అన్వేషించండి

జనగామలో బీఆర్‌ఎస్‌ కొత్త ట్విస్ట్, పొన్నాల టికెట్ ఖాయమేనా ?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌లో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థిని మార్చేస్తుందా ? సిట్టింగ్ ఎమ్మెల్యే మత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సీటు త్యాగం చేసినందుకు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతులు కలిపారు. పల్లా విజయం కోసం పని చేస్తానని, పార్టీ గెలుపే తన లక్ష్యమని ప్రకటించాడు. పల్లా, ముత్తిరెడ్డి చేతులు కలిపారు. ఆలింగనాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులు,కార్యకర్తలంతా సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక ఎదురే ఉండదని భావించారు.

ఊహించని పరిణామం 
ఇంతలోనే జనగామ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేపో మాపో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాదని, కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నుంచి హామీ రావడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండేలా చేస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. మంత్రి కేటీఆర్ నచ్చజెప్పడంతో  ముత్తిరెడ్డి వెనక్కితగ్గారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక తనకే టికెట్ ఖరారైందని లోలోపల సంబర పడ్డారు. నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. 

పొన్నాలకు టికెట్ ?
ఏదో అనుకుంటే, ఇంకేదో అయినట్లు పల్లా రాజశ్వేర్ రెడ్డి పరిస్థితి తయారైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున జనగామ నుంచి నాలుగు పర్యాయాలు గెలుపొందిన పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి, పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యను జనగామ అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు గెల్చిన పొన్నాల, నీటి పారుదల, సాంకేతిక విద్యశాఖల మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, తొలి పీసీసీ చీఫ్ పని చేశారు. 

బీసీ కార్డు
పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి చేర్చుకోని, జనగామ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. పొన్నాలకు టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ కార్డు కూడా ప్రయోగించవచ్చన్న లక్ష్యంతో ఉంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని చెప్పడం, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందనే చెప్పేలా ప్రణాళికలు సిద్ధం ఆ పార్టీ నేతలు. పొన్నాల లక్ష్మ్యకు టికెట్ ఇస్తే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

కాంగ్రెస్ నాయకత్వంపై పొన్నాల విమర్శలు
పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడుతూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెబుతూ పార్టీని అమ్మకానికి పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పగ్గాలు అప్పగిస్తే వారు బజార్లో గొడ్లను అమ్మినట్లు టికెట్లను అమ్ముకుంటున్నారని విమర్శలు చేశారు. బీసీలకు సీట్లను ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేయిస్తూ,  బీసీ అభ్యర్థులు ఓడిపోయేవారు అన్నట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారంటూ వారికి టికెట్లు కేటాయించే కుట్ర జరుగుతోందని పొన్నాల మండిపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget