అన్వేషించండి

Ram Charan: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌ను కలిసిన రామ్ చరణ్, ఉపాసన

Ram Charan in Mumbai: గత కొన్నిరోజులుగా రామ్ చరణ్, ఉపాసన కలిసి ముంబాయ్‌లో చక్కర్లు కొడుతున్నారు. అదే క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర సీఎం ఏక్‌రాథ్ షిండేతో సమావేశమయ్యారు.

Ram Charan - Upasana: ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గతకొంతకాలంగా తన భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో కలిసి ముంబాయ్‌లో చక్కర్లు కొడుతున్నారు. ముందుగా రామ్ చరణ్ ముంబాయ్‌కు వెళ్లగా.. ఆ తర్వాత ఉపాసన కూడా కూతురితో అక్కడికి చేరుకున్నారు. అయితే అసలు రామ్ చరణ్ అక్కడికి ఎందుకు వెళ్లారు? ఇన్నిరోజులు అక్కడ ఎందుకు ఉంటున్నారు? అనే విషయాలు తెలియక ముందే చరణ్ వెళ్లి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఉపాసనతో కలిసి ఏక్‌నాథ్ షిండే ఇంటికి వెళ్లి.. కాసేపు తనతో ముచ్చటించాడు రామ్ చరణ్. 

ముంబయిలో బిజీ బిజీగా చరణ్, ఉపాసన
Ram Charan: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌ను కలిసిన రామ్ చరణ్, ఉపాసన

రామ్ చరణ్ కుటుంబమంతా ముంబాయ్‌కు చేరుకున్న తర్వాత ముందుగా మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. క్లిన్ కారా ఆరవ నెల పుట్టినరోజు సందర్భంగా వారంతా కలిసి ఆలయానికి వెళ్లారని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. ఇక కొన్నిరోజుల తర్వాత వీరు వెళ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ను కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కేవలం ఏక్‌నాథ్‌తో మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు అందరితో రామ్ చరణ్, ఉపాసన ముచ్చటించారు. 

తిలకం వేడుకతో పాటు హారతి
Ram Charan: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌ను కలిసిన రామ్ చరణ్, ఉపాసన

రామ్ చరణ్, ఉపాసనకు వెల్‌కమ్ చెప్పడానికి ఏకనాథ్ షిండే శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నారు. ఇంటికి స్పెషల్ గెస్టులు రావడంతో ఏక్‌నాథ్ కోడలు వృషాలి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారని సమాచారం. తిలకం వేడుకతో పాటు హారతి కార్యక్రమం కూడా నిర్వహించారట. ఈ సమావేశం కోసం డెనిమ్ షర్ట్‌లో స్టైలిష్‌గా రెడీ అయ్యారు. తన భార్య ఉపాసన ఎప్పటిలాగానే ఒక వైట్ సింపుల్ కుర్తాలో కనిపించారు. కానీ ఏక్‌నాథ్‌తో రామ్ చరణ్ జంట ఎందుకు సమావేశం అయ్యింది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన.. తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

పర్సనల్ పని కోసమే ముంబాయ్‌కు..

రామ్ చరణ్ ముంబాయ్‌లో ల్యాండ్ అయినప్పటి నుంచి షూటింగ్ కోసం వచ్చారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చరణ్ కేవలం పర్సనల్ పనిపైనే ముంబాయ్ వెళ్లారని, కొన్నివారాల పాటు అక్కడే ఉంటారని తన టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. కొన్నాళ్ల పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గేమ్ ఛేంజర్’కు చరణ్ కొన్నిరోజులు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ మొదలయినప్పటి నుంచి పలు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. మొదటి పాటను విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించిన మూవీ టీమ్.. ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ‘గేమ్ ఛేంజర్’ కోసం రెండోసారి కియారా అద్వానీతో జతకడుతున్నాడు రామ్ చరణ్. సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Ram Charan: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌ను కలిసిన రామ్ చరణ్, ఉపాసన

Also Read: మంచి తండ్రిగా ఉండలేకపోయా, పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రమే ఇంటికెళ్లేవాడిని - ప్రశాంత్ నీల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget