అన్వేషించండి

Shanthi Priya: నా మోకాళ్లు చూసి అక్షయ్ అవమానించాడు - భానుప్రియ సోదరి శాంతి ప్రియా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై నటి శాంతిప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడితో కలిసి సినిమా చేసే సమయంలో తన కలర్ గురించి దారుణ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది.

బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన 'ఓ మై గాడ్ 2' థియేటర్లలో  సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా హీరో అక్షయ్ కుమార్ పై నటి శాంతి ప్రియ షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో అతడితో సినిమా చేస్తున్న సమయంలో తన రంగు గురించి అవమానించేలా మాట్లాడారని వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అక్షయ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది.   

శాంతిప్రియను అవమానించిన అక్షయ్ కుమార్

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన భానుప్రియకు శాంతిప్రియ స్వయానా చెల్లి అవుతుంది. ఈమె కూడా తెలుగులో పలు సినిమాలు చేసింది. తెలుగుతో పోల్చితే తమిళంతో పాటు హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించింది. అక్షయ్ కుమార్, శాంతిప్రియ కలిసి ‘ఇక్కె పె ఇక్కా' అనే సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే అక్షయ్ తనను అవమానించేలా మాట్లాడారని శాంతిప్రియ చెప్పింది. షూటింగ్ లో భాగంగా ఓ రోజు శాంతి ప్రియ మోకాళ్ల పైకి ఉండేలా దుస్తులు ధరించింది. ఆమె మోకాళ్లను చూనసి అక్షయ్ ముందుగా దెబ్బ తగిలిందా? అని అడిగాడట. లేదని చెప్పడంతో అంత నల్లగా ఉన్నాయేంటి? అని కామెంట్ చేశాడట. వెంటనే సెట్స్ ఉన్న వాళ్లంతా నవ్వారని చెప్పింది. 

భానుప్రియకూ తప్పని తిప్పలు

‘ఇక్కె పె ఇక్కా' సినిమా చేసే సమయంలో తనకు 23 ఏండ్లు ఉంటాయని శాంతి ప్రియ చెప్పుకొచ్చింది. అక్షయ్ కామెంట్స్ తర్వాత చాలా బాధపడినట్లు వివరించింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు చెప్పింది. తాను మాత్రమే కాదు, తన అక్క భానుప్రియ కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు శాంతి ప్రియ వెల్లడించింది. కొన్ని పత్రికలు ఏకంగా భానుప్రియ తన ముఖం మీద ఉన్న మొటిమెలను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుందంటూ దారుణంగా రాశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన రంగు గురించి దారుణ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్ ఇప్పటికీ సారీ చెప్పలేదని వెల్లడించింది. ఓసారి ఇదే విషయం గురించి తనకు చెప్తే, జోక్ చేశాను అన్నారని చెప్పింది. 1994 నుంచి శాంతి ప్రియ సినిమాలకు దూరం అయ్యింది. 2014లో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తోంది.  

ఇక తాజాగా అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత అజిత్ అంధరే వెల్లడించారు.  

Read Also: ఫ్యామిలీ ఫస్ట్ - ఫారిన్ వెకేషన్స్ పై మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget