అన్వేషించండి

వైసీపీ నాలుగో సిద్ధం సభ డేట్‌ ఫిక్స్‌, సభా వేదిక అదే..!

YCP News : సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ జోరు పెంచుతోంది. సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది. నాలుగో సిద్ధం సభకు డేట్‌ ఫిక్స్‌ చేసింది.

Siddham Meeting In Palnadu On March 3rd : సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ జోరు పెంచుతోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో మూడు సభలను నిర్వహించింది. రాయలసీమకు సంబంధించి కొద్దిరోజులు కిందట రాప్తాడులో సుమారు పది లక్షల మందికిపైగా ప్రజలతో సభను నిర్వహించిన వైసీపీ.. నాలుగో సిద్ధం సభకు డేట్‌ ఫిక్స్‌ చేసింది. ఈ సభను రాప్తాడు తరహాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాప్తాడు సభతో వైసీపీ కేడర్‌లో ఉత్సాహం పెరిగిందని, దాన్ని కొనసాగించేలా ఈ సభను నిర్వహించనున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభను కనీసం ఐదు లక్షల మందితో నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. 

మేదరమెట్లలో నాలుగో సభ

నాలుగో సిద్ధం సభను పల్నాడు ప్రాంతానికి సంబంధించి నిర్వహిస్తున్నారు. మార్చి మూడో తేదీన బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో నిర్వహించనున్నారు. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా జిల్లాలు పరిధిలోని 54 నియోజకవర్గాలు నుంచి కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కేడర్‌ను ఉత్సాహపరిచేలా ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

మేనిఫెస్టో ప్రకటించేనా..?

వైసీపీ మేనిఫెస్టో ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాప్తాడు సభ వేదికగా మేనిఫెస్టోను సీఎం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆ దిశగా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటన చేయలేదు. ఎన్నికలు సభలు తరహాలోనే భారీ ఎత్తున సభలు వైసీపీ నిర్వహిస్తోంది. ఇదే చివరి సిద్ధం కావడంతో కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయడంతోపాటు ప్రజలకు కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏం చేయబోతామన్న దానిపై సీఎం ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న సభలు ప్రజల్లోకి జోరుగా వెళుతున్న నేపథ్యంలో.. చివరి సభలోనే మేనిఫెస్టో విడుదల చేయడం వల్ల మేలు కలుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి సీఎం జగన్‌ ఆ దిశగా ప్రకటన చేస్తారా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget