![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Woman Producer: పెళ్లి పేరుతో టాలీవుడ్ మహిళా నిర్మాత మోసం - పోలీసులను ఆశ్రయించిన కెమెరామెన్
Woman Producer Cheating: మహిళా నిర్మాత మోసం చేసిందంటూ కెమెరామెన్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యి.. ముగురు పిల్లలు ఉన్న ఆమె..
![Woman Producer: పెళ్లి పేరుతో టాలీవుడ్ మహిళా నిర్మాత మోసం - పోలీసులను ఆశ్రయించిన కెమెరామెన్ Cheating Case Filed on Tollywood Lady Producers in Jubilee Hills Police Station Woman Producer: పెళ్లి పేరుతో టాలీవుడ్ మహిళా నిర్మాత మోసం - పోలీసులను ఆశ్రయించిన కెమెరామెన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/20ac4f9b197e72be790b94554926b1771707384177619929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Woman Producer Cheating: మహిళా నిర్మాత మోసం చేసిందంటూ కెమెరామెన్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యి.. ముగురు పిల్లలు ఉన్న ఆమె అబద్ధం చెప్పి తనని పెళ్లి చేసుకుందంటూ కెమెరా అస్టిస్టెంట్ నాగార్జున బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తన నుంచి భారీగా డబ్బులు కూడా దండుకుందని అతడు పోలీసులతో వాపోయాడు. పోలీసులు తెలిపిన సమచారం ప్రకారం.. వెంకటగరి ప్రాంతానికి ఎందిన పుల్లంశెట్టిన నాగార్జనున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్గా పని చేస్తున్నాడు.
రాత్రి డిన్నర్కు పిలిచి ఆపై..
సందీప్ కిషన్ 'భైరవకోన' సినిమా షూటింగ్ సమయంలో ఈ మూవీకి నిర్మాత వ్యవహరించిన మహిళ నిర్మాతతో పరిచయం ఏర్పడింది.ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఈ క్రమంలో ఓ రోజు మూవీ షూటింగ్ అయిపోయాక సదరు మహిళా నిర్మాత.. కెమెరామెన్ నాగార్జునకు ఫోన్ చేసి తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించింది. ఆమె పిలుపుతో వెళ్లిన నాగార్జునకు అప్పుడే పెళ్లి చేసుకుందామని కోరింది. తనకు అల్రెడీ ఒక పెళ్లి అయ్యిందని, భర్తకు దూరంగా ఉంటున్నా అని చెప్పిందట. విడాకులు కూడా అయిపోయాంటూ మాయమాటలు చెప్పి అతడిని పెళ్లికి ఒప్పించింది. ఆమె ప్రపోజల్కు ఒకే చెప్పాడు. ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరు చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.
Also Read: 'కల్కి 2898 AD' ఓవర్సీస్ రైట్స్ - ఆ రేంజ్లో డిమాండ్ చేస్తున్న నిర్మాత?
డబ్బులు తీసుకుని తిరిగి కేసు పెట్టింది..
ఇక పెళ్లయిన కొన్నిరోజులుగా తనకు అర్జెంట్గా డబ్బులు కావాలని నాగార్జున వద్ద నుంచి రూ.18.5 కోట్లు నగదుగా తీసుకుంది. ఆ తర్వాత రూ. 10 లక్షలు అకౌంట్లో వేయించుకుంది. తన డబ్బు కావాలని అడగినా ఆమె తిరిగి ఇవ్వకపోగా. ఆపై బెదిరింపులకు దిగింది. అంతేకాదు నాగార్జున బాబుపై కూకట్పల్లి పీఎస్లో పోలీసు కేసు కూడా నమోదు చేసిందట. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతడు భార్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నాగార్జున బాబు కంటే ముందు ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలిసి బాధితుడు షాక్ అయ్యాడు.
తనకు ఒక్కసారి మాత్రమే పెళ్లి అయ్యిందని, పిల్లలు లేరని అబద్ధం చెప్పిందంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు చేసుకున్న ఆశమల్లిక 2016లో గాజువాక పోలీస్ స్టేషన్లో మొదటి భర్త భరత్పై.. 2019లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో రెండో భర్త శ్రీనివాస్పై ఫిర్యాదులు చేసిందని పోలీసుల విచారణలో తెలిసింది. నకిలీ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడి.. వాళ్ల ఆస్తిలో వాటా కొట్టేస్తున్నట్లుగా కూడా వెల్లడైంది. ఆమె గురించి తెలుసుకున్న నాగాబాబు తాజాగా జూబ్లిహిల్స్ పోలీసుల స్టేషన్లో ఆమె కేసు నమోదు చేశాడు. కాగా ఆ కిలాడి లేడి పేరు ఆశా మల్లిక అని, ఆమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
Also Read: అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్ - షూటింగ్ అప్పుడే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)