అన్వేషించండి

Rashmika Mandanna: కేరళ వయనాడ్ బాధితుల సహాయార్థం రష్మిక భారీ విరాళం - నేషనల్ క్రష్ ఎంత ఇచ్చారంటే?

Wayanad Landslides: కేరళలోని వయనాడ్ ప్రాంతంలో విపత్తు జరగడంతో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వాటి కోసం నేషనల్ క్రష్ రష్మికా మందన్నా భారీ విరాళం ప్రకటించారు.

ప్రకృతి విలయ తాండవం చేయడంతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (Kerala Wayanad Landslide) ప్రాంతంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. వాటి కోసం నేషనల్ క్రష్ రష్మిక భారీ విరాళం ప్రకటించారు. 

వయనాడ్ సహాయక చర్యలకు 10 లక్షలు
కేరళలో వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడడంతో జనజీవనం తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఘటన పట్ల రష్మిక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి (Kerala CM Relief Fund)కి 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా సమయంలోనూ రష్మిక పలు మంచి పనులు చేశారు. పలువురికి వస్తు, ధన, ఆహార రూపంలో సహాయ సహకారాలు అందించారు.

''ఇటువంటి కష్ట సమయంలో కేరళ ప్రజలు అందరూ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నారు. త్వరలో దీన్నుంచి అందరూ బయట పడాలని ఆశిస్తున్నా'' అని రష్మిక పేర్కొంది.

Also Read: ప్రియదర్శి హీరోగా మరో సినిమా - కథానాయికగా ఫేమస్ కంటెంట్ క్రియేటర్.... ఆ డీటెయిల్స్ తెలుసా?

Rashmika Mandanna Upcoming Movies: రష్మికా మందన్నా విషయానికి వస్తే... వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ అన్నట్లు పేరు తెచ్చుకున్నారు. నేషనల్ క్రష్ నుంచి వరుస పాన్ ఇండియా విజయాలతో ఇప్పుడు పాన్ ఇండియా క్వీన్ అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో శ్రీ వల్లిగా మరోసారి, ఇంకా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'సికిందర్', తెలుగు - తమిళ భాషల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్', ధనుష్ - నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర', ఇంకా 'రెయిన్ బో' సినిమాల్లో నటిస్తున్నారు రష్మిక.

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్


మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా 'లక్కీ భాస్కర్' నిర్మిస్తున్న ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం రూ. 5 లక్షలను కేరళ వాయనాడ్ బాధితుల సహాయార్థం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. చియాన్ విక్రమ్, మలయాళ స్టార్ టోవినో థామస్ సహా పలువురు తారలు విరాళాలు ఇస్తూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.

Also Readఅఫీషియల్‌... 'భారతీయుడు 2' ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Dussehra 2024: అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
Embed widget