Telangana Elections 2023 Live News Updates: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- విచారణకు ఆదేశం
Telangana Election Live News: తెలంగాణ ఎన్నికల ప్రచార వార్తల లైవ్ అప్ డేట్స్ మీకోసం..
LIVE

Background
సిద్దిపేటలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్న మంత్రి హరీష్ రావు
సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో ఉదయం 7-8 గంటల మధ్యలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్న మంత్రి హరీష్ రావు దంపతులు.
ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావొద్దు - సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్లా రెడ్డి
సికింద్రాబాద్: గంటల వ్యవధిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు బందోబస్తు కోసం భారీ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్లా రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో 2 లక్షల 62 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 102 కేంద్రాల్లో 220 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావద్దని స్వఛ్చందంగ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
SR నగర్లో ఓటు వేయనున్న సీఈవో వికాస్ రాజ్
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ రేపు ఉదయం 7.30 గంటలకు పోలింగ్ స్టేషన్ నంబర్ 188-SR నగర్, నారాయణ జూనియర్ కళాశాల, SR నగర్లో కుటుంబ సమేతంగా ఓటు వేయనున్నారు.
ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలి: హైకోర్టు
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వలేదని, దీంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్కు సంబంధించి హైకోర్టులో విచారణ ఈ రోజు ముగిసింది. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనుక వారందరికీ ఆ మేరకు సౌకర్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు లక్షా డెబ్బై ఐదు వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ లో ముగ్గురు పోలీసులను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ ఏ యాదగిరి, ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ లపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి (Musheerabad BRS Candidate) సంబంధిత వ్యక్తులు డబ్బులు పంచుతుంటే చర్యలు తీసుకోలేదని అభియోగాలున్నాయి.
ఓ అపార్ట్ మెంట్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు ముఠా జయసింహా పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో ముఠా జయ సింహాను పోలీసులు తప్పించి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకు సిఐ, ఏసీపీ , డీసీపీ లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

