలు అయ్యాయి. అదే సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న ఆయన సినిమా 'స్పిరిట్' విడుదల తేదీని (మార్చి 5, 2027) ప్రకటించారు. దాంతో 'సలార్ 2'పై సందేహాలు మొదలు అయ్యాయి.
'సలార్ 2' ఆగలేదు... పుకార్లకు నిర్మాతల బ్రేక్!
ఇటీవల 'సలార్: పార్ట్ 1 - సీజ్ఫైర్' సీక్వెల్ను 'ది రాజా సాబ్' వైఫల్యం తర్వాత నిలిపివేశారని కొందరు పేర్కొన్నారు. ఈ సినిమా కొంత కాలం పాటు వాయిదా పడవచ్చన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఆ సినిమాను పక్కన పెట్టి, పూర్తిగా కొత్త సినిమా చేయాలని ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు నిర్మాతలు ఆ పుకార్లు అన్నిటికీ తెర దించారు. 'సలార్ 2' గురించి వస్తున్న వార్తలను తప్పు అని చెబుతూ... చిత్ర బృందం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ షేర్ చేసింది. అది నటి శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేశారు. అందులో ఆమె ప్రభాస్తో కలిసి కనిపించింది. ఇద్దరూ మొబైల్లో ఏదో చూస్తూ నవ్వుతూ కనిపించారు. దాంతో అభిమానులకు ఉత్సాహం వచ్చింది. 'సలార్ 2' ట్రాక్లో ఉందని అర్థం అయ్యింది.
View this post on Instagram
'సలార్' గురించి చెప్పాలంటే... 'సలార్: పార్ట్ 1 - సీజ్ఫైర్'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం అనేది కథ. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి కూడా నటించారు. ఇప్పుడు 'సలార్ 2: శౌర్యాంగ పర్వం' మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మొదలు కానుంది.























