![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss Telugu Season 7: రతిక మైండ్ గేమ్కు బలి పశువైన టేస్టీ తేజ - పాపం, అనవసరంగా బుక్కయ్యాడు!
‘బిగ్ బాస్’ సీజన్ 7లో రతిక పెట్టిన చిచ్చు.. ముగ్గురికి శాపమైంది. ఒకరినొకరు అపార్థం చేసుకుని హౌస్ నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేసుకున్నారు.
![Bigg Boss Telugu Season 7: రతిక మైండ్ గేమ్కు బలి పశువైన టేస్టీ తేజ - పాపం, అనవసరంగా బుక్కయ్యాడు! Bigg Boss Telugu Season 7: Tasty Teja in trouble with Rathika's mind game Bigg Boss Telugu Season 7: రతిక మైండ్ గేమ్కు బలి పశువైన టేస్టీ తేజ - పాపం, అనవసరంగా బుక్కయ్యాడు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/6d7a959ba91d8e0fbbef82421f7a388e1693932827515239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి రతిక పెట్టిన చిచ్చు.. టేస్టీ తేజాకు అంటుకుంది. అనవసరంగా గౌతం, ప్రిన్స్ల దృష్టిలో అనవసరంగా విలన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తర్వాత రాబోయే నామినేషన్స్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్’ హౌస్లోకి వస్తూనే రతిక ఓ సీక్రెట్ టాస్క్ ఐడియాతో పుల్లలు పెట్టే పనిలో నిమగ్నమైంది.
ముందుగా శోభా శెట్టి దగ్గరకు వెళ్లి ఒక సీక్రెట్ టాస్క్ ఉంది చేస్తావా అని అడిగింది రతిక. దీంతో శోభా కూడా చేస్తాను.. ఏంటో చెప్పు అని పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. రెండు ముక్కలైన హార్ట్ను చూపించి.. ‘‘అమర్దీప్, ప్రియాంక మధ్య ఏదో ఒక గొడవ పెట్టాలి, ఫైట్ క్రియేట్ చేయాలి’’ అని చెప్పింది రతిక. ఏం చేసినా గొడవ జరగాలి అని చెప్పింది. ‘‘వాళ్లిద్దరు నిజంగా గొడవపడితే నువ్వు టాస్క్ విన్ అవుతావ్, నామినేషన్ నుంచి సేవ్ అవుతావ్, ఒకవేళ వారు గొడవ పడకపోతే నువ్వు నేరుగా నామినేషన్స్లోకి వెళ్తావ్’’ అని శోభాతో అంటుంది రతిక. ఇదంతా విన్న శోభాకు అనుమానం వచ్చింది. ‘‘టాస్క్ పరంగా నాకు నీ మీద నమ్మకం రావడం లేదు’’ అని మోహం మీదే చెప్పేసింది. ‘‘ఏ విధంగా చూసుకున్న బిగ్ బాస్ నీకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ను వేరేవాళ్లకు చెప్పకూడదు కదా.. ఒకవేళ నాకు చెప్పావ్ అని నేను చేస్తే అది నీకు మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది కదా’’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది శోభా. ఆ తర్వాత అమర్దీప్, ప్రియాంక దగ్గరకు వెళ్లి రతిక చెప్పిన విషయం అంతా చెప్పింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్తో ఆ పని చేయించాలని ప్రయత్నించి విఫలమైంది.
శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్తో సీక్రెట్ టాస్క్ చేయడం కష్టమని తెలుసుకున్న రతిక.. వెళ్లి టేస్టీ తేజకు అదే విషయాన్ని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ పెడితే.. సీక్రెట్ టాస్క్ గెలిచినట్టే, తరువాతి వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతావు అని చెప్పింది. ఎవరు ఆ ఇద్దరు అని తేజ అడగగా.. గెస్ చేయమంటుంది. గౌతమ్ కృష్ణ, యావర్ అని చెప్తే.. అవును కరక్టే అని చెప్పి వారిద్దరి మధ్య గొడవపెట్టమని ఎంకరేజ్ చేస్తుంది. దీంతో తేజ.. యావర్ దగ్గరకు వెళ్లి.. గౌతమ్ నువ్వు షోఆఫ్ చేస్తున్నావని అన్నాడని తెలిపాడు. అలాగే గౌతం దగ్గరకు వెళ్లి ప్రిన్స్ తనని అలా అంటున్నాడని చెప్పాడు. రతిక ఇదంతా సైలెంట్గా గమనించింది.
యావర్కు, గౌతమ్ కృష్ణకు మధ్య గొడవపెట్టాలనుకున్న తేజ ప్రయత్నం.. కొంతవరకు ఫలించింది. తేజ చెప్పిన కారణంతో.. గౌతమ్ను ప్రిన్స్ నామినేట్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తాను అలా అనలేదని, తేజ కావాలనే మన ఇద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా ప్రిన్స్ను నామినేట్ చేసి ప్రిన్స్పై నామినేషన్ చేశాడు. అంతేకాదు.. అలా పుల్లలు పెట్టిన కారణంతో అమర్దీప్ టేస్టీ తేజాను నామినేట్ చేశాడు. రతిక వేసిన ఉచ్చులో పడ్డ తేజ వల్ల.. ప్రిన్స్, గౌతమ్లు అనవసరంగా నామినేట్ చేసుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడే అవకాశాలున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)