Viral Video: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య... నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Aishwarya Rai: నటి ఐశ్వర్య రాయ్ దర్శకుడు మణిరత్నం కాళ్లకు నమస్కారం చేసింది. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా IIFA అవార్డును అందుకున్న ఆమె గురువు కాళ్లు మొక్కింది.

Aishwarya Rai Touched Mani Ratnam's Feet: దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. తనను సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఆయనను ఎంతో గౌరవిస్తుంది. ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కింది. ఆమె సంస్కారానికి వేడుకలో పాల్గొన్న వాళ్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండటంతో పాటు తన ఎదుగుదలకు కారణమైన వాళ్లను మర్చిపోకూడదనడానికి ఐశ్వర్య నిలువెత్తు నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఉత్తమ నటిగా IIFA అవార్డును అందుకున్న ఐశ్వర్య
ప్రతిష్టాత్మక IIFA ఉత్సవంలో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ పలు అవార్డులను దక్కించుకుంది. ‘పొన్నియన్ సెల్వన్ II’ చిత్రానికి గాను, మణిరత్నం బెస్ట్ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన విక్రమ్ ఉత్తమ నటుడు (తమిళం) అవార్డును అందుకున్నారు. ఈ మూవీలో నందిని పాత్రలో కనిపించిన ఐశ్వర్య ఉత్తమ నటి (తమిళం) అవార్డును అందుకుంది. అనంతరం దర్శకుడు మణిరత్నం దగ్గరికి వెళ్లి ఆయనకు కాళ్లకు నమస్కరించింది. మణిరత్నం ఆమెను భుజం తట్టి అభినందనలు చెప్పారు. ఈ వీడియో చూసి ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
మణిరత్నం నా గురువు- ఐశ్వర్య
ఉత్తమ నటిగా IIFA అవార్డును అందుకున్న ఐశ్వర్య మణిరత్నంను తాను గురువుగా భావిస్తానని చెప్పింది. ఆయన పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని వెల్లడించింది. “మణిరత్నం నా గురువు. తొలి సినిమా నుంచే ఆయనతో కలిసి పని చేశాను. లెజెండరీ దర్శకుడితో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకు పలు అవార్డులు లభించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నందిని పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నాను. అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు” అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
ఐశ్వర్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మణిరత్నం
నటి ఐశ్వర్యరాయ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే లెజెండరీ దర్శకుడు మణిరత్నం. 1997లో ఆమె ‘ఇరువన్’ అనే తమిళ సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో విడుదల అయ్యింది. ఆ తర్వాత మణిరత్నంతో కలిసి ఐశ్వర్యరాయ్ ‘గురు’, ‘రావణ్’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు చేసింది. అందుకే ఐశ్వర్యకు మణిరత్నం అంటే ప్రత్యేక గౌరవం. ఆయన కారణంగానే ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరినట్లు ఐశ్వర్య భావిస్తుంది. అందుకే, ఆయన ఎక్కడ కనిపించినా ఎనలేని గౌరవాన్ని చూపిస్తుంది. కాళ్లకు నమస్కరించిన తన అభిమానాన్ని చాటుకుంటుంది.
Read Also: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు... IIFA వేడులో అందజేసిన బాలీవుడ్ ప్రముఖులు
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















