అన్వేషించండి

Aditi Shankar: 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?

Aditi Shankar Tollywood Debut: దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. యంగ్ హీరోలు చేస్తున్న మల్టీస్టారర్ సినిమాలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఇంతకీ, ఆ సినిమా ఏది? హీరోలు ఎవరో తెలుసా?

శంకర్ తమిళ దర్శకుడు కావచ్చు... కానీ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆయన తెలుసు. తెలుగులోనూ శంకర్ అంటే అభిమానం చూపించే జనాలు చాలా మంది ఉన్నారు. ఆయన ఫ్యామిలీ గురించి తెలుసా? ఆయన కుమార్తె అదితి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలుసా? అతిథి శంకర్ నటించిన రెండు తమిళ సినిమాలు ఆల్రెడీ విడుదల అయ్యాయి. మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం కావడానికి రెడీ అవుతోంది. ఇంతకీ తెలుగులో అదితి శంకర్ నటిస్తున్న తొలి సినిమా ఏదో తెలుసా?

గరుడన్ తెలుగు రీమేక్... అదితి హీరోయిన్!
'దేవర' విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల నిమిత్తం చెన్నై వెళ్ళినప్పుడు దర్శకుడు వెట్రిమారన్ అంటే తనకు అభిమానం అని, ఆయన దర్శకత్వంలో స్ట్రయిట్ తమిళ సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ తెలిపారు. వెట్రీమారన్ దర్శకత్వంలో కాకుండా నిర్మాణంలో రూపొందిన తమిళ సినిమా 'గరుడన్'. అందులో సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ హీరోలుగా నటించారు. 

ఇప్పుడు 'గరుడన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అల్లరి నరేష్ 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది‌. ఇందులో కథానాయకగా నటించే అవకాశం అదితి సొంతం అయ్యిందని తెలిసింది. ఆల్రెడీ 'గరుడన్' తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు అయింది. ఒక 15 రోజుల పాటు హీరోల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో మొదలు కాబోయే షెడ్యూల్ సమయానికి అదితి కూడా జాయిన్ అవుతారని టాక్.

అదితీతో పాటు ఆనంది, దివ్య పిళ్లై...
అతిథి శంకర్ కాకుండా 'గరుడన్' తెలుగు రీమేక్ లో మరో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంది. అంటే సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కదా! ఒక్కొక్కరి సరసన ఒక్కో అందాల భామ అన్నమాట. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అదితి శంకర్ నటిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి మిగతా ఇద్దరు కథానాయికలు ఎవరు? అంటే... తెలుగు అమ్మాయి ఆనంది (Actress Anandhi) ఒకరు. మరొకరు... మలయాళ నటి దివ్య పిళ్లై (Divya Pillai). అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మంగళవారం సినిమా గుర్తుందా? అందులో ఊరి జమీందారు చైతన్య భార్యగా నటించిన అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయి దివ్య పిళ్లై.

Also Read: క్రిస్మస్ నుంచి సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' - తనయుడి కోసం చిరంజీవి త్యాగం?


శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం మీద కేకే రాధామోహన్ నిర్మాణంలో 'గరుడన్' తెలుగు రీమేక్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రాన్ని వీలైతే వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.‌ తెలుగు నుంచి సంక్రాంతి సీజన్ టార్గెట్ చేస్తూ చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకవేళ భారీ సినిమాలు ఏవైనా వాయిదా పడితే ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. 

నటిగా కాకుండా గాయనిగా అదితి శంకర్ ఆల్రెడీ టాలీవుడ్ డెబ్యూ ఇచ్చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'గని' సినిమాలో 'రోమియో జూలియట్' పాటను ఆవిడ పాడారు. ఇప్పుడు కథానాయికగా తెలుగు డెబ్యూకి రెడీ అవుతున్నారు. తండ్రి దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశారని టాక్.

Also Readమేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Who is Head Coach Amol Muzumdar | ఎవరీ అమోల్ మజుందార్..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget