తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేశాయి.
Telangana Municipal Elections 2026: తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పాగా వేసిందెవరు? ఎక్కడ ఎవరు గెలిచారు?
Telangana Municipal Elections 2026: తెలంగాణలో కార్పొరేషన్లో ప్రజలంతా కాంగ్రెస్కు జై కొట్టారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక చోట హంగ్ వస్తోంది.

- 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు గెలుచుకుంది.
- బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యతతో విజయం సాధించింది.
- కొత్తగూడెంలో హంగ్ ఏర్పడి, వామపక్షాల మద్దతు కీలకం కానుంది.
- మహబూబ్నగర్, నిజామాబాద్లలో లెక్కింపు అనంతరం స్పష్టత రానుంది.
Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాలుగ కార్పరేషన్లను కైవశం చేసుకుంది. బీజేపీ ఒకదాంట్లోపాగా వేసింది. మిగతా ఒక్కచోట మాత్రమే హంగ్ వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా కాంగ్రెస్కు భాగం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఒక్క కార్పొరేషన్లో కూడా కారుకు చోటు లేదని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. ఇంకా లెక్కింపు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లలో హస్తం పార్టీ ఆధిక్యం సాధించింది. 29 చోట్ల గెలుపొందింది. నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లు ఉంటే అందులో 27 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యాయి. కారు పార్టీ అభ్యర్థులు 9 చోట్ల, బీజేపీ అభ్యర్థులు 4 చోట్ల, ఇతరులు 8చోట్ల గెలుపొందారు.
రామగుండంలో ఉన్న 60 డివిజన్లలో 38 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంటే... 13 మంది బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచారు. బీజేపీ కేవలం ఒక్కటంటే ఒకటే గెలుచుకుంది. ఇతరులు 8 మంది విజయం సాధించారు. మంచిర్యాలలో 60 డివిజన్లకు 44 కాంగ్రెస్ కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 మాత్రమే గెలుచుకుంది. ఇతరులు ముగ్గురు గెలిచారు.
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేసింది. అక్కడ ఆ పార్టీ పాలక మండలి కొలువుదీరనుంది. నిజామాబాద్ జిల్లాల్లో ఇంకా లెక్కింపు జరుగుతోంది. 60 డివిజన్లకు సగానికిపైగా డివిజన్లు కౌంటింగ్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ స్థానాలు బీజేపీ దక్కించుకుంది. తర్వాత స్థానంలో స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 17 చోట్ల గెలిచింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సొంత కార్పొరేషన్ అయిన కరీంనగర్లో కమలం వికసించింది. అక్కడ 66 డివిజన్లు ఉంటే అందులో 30డివిజన్లను బీజేపీ కైవశం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 14 డివిజన్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ సింగిల్ డిజిట్కు పరిమితమైంది.
కొత్తగూడెంలో హంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ డివిజన్లు గెలుచుకోలేకపోయింది. 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో వివిధ పార్టీలు చెందిన వాళ్లు 29 గెలుచుకుంటే కాంగ్రెస్ ఇరవై రెండింటిలో ఆధిక్యం కనబరిచింది. ఇక్కడ వామపక్షాలు కీలకం కానున్నారు. వారితో పాలకమండలి కైవశం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ 8 డివిజన్లలోనే ఆధిక్యత చూపించింది. అయితే తమ మద్దతుతో పాలకమండలి ఛైర్మన్ కైవశం చేసుకోవాలని వామపక్షాలకు కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఇక్కడ రాజకీయం ఎలా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
| కార్పొరేషన్ పేరు | డివిజన్ల సంఖ్య | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతరులు |
| కొత్తగూడెం | 60 | 22 | 8 | 1 | 29 |
| నల్గొండ | 48 | 27 | 9 | 4 | 8 |
| కరీంనగర్ | 66 | 14 | 8 | 30 | 13 |
| మంచిర్యాల | 60 | 44 | 9 | 5 | 3 |
| మహబూబ్నగర్ | 56/60 | 29 | 14 | 6 | 7 |
| నిజామాబాద్ | 60 | 17 | 1 | 28 | 14 |
| రామగుండం | 60 | 38 | 13 | 1 | 8 |
Frequently Asked Questions
తెలంగాణలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి?
కొత్తగూడెం కార్పొరేషన్లో ఫలితాలు ఎలా ఉన్నాయి?
కొత్తగూడెం కార్పొరేషన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు, హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు పోటీ పడ్డారు.
ఏయే కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది?
కాంగ్రెస్ పార్టీ రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది?
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అక్కడ ఆ పార్టీ పాలక మండలి కొలువుదీరనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















