అన్వేషించండి

Bigg Boss Season 7 Latest Promo: షకీలాకు దెయ్యం పట్టిందా? వణికిపోయిన కంటెస్టెంట్లు - శివాజీ ఆటగాడే!

తాజాగా కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయడానికి శివాజీ.. ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్.. ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా భయపడేలా చేసింది.

బిగ్ బాస్ హౌజ్‌లో అసలు కంటెస్టెంట్స్‌కు ఎలా టైమ్‌పాస్ అవుతుంది? ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, బయట ప్రపంచానికి ఎలాంటి యాక్సెస్ లేకుండా అసలు వారు అన్ని రోజులు ఒకేచోట ఎలా ఉంటారు? ఇలాంటి అనుమానాలు చాలామంది ప్రేక్షకులకు ఉంటాయి. కానీ అదే కదా.. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత వరకు కంటెస్టెంట్స్ బోర్ ఫీల్ అవ్వకూడదు, ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యేలా చేయకూడదు.. అదే వారికి అన్నింటికంటే అతిపెద్ద టాస్క్. తాజాగా కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయడానికి శివాజీ.. ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్.. ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా భయపడేలా చేసింది. శివాజీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌లో షకీలా కూడా చేయికలిపారు.

ఇది కదా ప్రేక్షకులకు కావాల్సిన ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 7లో డే 4కు సంబంధించి తాజాగా మరో ప్రోమో విడుదలయ్యింది. అందులో ముందుగా షకీలాకు జ్వరం వచ్చినట్టుగా చూపించారు. అప్పుడు గౌతమ్ కృష్ణ వచ్చి తనకు ఏమయ్యిందో చూసే ప్రయత్నం చేశాడు. ‘‘ఫీవర్ వచ్చిందా? నిద్రొస్తుందా’’ అని గౌతమ్ అడగగా లేదు అంటూ సమాధానం ఇచ్చారు షకీలా. ఆ తర్వాత గౌతమ్.. తనను ట్రీట్ చేసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా కళ్లు మూసుకున్నారు షకీలా. అది చూసి కిరణ్ రాథోడ్, శివాజీ భయపడ్డారు. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదని అనుకొని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు ఇతర కంటెస్టెంట్స్. కానీ షకీలా మాత్రం పడుకోకుండా అలాగే చూస్తూ కూర్చున్నారు. కట్ చేస్తే.. అక్కడే ప్రోమోలో అసలైన ట్విస్ట్ వచ్చింది.

ఆ ముగ్గురు వేసిన ప్లాన్..
షకీలా ఇలా ప్రవర్తించే ముందు శివాజీ, కిరణ్ రాథోడ్, షకీలా కలిసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శివాజీ.. ‘నాకు బోర్ కొడుతుంది’ అన్నాడు. దానికి ‘నేనేం చేయాలి’ అంటూ ప్రశ్నించారు షకీలా. ‘సడెన్‌గా నిద్రలోకి నుండి లేచి అందరినీ భయపెట్టాలి’ అని ఐడియా ఇచ్చాడు శివాజీ. దానికి కిరణ్ రాథోడ్ భయపడినా.. వెంటనే ముగ్గురూ ఈ ప్లాన్‌కు ఒప్పుకున్నారు. అదే ప్లాన్‌తో కంటెస్టెంట్స్‌ను భయపెట్టాలని అనుకున్నారు. శివాజీ చెప్పినట్టుగానే షకీలా బెడ్ మీద కూర్చొని పడుకోకుండా అలాగే చూస్తూ కూర్చున్నారు. అప్పుడు శివాజీ.. మీరు వెళ్లి మాట్లాడండి అంటూ కొంతమంది కంటెస్టెంట్స్‌ను షకీలా దగ్గరికి పంపించాడు. కానీ ఎవరూ తన దగ్గర వరకు వెళ్లే ధైర్యం చేయలేదు.

నిద్రపోలేదు.. నిద్రపోనివ్వలేదు..
దామిని, శుభశ్రీ.. షకీలా ప్రవర్తనను చూసి చాలా భయపడ్డారు. ఇదంతా తను వేసిన ప్లానే అయినా శివాజీ అయితే యాక్టింగ్ ఇరగదీశారు. షకీలా సడెన్‌గా నిద్రలో నుండి లేచి ఉలిక్కిపడినట్టుగా చేసినందుకు ‘ఎవరూ లేరు’ అంటూ ధైర్యం చెప్తూ మళ్లీ నిద్రపుచ్చే ప్రయత్నం చేశాడు. తేజ కూడా షకీలాను నిద్రపుచ్చే ప్రయత్నం చేయగా.. అప్పుడు కూడా అలాగే సడెన్‌గా లేచి, అతడిని భయపెట్టింది. అందరూ కంటెస్టెంట్స్ షకీలా ఎందుకలా చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్‌లో ఉండిపోయారు. శివాజీ అయితే ఏం టెన్షన్ లేదు అంటూ తను చేస్తున్న ఈ ఫన్నీ టాస్క్ గురించి బిగ్ బాస్‌కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత షకీలా.. దామిని ప్లాన్ అంతా లీక్ చేసింది. మొత్తానికి తను వేసిన ప్లాన్‌తో శివాజీ.. తాను పడుకోకుండా, ఎవరిని పడుకోనివ్వకుండా చేశాడు. ప్రతీరోజూ శివాజీ.. ఇలా కొత్త కొత్త ఐడియాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

Also Read: బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూసేశా - స్వీటీ, షారుఖ్ మూవీస్‌పై రాజమౌళి రివ్యూ ఇది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
RBI Warning: ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
Embed widget