అన్వేషించండి

Telangana Elections 2023 Live News Updates: 'కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం' - రాహుల్ గాంధీ

Telangana Election Live News: తెలంగాణ ఎన్నికల ప్రచార వార్తల లైవ్ అప్ డేట్స్ మీకోసం..

LIVE

Key Events
Telangana Elections 2023 Live  News Updates: 'కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం' - రాహుల్ గాంధీ

Background

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏ చిన్న పొరపాటు చేసిన ప్రత్యర్థి పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేస్తుంటాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ (Election code violation) కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు ఇచ్చిన నోటీసులో ఎలక్షన్ కమిషన్ కోరింది. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అశోక్ నగర్ వెళ్లి వర్సిటీ విద్యార్థులతో పాటు నిరుద్యోగులతో సమావేశం అవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు భరోసా ఇవ్వడం తెలిసిందే. అయితే ‘టీ’ వర్క్స్‌ భేటీలో.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు కేటీఆర్ హామీ ఇచ్చారు. కొన్ని తప్పులు జరిగినట్లు ప్రభుత్వమే గుర్తించిందని, బయటివాళ్లు చెప్పకముందే తామే చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేపర్ల లీక్ కారణంగా టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్ ను వినియోగించారని కాంగ్రెస్ నేత సుర్జేవాల మంత్రి కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. అన్ని విషయాలు పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక ఎన్నికల నియామవాళిని కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా తమకు వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. 

రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నలు సంధించారు. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..? దమ్ముంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో గత పదేండ్లలో  తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా..? తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది మా ప్రభుత్వం.. ఈ లెక్కతప్పని నిరూపించగలవా..? అని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

‘మీరు అధికారం  వెలగబెట్టిన పదేండ్ల కాలంలో( 2004-14 ) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని?  కేవలం 10వేల 116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులైన  మీ ప్రేమ..?. మా ప్రభుత్వం ఏడాదికి  సగటున నింపిన సర్కారు కొలువులు 16,850!. కాంగ్రెస్ హయాంలో(  2004-14 ) సంవత్సరానికి ఇచ్చింది  కేవలం 1012 జాబులు..! ఇదీ మీకూ మాకూ  వున్న తేడా..!  మీరొచ్చి మాకు సుద్దులు చెబితే ఎట్లా..? జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..?  ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు  తెలుసా..?  పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూ కు వెళ్లినవా..?  ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు..? అని ప్రశ్నించారు.

17:51 PM (IST)  •  26 Nov 2023

'కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం' - రాహుల్ గాంధీ

తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి, అంథోల్ లో (Sangareddy) నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు ఆక్రమించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్యూలో ఎదురు చూస్తున్నారని, పేపర్ల లీక్ తో వారు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. 

17:50 PM (IST)  •  26 Nov 2023

'ఫాం హౌజ్ లో నిద్రపోయే సీఎం మనకు అవసరమా?' - ప్రధాని మోదీ

ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) హయాంలో తెలంగాణ (Telangana) ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తూఫ్రాన్ (Thupran), నిర్మల్ (Nirmal) లోని సకల జనుల సంకల్పం పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోందని, రాష్ట్రంలో రూ.కోట్లల్లో ఇరిగేషన్ స్కాం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారని, ప్రజల భవిష్యత్ గురించి చింత లేదని ధ్వజమెత్తారు. 

15:46 PM (IST)  •  26 Nov 2023

శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి పాలమూరు గడ్డ పౌరుషం చూపాలి- రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్: యెన్నం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి పాలమూరు గడ్డ పౌరుషం చూపాలి - టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

మీరు నాటిన ఈ మొక్క వృక్షంగా మారింది, సోనియమ్మ మీ బిడ్డకు పీసీసీగా అవకాశం కల్పించింది..

ఈ వృక్షాన్ని నరకాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్, శ్రీనివాస్ గౌడ్ భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారు.

ఈ వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత మీపై ఉంది..

ఈ గడ్డపై 14 కు 14 సీట్లు కాంగ్రెస్ ను గెలిపించి వారికి బుద్ది చెప్పాలి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది.

ముదిరాజు బిడ్డలకు కాంగ్రెస్ 3 సీట్లు ఇచ్చింది... కానీ బీఆరెస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు

బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్.. లక్ష కోట్లు దోచుకుండు, పదివేల ఎకరాలు ఆక్రమించుకుండు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతుంది.

మార్పు కావాలి... కాంగ్రెస్ రావాలి..

15:37 PM (IST)  •  26 Nov 2023

అనుచరుల్ని మంత్రి మల్లారెడ్డి అదుపులో పెట్టుకోవాలి: కాంగ్రెస్ నేత రమణారెడ్డి

మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రజలకు డబ్బులు పంపిణీ స్లిప్ లు పంచుతున్నారని కవరేజ్ చేసిన మీడియాపై బీఆర్ఎస్ నేత దాడిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఖండించారు. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సామాన్యులకు బీఆర్ఎస్ ఏం రక్షణ కల్పిస్తుంది, వాళ్లు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి తన శ్రేణులను నియంత్రించడంతో విఫలమయ్యారని ఆరోపించారు. ఇలాంటి దాడులు ఎవరు చేసిన వాటిని ఉపేక్షించకూడదన్నారు. 

15:36 PM (IST)  •  26 Nov 2023

జర్నలిస్టుపై బీఆర్ఎస్ నేత దాడి, తీవ్రంగా ఖండించిన బీజేపీ

మేడ్చల్ లోని గౌడవెల్లి గ్రామంలో జర్నలిస్టు విశ్వపై బీఆర్ఎస్ నేతల దాడిని మేడ్చల్ మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు బచ్చు కృష్ణప్రియ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలేసి బీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారి సామాన్యులపై, జర్నలిస్టులపై సైతం దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. నగదు పంపిణీకి బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇది గుర్తించిన ఓ జర్నలిస్టు ఈ విషయాన్ని కవర్ చేస్తుండగా, సత్తిరెడ్డి అనే బీఆర్ఎస్ నేత దాడికి పాల్పడ్డారు. ఓటమి భయంతో డబ్బులు పంచుతున్నారనా, లేక అధికారం కోల్పోతామని జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారా అని బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget