'పెద్ది' సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ తొలిసారి జాతీయ వేదికపై కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన 'సమ్మిట్ 2026'లో ఆయన పాల్గొన్నారు.
Ram Charan: మల్టీప్లెక్స్లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు
Ram Charan On Popcorn Rates: రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాన్క్లేవ్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. పాప్ కార్న్ రేట్లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

- 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ జాతీయ సమ్మిట్లో పాల్గొన్నారు.
- మల్టీప్లెక్స్లలో అధిక పాప్కార్న్ ధరలపై ఆయన వ్యాఖ్యలు చేశారు.
- ఈ ధరలు ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయని చరణ్ అన్నారు.
- ప్రేక్షకులు చరణ్ వ్యాఖ్యలు స్వాగతించారు, థియేటర్లలో మార్పు ఆశిస్తున్నారు.
'పెద్ది'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభించాయి. అయితే... బాక్సాఫీస్ బరిలో ఆశించిన స్థాయిలో సినిమాకు కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, తెలుగులో వసూళ్ళ సునామీ సృష్టించింది. 'పెద్ది' సినిమా విడుదల తర్వాత తొలిసారి జాతీయ వేదికపై రామ్ చరణ్ కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమ్మిట్ 2026'లో ఆయన పాల్గొన్నారు. అందులో పాప్ కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ కామెంట్... మల్టీప్లెక్స్లకు షాక్!
ఇండియాలో ఇప్పటికీ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నారు రామ్ చరణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ... "మన దేశంలో నేటికీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న అతి చౌకైన వినోద సాధనం సినిమా మాత్రమే. కుటుంబంతో కలిసి అందరూ థియేటర్కు వెళ్లి... వెండితెరపై సినిమా చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఓ కమ్యూనిటీ యాక్టివిటీ. సినిమా చూడటం కేవలం కాలక్షేపం మాత్రమే కాదు... మన కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు వేదికగా నిలుస్తుంది'' అని చెప్పారు.
'గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్' ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమ్మిట్లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇండియాలో సినిమా, ప్రేక్షకుల అనుబంధం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా విషయంలో ఒక్కరి నుంచి వినబడుతున్న ప్రధాన విమర్శ, సమస్య - టికెట్ రేట్లు. టికెట్స్ కంటే ముఖ్యంగా పాప్ కార్న్ రేట్లు. ఆ అంశంలో నిర్మొహమాటంగా, ధైర్యంగా తన అభిప్రాయాలను - అలాగే ప్రేక్షకులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రస్తావించారు.
''థియేటర్లలో పాప్ కార్న్ రేట్లు కొంచెం తగ్గితే... ప్రేక్షకులకు సినిమా ఎక్స్పీరియన్స్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ విపరీతంగా పెరగడంపై మెజారిటీ ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ రేట్స్ వల్ల కొంత మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్నారు. వెనుకంజ వేస్తున్నారు'' అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు మల్టీప్లెక్స్లకు షాక్ అని చెప్పాలి. పీవీఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్లో రేట్స్ మీద ఎప్పట్నుంచో ప్రేక్షకులలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ వ్యాఖ్యలకు అటువంటి మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలకు షాక్ అని చెప్పాలి.
సాధారణ ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యను జాతీయ వేదికపై రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ప్రస్తావించడం నిజంగా అభినందనీయమని పలువురు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. ఆల్రెడీ వస్తున్న వ్యతిరేకత, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Frequently Asked Questions
రామ్ చరణ్ ఇటీవల ఏ వేదికపై పాల్గొన్నారు?
థియేటర్లలో ఏ విషయంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు?
థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అధిక ధరల వల్ల ప్రేక్షకులు సినిమా చూడటానికి వెనుకంజ వేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మన దేశంలో సినిమా గురించి రామ్ చరణ్ ఏమని అభిప్రాయపడ్డారు?
సినిమా ఇప్పటికీ భారతదేశంలో సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న అతి చౌకైన వినోదం అని రామ్ చరణ్ అన్నారు. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేసే సామూహిక అనుభవం అని ఆయన పేర్కొన్నారు.
రామ్ చరణ్ వ్యాఖ్యలు మల్టీప్లెక్స్లకు ఎలాంటి ప్రభావం చూపాయి?
రామ్ చరణ్ వ్యాఖ్యలు మల్టీప్లెక్స్లకు షాక్ అని చెప్పాలి. పీవీఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్లలో అధిక రేట్లపై ప్రేక్షకులలో ఉన్న వ్యతిరేకతను ఆయన ప్రస్తావించారు.
ట్రెండింగ్ వార్తలు






















