![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్తో ‘హనుమాన్’ నిర్మాతలు మూవీ
Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అప్కమింగ్ మూవీ గురించి చాలాకాలంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. తాజాగా తన కెరీర్లో 18వ చిత్రాన్ని స్వయంగా అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో.
![Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్తో ‘హనుమాన్’ నిర్మాతలు మూవీ Sai Dharam Tej announces his upcoming movie with Prime Show entertainment Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్తో ‘హనుమాన్’ నిర్మాతలు మూవీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/5916308f7cf201c022f294c00fca34401719043394130802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీలో హీరోలంతా ఎప్పటికప్పుడు సినిమాలతో బిజీగా ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ ఫ్యామిలీలోని సీనియర్ హీరోలు బిజీ అవ్వగా.. యంగ్ హీరోలు మాత్రం స్లో అయ్యారు. అలా స్లో అయినవారిలో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. గతేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ అప్కమింగ్ మూవీపై ఇంకా క్లారిటీ లేదు. తాజాగా తన తరువాతి చిత్రం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించాడు ఈ మెగా హీరో. తన అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఒక హిట్ నిర్మాతతో చేతులు కలపనున్నాడు సాయి ధరమ్ తేజ్.
ఆ నిర్మాతలతో..
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ను నిర్మించి దేశవ్యాప్తంగా విపరీతమైన లాభాలు సంపాదించుకున్న నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ చిత్రాన్ని కూడా ఈ నిర్మాతలే నిర్మించడానికి ముందుకొచ్చారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఎస్డీటీ 18 తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.
డిఫరెంట్ కాన్సెప్ట్..
‘నా నెక్స్ట్ ఎస్డీటీ 18. ఇది మరింత స్పెషల్గా ఉండబోతుంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి’ అంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ పోస్టర్పై ‘ఈ నేల తన రాక కోసం ఎదురుచూస్తోంది. తను భూమి లోతుల్లో నుండి పుట్టుకొస్తాడు’ అని ఉంది. దీంతో ఇదేదో డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న చిత్రమని ఫ్యాన్స్ అంతా సాయి ధరమ్ తేజ్కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ముందుగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి చాలాకాలంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ అప్పుడే మరో మూవీని ప్రారంభించాడు ఈ హీరో. ఎస్డీటీ 18తో రోహిత్ అనే దర్శకుడు టాలీవుడ్కు పరిచయమవుతున్నాడు.
View this post on Instagram
రెండు హిట్ సినిమాలు..
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు సాయి ధరమ్ తేజ్. ఈ రెండు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాయి. ఒకే ఏడాది రెండు సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన యంగ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ రికార్డ్ దక్కించుకున్నాడు. ఇక మళ్లీ తనను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మధ్యలో ‘సత్య’ అనే ఒక తెలుగు మ్యూజిక్ వీడియోలో కూడా ఈ మెగా హీరో మెరిశాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం తన అప్కమింగ్ మూవీస్ నుండి అప్డేట్స్ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.
Also Read: అమితాబ్ బచ్చన్ చేసిన పనికి ఆశ్చర్యపోయా - నిర్మాత అశ్వినీ దత్ ఎమోషనల్ పోస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)