అన్వేషించండి

అసెంబ్లీ టికెట్ల కోసం తెలంగాణ బీజేపీలో తీవ్ర పోటీ- వారంలో 6 వేల ‌అప్లికేషన్లు- దరఖాస్తు చేయని ఎంపీలు

6వేలకు పైగా దరఖాస్తులు రావడంతో...బీజేపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వచ్చిన అప్లికేషన్లను వడపోసేదెలా ? అన్నదే ఇప్పుడు కాషాయ పార్టీకి ఇబ్బందిగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు...ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోస్తోంది. కమలం పార్టీ సైతం ఆశావహుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఊహించని విధంగా దరఖాస్తులు వచ్చాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సామాన్య కార్యకర్తలు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లకు ఎలాంటి రుసుం లేకపోవడంతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారం రోజుల్లేనే ఏకంగా 6వేల 11 అప్లికేషన్లు వచ్చాయ్. బీజేపీకి అభ్యర్థులే లేరన్న కామెంట్లకు దరఖాస్తులతో నోరు మూయించింది. 

6వేలకుపైగా దరఖాస్తులు రావడంతో...బీజేపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వచ్చిన అప్లికేషన్లను వడపోసేదెలా ? అన్నదే ఇప్పుడు కాషాయ పార్టీకి ఇబ్బందిగా మారింది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులన ఎలా ఎంపియా చేయాలి ? తీవ్రంగా పోటీ నియోజకవర్గాల్లో ఎవరికి సీటు ఇవ్వాలి ? ఒకే సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న చోట్ల ఏం చేయాలి ? ఒకరికి టికెట్ ఇస్తే...మరొకరికి ఎలా నచ్చజెప్పాలన్న దానిపై నేతలు తలమునకలయ్యారు. ఇప్పటి వరకు అప్లికేషన్ పరిశీలకు కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. త్వరలో కమిటీని ఏర్పాటు చేసి నియోజకవర్గానికి రెండు మూడు పేర్లను ఎంపిక చేసి హైకమాండ్ కు పంపాలన్న యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. 

బీజేపీలో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌తో పాటు రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. వీరిలో ఏ ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన దరఖాస్తు చేసుకోలేకపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే అప్లికేషన్ ఇచ్చారు.  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దరఖాస్తు చేసుకోలేదు. 

దరఖాస్తు ప్రక్రియలో పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య కార్యకర్తలకే అప్లికేషన్లా? కీలక నేతలకు ఎలాంటి దరఖాస్తు ప్రక్రియ అక్కర్లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బడా నేతలకొక లెక్క.. చోటా లీడర్లకొక లెక్క అన్నట్లుగా తీరు మారిపోయింది. కీలక నేతల దరఖాస్తులు ఎందుకు రావడంలేదని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినా...రాష్ట్ర నాయకత్వం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవాల్సిందేనన్న హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సర్వే ఆధారంగా టికెట్ కేటాయిస్తారా? లేక ధన బలం చూసి కేటాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
HIT 3 Trailer: మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
Mehul Choksi Arrest: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
Embed widget