అన్వేషించండి

యాంకర్ అనసూయ షాకింగ్ నిర్ణయం? ఇకపై కనిపించదా?

జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడంతో అనసూయకు కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమె లైఫ్ మారిపోయింది

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో తో హాట్ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అనసూయ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక బుల్లితెరపై కనిపించరా అని వర్రీ అవుతున్నారు.

జబర్దస్త్ షోలో దాదాపు 8 ఏళ్ళు యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడా షో ను కూడా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మా టీవీ’లో యాంకర్‌గా కనిపించారు. ప్రస్తుతం ఇప్పుడు అనసూయ మొత్తానికి యాంకరింగ్ కెరీర్‌నే వదిలేస్తున్నారని, ఇకపై ఆమె పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి.  

న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ షో విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడంతో అనసూయకు కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమె లైఫ్ మారిపోయింది. కొన్నాళ్ళు జబర్దస్త్ లో చేసిన తర్వాత నెమ్మదిగా సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అటు యాంకరింగ్, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. హీరో నాగార్జున  చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నటించి గ్లామరస్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ.

ఆ తర్వాత వరుసగా క్షణం, రంగస్థలం, కథనం, యాత్ర, కిలాడీ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత పాపులర్ అయ్యారు. అంతేకాదు, ఐటమ్ సాంగ్స్ కూడా చేసి కుర్రకారు గుండెల్లో మంచి స్థానం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. రంగమార్తాండ, వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్, సినిమాల్లో కనిపించనున్నారు అనసూయ.

మరోవైపు అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల ఆమెను ఆంటీ అని పిలిస్తే ఏకంగా కేసులు పెడతానని బెదిరించడం తెలిసే ఉంటుంది. దీంతో అనసూయను చాలామంది దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అనసూయ అవేవీ పట్టించుకోకుండా సినిమా అవకాశాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ బుల్లితెర షో లకు దూరంగా ఉన్న అనసూయ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. యాంకర్ గా కొత్త ప్రోగ్రామ్స్ కూడా ఏమీ అనౌన్స్ చేయలేదు. సినిమాల్లో భారీగా అవకాశాలు రావడం వల్లే ఆమెకు టీవీ షోలకు సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలిసింది. తన స్థానంలో చెల్లిని యాంకర్‌గా దింపే ప్రయత్నాలు కూడా చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. మరి, దీనిపై అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Embed widget