అన్వేషించండి

Telangana Election 2023: ఓటింగ్‌ పెంచేందుకు ఈసీ కొత్త విధానం- ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్‌ కేంద్రాలు

Telangana Election Commission: హైదరాబాద్‌లో ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్‌ కేంద్రాలు కనిపించనున్నాయి. యువత, మహిళ, దివ్యాంగుల ఓటింగ్‌ పెంచడం కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Defferent Polling Stations In Telangana: తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల సమయం ఉంది. నవంబర్‌ 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది.  దీంతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. గతంలో పోలిస్తే ఓటింగ్‌ శాతం పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొత్త కొత్త ఆలోచనలు కూడా  చేస్తున్నారు. సరికొత్త విధానాలను అవలంభిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాయి.

ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోరు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, దివ్యాంగులు ఉంటారు. యువత కూడా చాలా మంది ఓటు  వేయడంలేదని అధికారులు గుర్తించారు. దీనికి ఎన్నో రకాల కారణాలు. పోలింగ్‌ కేంద్రాల వరకు వెళ్లి.. గంటల తరబడి క్యూలో ఏం ఉంటామని అనుకోవచ్చు. మహిళలు  అయితే... ఎక్కడ ఎవరు ఉంటారో ఏమో... ఏం వెళ్తాములే అన్న ఆలోచన కావొచ్చు. దివ్యాంగులు పొలింగ్‌ కేంద్రాల వరకు వెళ్లలేక... ఓటింగ్‌కు దూరంగా ఉండొచ్చు. ఇలా  కారణం ఏదైనా... ఆయా వార్గాల నుంచి ఎక్కువ మంది ఓట్లు వేయకపోవడం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గుతోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్‌ శాతం పెంచాలని ప్రయత్నిస్తున్నారు  ఎన్నికల అధికారులు. అందరినీ పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. 

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది ఎన్నికల సంఘం. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్‌ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది.  యువత, మహిళలు, దివ్యాంగుల ఓటింగ్‌ శాతం పెంపొందించాలన్న లక్ష్యంతో వీరికి ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక థీమ్‌లతో ఈ పోలింగ్‌ కేంద్రాలను  తీర్చిదిద్దనున్నారు. 

ముఖ్యంగా హైదరాబాద్‌ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మహిళల నిర్వహణలో 75 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయన్నారు. అలాగే 15 పీడబ్ల్యూడీ, మరో 15 యూత్‌ మేనేజ్‌మెంట్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలా 75 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో స్పెషల్‌ థీమ్‌తో ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇక... ఇప్పటికే పోలింగ్‌ శాతం పెంచేందుకు పలు విధానాలను అవలంభిస్తున్నారు అధికారులు. అందుకు టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు. భారీ క్యూలైన్లకు భయపడి ఓటు వేయడం మానుకునే వారి కోసం... కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. పోలింగ్‌ కేంద్రంలోని క్యూలైన్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను... ఓటర్‌ మొబైల్‌ ఫోన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. దీని వల్ల... పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలైన్లు తక్కువగా ఉన్న సమయంలో వచ్చి... ఓటువేసి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా... ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget