Kamalinee Mukherjee: అందుకే టాలీవుడ్కు దూరమయ్యా - అసలు రీజన్ చెప్పిన కమలినీ ముఖర్జీ
Kamalinee Mukherjee: 'గోవిందుడు అందరివాడేలే' మూవీ తర్వాత టాలీవుడ్కు దూరమయ్యారు హీరోయిన్ కమలినీ ముఖర్జీ. దీనికి గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Kamalinee Mukherjee About Ram Charan Govindudu Andarivadele Movie: ఆనంద్... ఓ మంచి కాఫీ లాంటి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ను పలకరించి అలల అందాల 'గోదావరి'తో తెలుగింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా మారారు కమలినీ ముఖర్జీ. 'గమ్యం'తో మంచి హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చాలా వరకూ సినిమాలు చేసినా అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే, రిజల్ట్ ఎలా ఉన్నా తన అందం, నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లోనూ నటించారు కమలినీ. గత కొంతకాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆనంద్ చిత్రానికి ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కమిలినీ ముఖర్జీ. ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి, నాగవల్లి, మా అన్నయ్య బంగారం వంటి మూవీస్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు పదేళ్లుగా ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు. ఇందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆ మూవీనే అసలు కారణం
కమలినీ ముఖర్జీ 2014లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే' మూవీలో నటించారు. ఇందులో శ్రీకాంత్ జోడీగా నటించారు. ఆ తర్వాత ఆమె తెలుగులో మూవీ చేయలేదు. 'ఓ సినిమాలో నేను పోషించిన ఊహించిన స్థాయిలో తెరకెక్కలేదు. దీంతో ఆ క్యారెక్టర్పై అసంతృప్తి కలిగింది. ఈ విషయంలో నేను చాలా ఫీలయ్యా. అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదు.
డైరెక్టర్ ఓ సీన్ చేయమంటారు. ఆ తర్వాత అది బాగా లేదనో మళ్లీ దాన్ని ఎడిటింగ్లో తీసేస్తుంటారు. ఈ విషయం నటీనటులకు చెప్పరు. మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా మనం చేసిన సీన్, డైలాగ్స్ తీసేస్తే చాలా బాధగా ఉంటుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను. నేను తెలుగులో అన్నీ రకాల ఎమోషన్స్ పండించా. బలమైన స్త్రీ పాత్రలతో పాటు అన్నీ రకాల పాత్రలు కూడా చేశాను. 'గోవిందుడు అందరివాడేలే' మూవీలో నాకు సరైన ఇంపార్టెన్స్ లేదని అనిపించింది. మూవీ కంప్లీట్ అయ్యాక నా రోల్ చూసుకుని నాకే ఇబ్బందిగా అనిపించింది.' అంటూ చెప్పారు.
నాగార్జున ఎప్పటికీ హ్యాండ్సమ్
తాను కలిసి నటించిన హీరోల గురించి కూడా కమలినీ ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'నాగార్జున ఎప్పటికీ చాలా హ్యాండ్సమ్. కో యాక్టర్స్తో ఆయన చాలా సరదాగా ఉంటారు. ఇక శర్వానంద్ చాలా నేచరల్గా... అంకిత భావంతో పని చేస్తారు. స్టార్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.' అని చెప్పారు. 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత ఆమె తెలుగులో ఎలాంటి మూవీస్ చేయలేదు. తమిళంలో 'ఇరైవి' మూవీలో కనిపించారు. మలయాళంలో 'పులి మురుగన్' మూవీలోనూ నటించారు. ఆ తర్వాత వివాహం, ఫ్యామిలీ బాధ్యతలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.






















